Political News

వైసీపీని చెడుగుడు ఆడేసిన రాము

ప్ర‌స్తుత బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా వైసీపీ  ఏ విధంగా న‌డుచుకుంటుంది, ఏ విధంగా ప‌న్నులు విధిస్తోంది..ఇంకా ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచుతోంది వంటి అంశాల‌పై టీడీపీ బాగానే ఫోక‌స్ చేస్తోంది.దీంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న కీల‌క స‌మ‌స్య‌లు కొన్ని వెలుగు చూస్తున్నాయి.అదేవిధంగా కీల‌కం అయిన భావ‌న‌పాడు పోర్టు, సాగ‌ర మాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎంపీ రామూ  ప్ర‌శ్నించి, సంబంధిత వ‌ర్గాల నుంచి జ‌వాబులు రాబ‌ట్టారు.లోక్ స‌భ‌లో 22 మంది ఎంపీలు ఉండి కూడా ప్ర‌యోజ‌నాత్మ‌క  రీతిలో వాళ్లెవ్వ‌రూ ప‌నిచేయ‌డం లేద‌ని ఆవేద‌న చెందారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ప‌న్నుల విధానం పై ప‌దే ప‌దే స‌భ‌కు వివ‌రించి, విన్నవించి ఎంపీ రామూ త‌న ప్ర‌సంగాన్ని నిన్న‌టి వేళ ముగించారు.

ఇవాళ కూడా పార్లమెంట్లో శ్రీ‌కాకుళం యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు మాట్లాడారు. వైసీపీని టార్గెట్ చేశారు. ముఖ్యంగా వైసీపీ అనాలోచిత నిర్ణ‌యాల‌ను ఎండ‌గ‌ట్టారు.చెత్త ప‌న్నుతో స‌హా ప‌లు ర‌కాల పన్నులు వ‌సూలు చేయ‌డం హేయ‌మ‌యిన చ‌ర్య అని అభివ‌ర్ణిస్తూ నిన్న‌టి వేళ స‌భ‌లో చెల‌రేగిపోయారు.ఇంగ్లీషు, హిందీ భాష‌ల్లో మాట్లాడుతూ స్పీక‌ర్ ను క‌న్విన్స్ చేస్తూ .. రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను పూర్తిగా తూర్పారాబ‌ట్టారు.అంతేకాదు ఉపాధి హామీ ప‌థ‌కం నిధులను కూడా స‌రిగా వాడ‌డం చేత‌గావ‌డం లేద‌ని అంటూ మండిపడ్డారు.

బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం ప్ర‌వేశ పెట్టిన సంద‌ర్భంలో యువ ఎంపీ రామూ మాట్లాడి, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఒక్కొక్క‌టిగా వివ‌రించారు. దీంతో స‌భ‌లో వైసీపీ స‌భ్యులు గొల్లుమ‌న్నారు. అయినా స‌రే యువ ఎంపీ రాము త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. అన‌ర్గ‌ళంగా మాట్లాడుతూ పాల‌న ప‌రంగా వైసీపీ ఏ విధంగా విఫ‌లం అవుతున్న‌దో వివ‌రించేందుకు గ‌ణాంక స‌హితంగా చెప్పేందుకు ప్ర‌య‌త్నించారు.దీంతో ఎంపీ రాము స్పీచ్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

ముఖ్యంగా ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ఇప్ప‌టిదాకా వైసీపీ స‌భ్యులు స‌భ‌లోనే ప్ర‌స్తావించ‌లేదు అని, ఆ పార్టీకి చెందిన ఇద్ద‌రికి మాట్లాడే అవ‌కాశం ఇచ్చినా కూడా వారు ఆ ప్ర‌స్తావనే తీసుకుని రాలేదు అని ఫైర్ అయ్యారు. అదేవిధంగా వైసీపీ ఎంపీలెవ్వ‌రూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏ ఒక్క విష‌యం కూడా స‌భ దృష్టి తీసుకు వ‌చ్చిన దాఖ‌లాలే లేవు అని అన్నారు. ఆ రోజు ఎనిమిది స‌భ్యులున్న వైసీపీ,ఇవాళ 22  మంది ఎంపీల‌తో కొలువుదీరినా కూడా లాభంలేకుండా పోతోంద‌ని, ఆ రోజు మ‌మ్మ‌ల్నిగెలిపిస్తే స్పెష‌ల్ స్టేట‌స్ తెస్తామ‌ని చెప్పిన వైసీపీ మాట త‌ప్పింద‌ని ఎంపీ  రాము స‌భ దృష్టికి తీసుకువచ్చారు.

This post was last modified on February 5, 2022 12:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

40 minutes ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

4 hours ago

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

4 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

4 hours ago

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…

4 hours ago

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

5 hours ago