సాధారణంగా.. భార్యా భర్త విడిపోవడానికి.. విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి. ఇద్దరి మధ్యమనస్పర్థలు రావడం.. లేకపోతే.. గతంలో పరిచయాలు పునరావృతం కావడం.. ఆర్థిక సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం.. ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లడం.. లేదా.. కుటుంబంలో కలహాలు. ఇవే మెజారిటీగా విడాకులు తీసుకుంటున్నవారిలో కనిపించే కారణాలు. అయితే.. ఇప్పుడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ విడాకులకు సంబంధించి సరికొత్త కామెంట్ చేశారు.
పైన పేర్కొన్న అన్ని కారణాలకంటే కూడా తను పరిశీలించిన కారణమే కీలకంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య వల్లే ముంబయిలో విడాకులు పెరిగిపోతున్నాయని అమృత అన్నారు. మహా వికాస్ అఘాడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ముంబయిలో భార్యాభర్తల విడాకులకు సరికొత్త కారణం అని అమృత ఫడణవీస్ చెప్పారు. ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు తమ కుటుంబ సభ్యులకు తగినంత సమయం కేటాయించలేకపో తున్నారని అన్నారు. ఆ పరిస్థితులు విడాకులకు దారితీస్తున్నట్లు ఆమె చెప్పారు. ముంబయిలో విడాకులు తీసుకుంటున్నవారిలో 3శాతం మంది ట్రాఫిక్ సమస్య బాధితులేనని అమృత ఫడణవీస్ తెలిపారు.
మహా వికాస్ అఘాడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి వారి సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తుందని విమర్శించారు. ఈ రకమైన వాదనను వినడం ఇదే తొలిసారని ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ విమర్శించారు. ట్రాఫిక్ సమస్యల కారణంగానే విడాకులు తీసుకుంటున్నారనే వాదన విస్మయం కలిగిస్తోందని అన్నారు. విడాకులకు చాలా కారణాలుండవచ్చని చెప్పారు. అయితే.. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అమృత ఫడణవీస్ ఈ వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వస్తుండడం గమనార్హం.
This post was last modified on February 6, 2022 8:29 am
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……