Political News

పార్లమెంటు వేదికగా ఏపీ పరువు తీసిన ఎంపీలు

రాష్ట్రంలో ప్రతి రోజు పడుతున్న గొడవలు సరిపోవన్నట్లు చివరకు పార్లమెంటును కూడా వైసీపీ, టీడీపీ ఎంపీలు వేదికగా చేసుకున్నారు. పార్లమెంటులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి కౌంటరుగా వైసీపీ ఎంపీలు చంద్రబాబు నాయుడుది చేతకానితనం అంటూ  ఎత్తిచూపారు. పైగా రాజ్యసభలో గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ హాలులో క్యాసినో జరిగినట్లు కనకమేడల ఆరోపించారు.

ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని అనేక విధాలుగా చంద్రబాబు నాయుడు అండ్ టీం టార్గెట్ చేస్తునే ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబును మంత్రులు, వైసీపీ నేతలు కూడా అంతే స్ధాయిలో టార్గెట్ చేస్తున్నారు. సరే ఇదంతా రెండు పార్టీల్లో రోజు ఉండే గోలేలే అన్నట్లుగా జనాలు  కూడా చాలా లైటుగా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో సరిపోదన్నట్లు ఇపుడు పార్లమెంటును కూడా రెండు పార్టీల ఎంపీలు వేదికగా చేసుకుంటున్నారు. రెండు పార్టీల ఎంపీల ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటం ద్వారా ఏపీ పరువు పోతోందని ఆలోచించటం లేదు.

రెండు పార్టీల ఎంపీలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటం గతంలో కూడా జరిగాయి. అయితే ఈసారి టీడీపీ ఎంపీలు చాలా తీవ్రంగా మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకం పెరిగిపోతోంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకం పెరిగిపోయిందంటే అందుకు సగం కారణం చంద్రబాబే పాలనే అంటూ వైసీపీ ఎంపీలు ఆరోపించారు.

జగన్ అధికారంలోకి వచ్చేసరికే రాష్ట్రం 2 లక్షల కోట్లు అప్పుల్లో ఉందన్న విషయం ప్రస్తావించారు.  జగన్ కన్నా ముందు చంద్రబాబు సీఎంగా పనిచేశారు కాబట్టి దానికి బాధ్యత వహించాల్సింది కూడా చంద్రబాబే అన్నదది వారి వాదన. టీడీపీ ఎంపీలు నాలుగు మాటలంటే వైసీపీ ఎంపీలు పదిమాటలన్నారు. అందుకనే రెండు పార్టీల ఎంపీలను పార్లమెంటులో ఎవరూ లెక్కచేయటం లేదు. రెండు పార్టీలు రాష్ట్రాభివృద్ధిని కాకుండా వ్యక్తి అజెండాతోనే నడుచుకుంటున్నాయి కాబట్టే నరేంద్ర మోడి కూడా ఏపీని చాలా లైటుగా తీసుకుంటున్నారు. మరి రెండు పార్టీలకు ఎప్పటికి జ్ఞానోదయం అవుతుందో ఏమో.

This post was last modified on February 8, 2022 2:12 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

5 mins ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

2 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

2 hours ago

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

4 hours ago

గోదావరి తీరంలో ‘గ్యాంగ్’ సమరం

https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…

5 hours ago

జ‌గ‌న్ అతి విశ్వాసం.. గెలిపిస్తుందా?

విశ్వాసం ఉండడం త‌ప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు.…

6 hours ago