నివేదా పేతురాజ్.. ఈమె గురించి పరిచయాలు అవసరం లేదు. `మెంటల్ మదిలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. చిత్రలహరి, బ్రోచేవారెవరురా చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన `అల వైకుంఠపురములో` మూవీలో సెకెండ్ హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా భారీ విజయం సాధించింది. కానీ, నివేదాకు మాత్రం సరైన గుర్తింపు దక్కలేదు. నివేదా పేతురాజ్ చివరిగా `పాగల్` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న నివేదాను టాలీవుడ్ దర్శకనిర్మాతలు పట్టించుకోవడం మానేశారు.
నివేదా చేతిలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క తెలుగు చిత్రం కూడా లేదు. అవకాశాలు లేకపోవడంతో నివేదా పేతురాజ్ కోలీవుడ్పై కన్నేసింది. ప్రస్తుతం అక్కడ వరుస అవకాశాల కోసం విసృతంగా వేట మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా తన అందచందాలతో అందరి చూపులను తనవైపుకు తిప్పుకునేందుకు ట్రై చేస్తోంది. మరి టాలీవుడ్లో సక్సెస్ కాలేకపోయిన నివేదా.. కోలీవుడ్లోనైనా విజయం సాధిస్తుందేమో చూడాలి.
కాగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన `విరాట పర్వం` మూవీలో నివేదా ఓ కీలక పాత్రను పోషించింది. అయితే ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు.
This post was last modified on February 7, 2022 1:54 pm
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…