ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో తొలి విడత(ఈ నెల 10న) ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, సాధువు, ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఆయనకు సొంత ఇల్లు లేదని తెలిపారు. అదేసమయంలో రెండు తుపాకులు.. ఒక ఫోన్, కోటి రూపాయలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు లోక్సభకు ఐదుసార్లు ఎన్నికైన యోగీ ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గోరఖ్పుర్ శాసనసభస్థానం నుంచి నామినేషన్ దాఖలుచేశారు.
ఈ సందర్భంగా ఆస్తులు, ఆయనపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఆయనకు కోటి 54 లక్షల 94 వేల 54 రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో కొంత నగదుతోపాటు వివిధ బ్యాంకు ఖాతాల్లో మరికొంత డబ్బు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు 12వేల రూపాయల విలువ కలిగిన ఓ శాంసంగ్ మొబైల్ ఫోన్, లక్ష రూపాయల విలువగల రివాల్వర్, రూ.80 వేల విలువ కలిగిన మరో రైఫిల్ ఉన్నట్లు యోగి ఆదిత్యనాథ్ తన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు.
49 వేల రూపాయల విలువగల బంగారు చెవి రింగు, రూ.20 వేల విలువ కలిగిన రుద్రాక్షహారం తన వద్ద ఉన్నట్లు యోగి పేర్కొన్నారు. తనకు ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. సొంత వాహనం కూడా లేదని పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఎటువంటి రుణాలూ లేవని వెల్లడించారు.
పెండింగ్లోనూ ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. వీటితోపాటు గత నాలుగేళ్లలో ఆయన ఆదాయ వివరాలను కూడా అఫిడవిట్లో యోగీ పొందుపరిచారు. ప్రస్తుతం యోగి ఆస్తుల వివరాలు.. అఫిడవిట్ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారాయి. సాధువుకు.. తుపాకులు ఎందుకు? సర్వసంఘపరిత్యాగికి కోటి రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి? అంటూ.. ప్రశ్నలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on February 6, 2022 9:24 am
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…