నివేదా పేతురాజ్.. ఈమె గురించి పరిచయాలు అవసరం లేదు. `మెంటల్ మదిలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. చిత్రలహరి, బ్రోచేవారెవరురా చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన `అల వైకుంఠపురములో` మూవీలో సెకెండ్ హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా భారీ విజయం సాధించింది. కానీ, నివేదాకు మాత్రం సరైన గుర్తింపు దక్కలేదు. నివేదా పేతురాజ్ చివరిగా `పాగల్` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న నివేదాను టాలీవుడ్ దర్శకనిర్మాతలు పట్టించుకోవడం మానేశారు.
నివేదా చేతిలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క తెలుగు చిత్రం కూడా లేదు. అవకాశాలు లేకపోవడంతో నివేదా పేతురాజ్ కోలీవుడ్పై కన్నేసింది. ప్రస్తుతం అక్కడ వరుస అవకాశాల కోసం విసృతంగా వేట మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా తన అందచందాలతో అందరి చూపులను తనవైపుకు తిప్పుకునేందుకు ట్రై చేస్తోంది. మరి టాలీవుడ్లో సక్సెస్ కాలేకపోయిన నివేదా.. కోలీవుడ్లోనైనా విజయం సాధిస్తుందేమో చూడాలి.
కాగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన `విరాట పర్వం` మూవీలో నివేదా ఓ కీలక పాత్రను పోషించింది. అయితే ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…