సాధారణంగా.. భార్యా భర్త విడిపోవడానికి.. విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి. ఇద్దరి మధ్యమనస్పర్థలు రావడం.. లేకపోతే.. గతంలో పరిచయాలు పునరావృతం కావడం.. ఆర్థిక సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం.. ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లడం.. లేదా.. కుటుంబంలో కలహాలు. ఇవే మెజారిటీగా విడాకులు తీసుకుంటున్నవారిలో కనిపించే కారణాలు. అయితే.. ఇప్పుడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ విడాకులకు సంబంధించి సరికొత్త కామెంట్ చేశారు.
పైన పేర్కొన్న అన్ని కారణాలకంటే కూడా తను పరిశీలించిన కారణమే కీలకంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య వల్లే ముంబయిలో విడాకులు పెరిగిపోతున్నాయని అమృత అన్నారు. మహా వికాస్ అఘాడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ముంబయిలో భార్యాభర్తల విడాకులకు సరికొత్త కారణం అని అమృత ఫడణవీస్ చెప్పారు. ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు తమ కుటుంబ సభ్యులకు తగినంత సమయం కేటాయించలేకపో తున్నారని అన్నారు. ఆ పరిస్థితులు విడాకులకు దారితీస్తున్నట్లు ఆమె చెప్పారు. ముంబయిలో విడాకులు తీసుకుంటున్నవారిలో 3శాతం మంది ట్రాఫిక్ సమస్య బాధితులేనని అమృత ఫడణవీస్ తెలిపారు.
మహా వికాస్ అఘాడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి వారి సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తుందని విమర్శించారు. ఈ రకమైన వాదనను వినడం ఇదే తొలిసారని ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ విమర్శించారు. ట్రాఫిక్ సమస్యల కారణంగానే విడాకులు తీసుకుంటున్నారనే వాదన విస్మయం కలిగిస్తోందని అన్నారు. విడాకులకు చాలా కారణాలుండవచ్చని చెప్పారు. అయితే.. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అమృత ఫడణవీస్ ఈ వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వస్తుండడం గమనార్హం.
This post was last modified on February 6, 2022 8:29 am
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…
నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…
ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…