ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఒకటేనని బీజేపీ తేల్చేసింది. ఒకనాడు ఒకేపార్టీలో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు నేతలు ముఖ్యమంత్రుల హోదాలో కూడా ప్రధానమంత్రి విషయంలో ఒకటే వైఖరి అవలంభిస్తున్నారని మండిపడింది. ఇదంతా ప్రధానమంత్రికి స్వాగతం పలికే అధికారిక ప్రొటోకాల్ గురించి!
శంషాబాద్ ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఇక్రిశాట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణకు ఒకింత గ్యాప్ తర్వాత ప్రధాని మోడీ విచ్చేయగా ఆ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
దీనిపై తెలంగాణ బీజేపీ విమర్శలు చేస్తోంది. దేశ ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ జ్వరం అని చెప్తూ తప్పించుకోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేస్తూ ఈ మేరకు మండిపడింది. ఈ ట్వీట్లోనే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకే గూటి పక్షులని బీజేపీ మండిపడ్డారు.
అనుకున్న విధంగానే జరిగిందని.. గతంలో ప్రోటోకాల్ను ఉల్లంఘించిన చంద్రబాబు, పంజాబ్ సీఎం చన్నీ అడుగు జాడల్లో కేసీఆర్ నడుస్తున్నారని ఎద్దేవా చేసింది. ఇందుకు సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం ఖాయమని తెలంగాణ బీజేపీ తన ట్వీట్లో పేర్కొంది. బీజేపీ ట్వీట్ ద్వారా అంటే బహిరంగంగానే రిటర్న్ గిఫ్ట్ గురించి ప్రస్తావించడం చూస్తుంటే ప్రధాని టూర్ ఎపిసోడ్లోని పరిణామాలను కమలం పార్టీ సీరియస్ గానే తీసుకుంటుందని పలువురు భావిస్తున్నారు.
This post was last modified on February 6, 2022 9:13 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…