ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో భారీ సెగ తగిలింది. ఆయన హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (రామానుజార్యులు) విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం.. ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈక్వాలిటీ గురించి మాట్లాడారు. దీనిపైనే నెటిజన్లు నిముషాల వ్యవధిలో రియాక్ట్ అయ్యారు. ఈక్వాలిటీ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (రామానుజార్యులు) విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానిని “ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ“ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.
`ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ` అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. ఈ మేరకు తెలంగాణకు చెందిన నెటిజన్లు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ట్విట్టర్ వేదికగా తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను తమ ట్విట్లలో ఎండగట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధుల పంపిణీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అందని సాయం, పునర్ విభజన చట్టం హామీలు, తెలంగాణకు దక్కని జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అనేక అంశాలపై తమదైన శైలిలో ప్రశ్నించారు.
పలువురు రాష్ట్ర మంత్రులు సైతం ప్రధాని పర్యటన సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రశ్నించారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపై తమ ప్రభుత్వంతోపాటు మంత్రులు, కేంద్రానికి పంపిన లేఖలపై ఇప్పటిదాకా స్పందించకపోవడం పట్ల ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణలోని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై చూపిస్తున్న వివక్షపై మంత్రి నిరంజన్ రెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తారు.
తెలంగాణలో ఘనంగా జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడంపై మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. వివిధ కార్యక్రమాలతో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ఆపుతుందని ఎంపీ రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టేలా వివిధ అంశాలతో ట్యాంక్ బండ్పై భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. సుమారు 20 వేలకు పైగా ట్వీట్లు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హాష్ ట్యాగ్తో ట్విట్టర్లో ట్రెండ్ అయ్యాయి.
This post was last modified on February 5, 2022 10:40 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…