Political News

కేసీఆర్‌కు బీజేపీ రిట‌ర్న్ గిఫ్ట్‌?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి ఒకటేన‌ని బీజేపీ తేల్చేసింది. ఒక‌నాడు ఒకేపార్టీలో క‌లిసి ప‌నిచేసిన ఈ ఇద్ద‌రు నేత‌లు ముఖ్య‌మంత్రుల హోదాలో కూడా ప్ర‌ధాన‌మంత్రి విష‌యంలో ఒక‌టే వైఖ‌రి అవ‌లంభిస్తున్నార‌ని మండిప‌డింది. ఇదంతా ప్ర‌ధాన‌మంత్రికి స్వాగ‌తం ప‌లికే అధికారిక ప్రొటోకాల్ గురించి!

శంషాబాద్ ముచ్చింత‌ల్‌లో స‌మతామూర్తి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం, ఇక్రిశాట్ కార్య‌క్రమంలో పాల్గొనేందుకు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ శ‌నివారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణకు ఒకింత గ్యాప్‌ త‌ర్వాత‌ ప్రధాని మోడీ విచ్చేయ‌గా ఆ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనిపై తెలంగాణ బీజేపీ విమర్శలు చేస్తోంది. దేశ ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ జ్వరం అని చెప్తూ తప్పించుకోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేస్తూ ఈ మేర‌కు మండిప‌డింది. ఈ ట్వీట్లోనే ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకే గూటి ప‌క్షుల‌ని బీజేపీ మండిప‌డ్డారు.

అనుకున్న విధంగానే జరిగిందని.. గతంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన చంద్రబాబు, పంజాబ్ సీఎం చన్నీ అడుగు జాడల్లో కేసీఆర్ నడుస్తున్నారని ఎద్దేవా చేసింది. ఇందుకు సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం ఖాయమని తెలంగాణ బీజేపీ తన ట్వీట్‌లో పేర్కొంది. బీజేపీ ట్వీట్ ద్వారా అంటే బ‌హిరంగంగానే రిట‌ర్న్ గిఫ్ట్ గురించి ప్ర‌స్తావించ‌డం చూస్తుంటే ప్ర‌ధాని టూర్ ఎపిసోడ్‌లోని ప‌రిణామాల‌ను క‌మ‌లం పార్టీ సీరియ‌స్ గానే తీసుకుంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.

This post was last modified on February 6, 2022 9:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago