Political News

ఏపీ విభజనపై మోడీ సంచలన వ్యాఖ్యలు

ఎవరెన్ని చెప్పినా.. ఏపీ రాష్ట్ర విభజన చేసిన తీరుపై నెలకొన్న అభ్యంతరాలు అన్ని ఇన్ని కావు. విభజన జరిగిన తీరుపై మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారన్న జంకుతో రాజకీయ పార్టీలు మౌనంగా ఉండటం తెలిసిందే. అప్పుడప్పుడు కొందరు సీనియర్ రాజకీయ నేతలు విభజన జరిగిన తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. నాడు కాంగ్రెస్ వ్యవహరించిన వైఖరిని విమర్శించటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల వేళ.. ప్రధాని మోడీ నోటి నుంచి ఏపీ రాష్ట్ర విభజన వేళ.. పార్లమెంటులో చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావించి మరో సంచలనానికి తెర తీశారు. ఏపీని కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజించిందన్న ఆయన.. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. విభజన జరిగిన తీరు ఎలా ఉందనేది చాలా ముఖ్యమైన విషయంగా ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విభజించినప్పటికి.. ఆ పార్టీని ప్రజలు నమ్మలేదన్న ఆయన.. తమ పార్టీకి చెందిన కీలక నేత వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న వేళ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా.. శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ఇచ్చామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ చాలా అన్యాయం చేసిందన్న ఆయన.. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందని పేర్కొన్నారు. సరైన విధంగా విభజన జరిగి ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. విభజన చట్టంపై ఎలాంటి చర్చలు జరగలేదన్న ఆయన.. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారని గుర్తు చేశారు.

పార్లమెంటులో తలుపులు వేసి.. మైకులు కట్ చేసి.. బిల్లును ఆమోదించారని.. ఇదే ప్రజాస్వామ్యమంటూ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ అహంకారం.. అధికార కాంక్షకు ఇదో నిదర్శనమన్న ఆయన.. విభజన తీరుతో ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికి నష్టపోతున్నాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
సోమవారం మాట్లాడిన ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడగా.. మంగళవారం సైతం తన దాడిని కొనసాగించటం చూసినప్పుడు కలిగే సందేహం ఒక్కటే. విభజన జరిగిన ఎనిమిదేళ్లు కావొస్తోంది. ఇంత వరకు విభజన జరిగిన తీరు గుర్తుకురాని మోడీ మాష్టారికి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చినట్లు? విభజన కారణంగా ఏపీ నష్టపోయిందన్న మోడీ.. మరి ప్రత్యేక హోదా వరాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? కాంగ్రెస్ అహంకారం గురించి మాట్లాడుతున్న మోడీ.. తనకున్న అహంకారం గురించి మర్చిపోవటం ఏమిటో..?  

This post was last modified on February 8, 2022 3:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

25 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

1 hour ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

2 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

2 hours ago