ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో తొలి విడత(ఈ నెల 10న) ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, సాధువు, ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఆయనకు సొంత ఇల్లు లేదని తెలిపారు. అదేసమయంలో రెండు తుపాకులు.. ఒక ఫోన్, కోటి రూపాయలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు లోక్సభకు ఐదుసార్లు ఎన్నికైన యోగీ ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గోరఖ్పుర్ శాసనసభస్థానం నుంచి నామినేషన్ దాఖలుచేశారు.
ఈ సందర్భంగా ఆస్తులు, ఆయనపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఆయనకు కోటి 54 లక్షల 94 వేల 54 రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో కొంత నగదుతోపాటు వివిధ బ్యాంకు ఖాతాల్లో మరికొంత డబ్బు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు 12వేల రూపాయల విలువ కలిగిన ఓ శాంసంగ్ మొబైల్ ఫోన్, లక్ష రూపాయల విలువగల రివాల్వర్, రూ.80 వేల విలువ కలిగిన మరో రైఫిల్ ఉన్నట్లు యోగి ఆదిత్యనాథ్ తన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు.
49 వేల రూపాయల విలువగల బంగారు చెవి రింగు, రూ.20 వేల విలువ కలిగిన రుద్రాక్షహారం తన వద్ద ఉన్నట్లు యోగి పేర్కొన్నారు. తనకు ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. సొంత వాహనం కూడా లేదని పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఎటువంటి రుణాలూ లేవని వెల్లడించారు.
పెండింగ్లోనూ ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. వీటితోపాటు గత నాలుగేళ్లలో ఆయన ఆదాయ వివరాలను కూడా అఫిడవిట్లో యోగీ పొందుపరిచారు. ప్రస్తుతం యోగి ఆస్తుల వివరాలు.. అఫిడవిట్ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారాయి. సాధువుకు.. తుపాకులు ఎందుకు? సర్వసంఘపరిత్యాగికి కోటి రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి? అంటూ.. ప్రశ్నలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on February 6, 2022 9:24 am
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…