ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వైసీపీ ఏ విధంగా నడుచుకుంటుంది, ఏ విధంగా పన్నులు విధిస్తోంది..ఇంకా ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచుతోంది వంటి అంశాలపై టీడీపీ బాగానే ఫోకస్ చేస్తోంది.దీంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలు కొన్ని వెలుగు చూస్తున్నాయి.అదేవిధంగా కీలకం అయిన భావనపాడు పోర్టు, సాగర మాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎంపీ రామూ ప్రశ్నించి, సంబంధిత వర్గాల నుంచి జవాబులు రాబట్టారు.లోక్ సభలో 22 మంది ఎంపీలు ఉండి కూడా ప్రయోజనాత్మక రీతిలో వాళ్లెవ్వరూ పనిచేయడం లేదని ఆవేదన చెందారు. రాష్ట్రంలో అమలవుతున్న పన్నుల విధానం పై పదే పదే సభకు వివరించి, విన్నవించి ఎంపీ రామూ తన ప్రసంగాన్ని నిన్నటి వేళ ముగించారు.
ఇవాళ కూడా పార్లమెంట్లో శ్రీకాకుళం యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. వైసీపీని టార్గెట్ చేశారు. ముఖ్యంగా వైసీపీ అనాలోచిత నిర్ణయాలను ఎండగట్టారు.చెత్త పన్నుతో సహా పలు రకాల పన్నులు వసూలు చేయడం హేయమయిన చర్య అని అభివర్ణిస్తూ నిన్నటి వేళ సభలో చెలరేగిపోయారు.ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాట్లాడుతూ స్పీకర్ ను కన్విన్స్ చేస్తూ .. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను పూర్తిగా తూర్పారాబట్టారు.అంతేకాదు ఉపాధి హామీ పథకం నిధులను కూడా సరిగా వాడడం చేతగావడం లేదని అంటూ మండిపడ్డారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంలో యువ ఎంపీ రామూ మాట్లాడి, ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటిగా వివరించారు. దీంతో సభలో వైసీపీ సభ్యులు గొల్లుమన్నారు. అయినా సరే యువ ఎంపీ రాము తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనర్గళంగా మాట్లాడుతూ పాలన పరంగా వైసీపీ ఏ విధంగా విఫలం అవుతున్నదో వివరించేందుకు గణాంక సహితంగా చెప్పేందుకు ప్రయత్నించారు.దీంతో ఎంపీ రాము స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ముఖ్యంగా ప్రత్యేక హోదాకు సంబంధించి ఇప్పటిదాకా వైసీపీ సభ్యులు సభలోనే ప్రస్తావించలేదు అని, ఆ పార్టీకి చెందిన ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా వారు ఆ ప్రస్తావనే తీసుకుని రాలేదు అని ఫైర్ అయ్యారు. అదేవిధంగా వైసీపీ ఎంపీలెవ్వరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఒక్క విషయం కూడా సభ దృష్టి తీసుకు వచ్చిన దాఖలాలే లేవు అని అన్నారు. ఆ రోజు ఎనిమిది సభ్యులున్న వైసీపీ,ఇవాళ 22 మంది ఎంపీలతో కొలువుదీరినా కూడా లాభంలేకుండా పోతోందని, ఆ రోజు మమ్మల్నిగెలిపిస్తే స్పెషల్ స్టేటస్ తెస్తామని చెప్పిన వైసీపీ మాట తప్పిందని ఎంపీ రాము సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…