Political News

వైసీపీని చెడుగుడు ఆడేసిన రాము

ప్ర‌స్తుత బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా వైసీపీ  ఏ విధంగా న‌డుచుకుంటుంది, ఏ విధంగా ప‌న్నులు విధిస్తోంది..ఇంకా ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచుతోంది వంటి అంశాల‌పై టీడీపీ బాగానే ఫోక‌స్ చేస్తోంది.దీంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న కీల‌క స‌మ‌స్య‌లు కొన్ని వెలుగు చూస్తున్నాయి.అదేవిధంగా కీల‌కం అయిన భావ‌న‌పాడు పోర్టు, సాగ‌ర మాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎంపీ రామూ  ప్ర‌శ్నించి, సంబంధిత వ‌ర్గాల నుంచి జ‌వాబులు రాబ‌ట్టారు.లోక్ స‌భ‌లో 22 మంది ఎంపీలు ఉండి కూడా ప్ర‌యోజ‌నాత్మ‌క  రీతిలో వాళ్లెవ్వ‌రూ ప‌నిచేయ‌డం లేద‌ని ఆవేద‌న చెందారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ప‌న్నుల విధానం పై ప‌దే ప‌దే స‌భ‌కు వివ‌రించి, విన్నవించి ఎంపీ రామూ త‌న ప్ర‌సంగాన్ని నిన్న‌టి వేళ ముగించారు.

ఇవాళ కూడా పార్లమెంట్లో శ్రీ‌కాకుళం యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు మాట్లాడారు. వైసీపీని టార్గెట్ చేశారు. ముఖ్యంగా వైసీపీ అనాలోచిత నిర్ణ‌యాల‌ను ఎండ‌గ‌ట్టారు.చెత్త ప‌న్నుతో స‌హా ప‌లు ర‌కాల పన్నులు వ‌సూలు చేయ‌డం హేయ‌మ‌యిన చ‌ర్య అని అభివ‌ర్ణిస్తూ నిన్న‌టి వేళ స‌భ‌లో చెల‌రేగిపోయారు.ఇంగ్లీషు, హిందీ భాష‌ల్లో మాట్లాడుతూ స్పీక‌ర్ ను క‌న్విన్స్ చేస్తూ .. రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను పూర్తిగా తూర్పారాబ‌ట్టారు.అంతేకాదు ఉపాధి హామీ ప‌థ‌కం నిధులను కూడా స‌రిగా వాడ‌డం చేత‌గావ‌డం లేద‌ని అంటూ మండిపడ్డారు.

బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం ప్ర‌వేశ పెట్టిన సంద‌ర్భంలో యువ ఎంపీ రామూ మాట్లాడి, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఒక్కొక్క‌టిగా వివ‌రించారు. దీంతో స‌భ‌లో వైసీపీ స‌భ్యులు గొల్లుమ‌న్నారు. అయినా స‌రే యువ ఎంపీ రాము త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. అన‌ర్గ‌ళంగా మాట్లాడుతూ పాల‌న ప‌రంగా వైసీపీ ఏ విధంగా విఫ‌లం అవుతున్న‌దో వివ‌రించేందుకు గ‌ణాంక స‌హితంగా చెప్పేందుకు ప్ర‌య‌త్నించారు.దీంతో ఎంపీ రాము స్పీచ్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

ముఖ్యంగా ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ఇప్ప‌టిదాకా వైసీపీ స‌భ్యులు స‌భ‌లోనే ప్ర‌స్తావించ‌లేదు అని, ఆ పార్టీకి చెందిన ఇద్ద‌రికి మాట్లాడే అవ‌కాశం ఇచ్చినా కూడా వారు ఆ ప్ర‌స్తావనే తీసుకుని రాలేదు అని ఫైర్ అయ్యారు. అదేవిధంగా వైసీపీ ఎంపీలెవ్వ‌రూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏ ఒక్క విష‌యం కూడా స‌భ దృష్టి తీసుకు వ‌చ్చిన దాఖ‌లాలే లేవు అని అన్నారు. ఆ రోజు ఎనిమిది స‌భ్యులున్న వైసీపీ,ఇవాళ 22  మంది ఎంపీల‌తో కొలువుదీరినా కూడా లాభంలేకుండా పోతోంద‌ని, ఆ రోజు మ‌మ్మ‌ల్నిగెలిపిస్తే స్పెష‌ల్ స్టేట‌స్ తెస్తామ‌ని చెప్పిన వైసీపీ మాట త‌ప్పింద‌ని ఎంపీ  రాము స‌భ దృష్టికి తీసుకువచ్చారు.

This post was last modified on February 5, 2022 12:45 pm

Share

Recent Posts

కనకరాజు లెక్కలు ఎలా ఉన్నాయి?

ఒక దశలో ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్-2’ లాంటి విజయాలతో మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కెరీర్ మంచి…

2 hours ago

నడుము సీన్లు తమిళ సినిమాల్లో లేవా?

ఒకరిని పొగడ్డానికి ఇంకొకరిని కించపరచాల్సిన అవసరం లేదు. అలాగే ఒకరిని విమర్శించే క్రమంలో కూడా అవసరం లేని ఇంకొకరి పేరు…

3 hours ago

విజయ్ సినిమా బాలయ్యకి బూస్ట్ ఇచ్చింది

కొన్ని సినిమాలు రిలీజ్ టైంలో సరిగా ఆడవు. కానీ తర్వాతి కాలంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. ఇలాంటి పేరు చాలా…

4 hours ago

రాజా సాబ్ ప్రభావం గట్టిగానే ఉంది

చెన్నై లవ్ స్టోరీ ఏ స్థాయిలో విజయం సాధిస్తుందనేది తేలడానికి కొంచెం టైం పడుతుంది కానీ వీకెండ్ దాకా ఢోకా…

5 hours ago

కోమటి బ్రదర్స్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

తెలంగాణలో అధికార పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో తరచూ అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయి. ఎనుముల రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ ప్రమాణం…

6 hours ago

‘జయం’లో బన్నీని పెట్టి తీసేశారా?

ఒక హీరోతో చేయాల్సిన కథ ఇంకో హీరో చేతికి వెళ్లిపోవడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఐతే పెద్ద ఫ్యామిలీకి చెందిన…

6 hours ago