ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో తొలి విడత(ఈ నెల 10న) ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, సాధువు, ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఆయనకు సొంత ఇల్లు లేదని తెలిపారు. అదేసమయంలో రెండు తుపాకులు.. ఒక ఫోన్, కోటి రూపాయలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు లోక్సభకు ఐదుసార్లు ఎన్నికైన యోగీ ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గోరఖ్పుర్ శాసనసభస్థానం నుంచి నామినేషన్ దాఖలుచేశారు.
ఈ సందర్భంగా ఆస్తులు, ఆయనపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఆయనకు కోటి 54 లక్షల 94 వేల 54 రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో కొంత నగదుతోపాటు వివిధ బ్యాంకు ఖాతాల్లో మరికొంత డబ్బు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు 12వేల రూపాయల విలువ కలిగిన ఓ శాంసంగ్ మొబైల్ ఫోన్, లక్ష రూపాయల విలువగల రివాల్వర్, రూ.80 వేల విలువ కలిగిన మరో రైఫిల్ ఉన్నట్లు యోగి ఆదిత్యనాథ్ తన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు.
49 వేల రూపాయల విలువగల బంగారు చెవి రింగు, రూ.20 వేల విలువ కలిగిన రుద్రాక్షహారం తన వద్ద ఉన్నట్లు యోగి పేర్కొన్నారు. తనకు ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. సొంత వాహనం కూడా లేదని పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఎటువంటి రుణాలూ లేవని వెల్లడించారు.
పెండింగ్లోనూ ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. వీటితోపాటు గత నాలుగేళ్లలో ఆయన ఆదాయ వివరాలను కూడా అఫిడవిట్లో యోగీ పొందుపరిచారు. ప్రస్తుతం యోగి ఆస్తుల వివరాలు.. అఫిడవిట్ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారాయి. సాధువుకు.. తుపాకులు ఎందుకు? సర్వసంఘపరిత్యాగికి కోటి రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి? అంటూ.. ప్రశ్నలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on February 6, 2022 9:24 am
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…