ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. అప్పులు తెస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పటికే నిధుల లేమితో అక్కడ అభివృద్ధి పడకేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగన్ మాత్రం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచుతూనే ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి చేదాటేలా ఉన్నప్పటికీ గతంలో బాబు ప్రభుత్వం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని వైసీపీ మంత్రులు కవర్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ తాజాగా ఆ పార్టీ మంత్రి పేర్ని నాని రాష్ట్రం దివాళా తీసిందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం సందర్బంగా పేర్ని నాని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మహిళా ఉద్యోగులతో మాటల సందర్భంగా రాష్ట్రం దివాళా తీసిందనే అర్థం వచ్చేలా మాట్లాడారు. తమ సమస్యలను పట్టించుకోవాలని మహిళా ఉద్యోగులు కోరగా.. పేర్ని నాని ఓ కథ చెప్పారు. పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే స్కూటర్ కొనిస్తానని కుమారుడికి ఓ తండ్రి చెప్పాడన్నారు. కానీ ఆ కొడుకు ఫస్ట్ క్లాస్లో పాసయ్యే సమయానికి తండ్రి ఆర్థికంగా దివాళా తీశాడన్నారు. దీంతో స్కూటర్ కొనిస్తానని తండ్రి ఇచ్చిన హామీని నెరవేర్చలేదని కొడుకు తిట్టుకుంటే మాత్రం చేయగలిగిందేముంది అని నాని ప్రశ్నించారు. ప్రస్తుతం కొడుక్కు స్కూటర్ హామీ ఇచ్చిన తండ్రి పరిస్థితి లాగే ప్రభుత్వ పరిస్థితి ఉందని నాని చెప్పుకొచ్చారు.
ఇన్నాళ్లూ రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలే నిజమనేలా పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. నాని చెప్పిన ఈ కథ ప్రతిపక్షాలకు ఉపయోగ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా నాని బహిరంగంగా ఇలా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వైసీపీ నేతలే అంటున్నారు. ఆయన నోరు జారడం వల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే కౌంటర్లకు ఎప్పటికప్పుడూ సమాధానం ఇవ్వడంలో ముందుండే పేర్ని నాని ఇలా మాట జారడం కొత్తగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మహిళా ఉద్యోగులకు వివరించేందుకు ఆయన ప్రయత్నం చేయడం సరేకానీ మరీ ఇలా చెప్పడం మాత్రం బాలేదని అంటున్నారు.
This post was last modified on February 7, 2022 12:46 pm
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…
నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…