Political News

పార్లమెంటు వేదికగా ఏపీ పరువు తీసిన ఎంపీలు

రాష్ట్రంలో ప్రతి రోజు పడుతున్న గొడవలు సరిపోవన్నట్లు చివరకు పార్లమెంటును కూడా వైసీపీ, టీడీపీ ఎంపీలు వేదికగా చేసుకున్నారు. పార్లమెంటులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి కౌంటరుగా వైసీపీ ఎంపీలు చంద్రబాబు నాయుడుది చేతకానితనం అంటూ  ఎత్తిచూపారు. పైగా రాజ్యసభలో గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ హాలులో క్యాసినో జరిగినట్లు కనకమేడల ఆరోపించారు.

ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని అనేక విధాలుగా చంద్రబాబు నాయుడు అండ్ టీం టార్గెట్ చేస్తునే ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబును మంత్రులు, వైసీపీ నేతలు కూడా అంతే స్ధాయిలో టార్గెట్ చేస్తున్నారు. సరే ఇదంతా రెండు పార్టీల్లో రోజు ఉండే గోలేలే అన్నట్లుగా జనాలు  కూడా చాలా లైటుగా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో సరిపోదన్నట్లు ఇపుడు పార్లమెంటును కూడా రెండు పార్టీల ఎంపీలు వేదికగా చేసుకుంటున్నారు. రెండు పార్టీల ఎంపీల ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటం ద్వారా ఏపీ పరువు పోతోందని ఆలోచించటం లేదు.

రెండు పార్టీల ఎంపీలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటం గతంలో కూడా జరిగాయి. అయితే ఈసారి టీడీపీ ఎంపీలు చాలా తీవ్రంగా మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకం పెరిగిపోతోంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకం పెరిగిపోయిందంటే అందుకు సగం కారణం చంద్రబాబే పాలనే అంటూ వైసీపీ ఎంపీలు ఆరోపించారు.

జగన్ అధికారంలోకి వచ్చేసరికే రాష్ట్రం 2 లక్షల కోట్లు అప్పుల్లో ఉందన్న విషయం ప్రస్తావించారు.  జగన్ కన్నా ముందు చంద్రబాబు సీఎంగా పనిచేశారు కాబట్టి దానికి బాధ్యత వహించాల్సింది కూడా చంద్రబాబే అన్నదది వారి వాదన. టీడీపీ ఎంపీలు నాలుగు మాటలంటే వైసీపీ ఎంపీలు పదిమాటలన్నారు. అందుకనే రెండు పార్టీల ఎంపీలను పార్లమెంటులో ఎవరూ లెక్కచేయటం లేదు. రెండు పార్టీలు రాష్ట్రాభివృద్ధిని కాకుండా వ్యక్తి అజెండాతోనే నడుచుకుంటున్నాయి కాబట్టే నరేంద్ర మోడి కూడా ఏపీని చాలా లైటుగా తీసుకుంటున్నారు. మరి రెండు పార్టీలకు ఎప్పటికి జ్ఞానోదయం అవుతుందో ఏమో.

This post was last modified on February 8, 2022 2:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

15 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

54 minutes ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

12 hours ago