తెలుగు రాష్ట్రాలలో బలపడాలని భావిస్తున్న బీజేపీ ఇందుకు తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఒకింత స్లోగానే బీజేపీ గేమ్ ప్లాన్ అమలవుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం బీజేపీ పుంజుకుంటున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సహజంగానే బీజేపీని తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్యాంగం మార్చాలని సీఎం కేసీఆర్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ, ఇతర పార్టీలు కేసీఆర్ పై మండిపడుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగాన్ని మార్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుపట్టారు. ఆ మాటలను వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. కేసీఆర్ కొడుకుని, కూతుర్ని పదవుల్లో నుంచి దింపేస్తే సరిపోతుంది… రాజ్యాంగం మార్చాల్సిన అవసరం తీరిపోతుంది అని వీర్రాజు వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో కేసీఆర్ చాలా తప్పులు మాట్లాడారని వీర్రాజు పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఆధ్యాత్మిక పురుషుడు అని ఆయనపై చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు సమీక్షించుకోవాలని సూచించారు.
రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఫ్యామిలీ పార్టీలకు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఈ సందర్భంగా సోము వీర్రాజు పేర్కొన్నారు. ఫ్యామిలీ పార్టీలను భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో ఉంచకుండా చూసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. మోడీ ఇజం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, మిత్రపక్ష పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక చేస్తున్నామని వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే పనుల గురించి సోము వీర్రాజు వెల్లడించడం గమనార్హం
This post was last modified on February 8, 2022 7:50 am
కల్కి, సలార్ లాంటి భారీ విజయాలు ఖాతాలో ఉన్నా కూడా, ప్రభాస్ వాటి సీక్వెల్స్ ను హోల్డ్ లో పెట్టి…
ప్రశాంత్ నీల్ అనగానే భారీ బ్లాస్ట్ లు, తుపాకుల మోతలు, డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే రక్తపాతం గుర్తొస్తాయి.…
విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి కలయికల్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో మెయిన్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్న…
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. తాజాగా రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ…
నిజమే… ఒక్క యువతిని ఇద్దరు స్నేహితులు ప్రేమించిన వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి… గురువారం రాత్రి బెజవాడ…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మెగా 158' ప్రారంభోత్సవ వేడుక నిన్న ఎంత గ్రాండ్ గా జరిగిందో చూశాం.…