Political News

కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్న జ‌గ‌న్ టీం

తెల‌గు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కే చంద్ర‌శేఖ‌ర్ రావు, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ధ్య‌నున్న రాజ‌కీయ దోస్తీ ప్రస్తుత ప‌రిస్థితిపై ఎవ్వ‌రూ ఖ‌చ్చితంగా అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి. ఒక‌ప్పుడు ఐక్యంగా సాగిన ఈ ఇద్ద‌రు సీఎంల మైత్రిలో ఈ మ‌ధ్య వివిధ అంశాల మ‌ధ్య కార‌ణంగా ఒకింత గ్యాప్ ఏర్ప‌డింద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెప్తుంటారు. మ‌రోవైపు అలా ఏం లేదు… ఇద్దరి మ‌ధ్య సఖ్య‌త స‌రిగానే ఉంద‌ని ఇంకొంద‌రు చెప్తుంటారు.

అయితే, చెప్పుకోద‌గ్గ స్థాయిలో విబేధాలు బ‌య‌ట‌ప‌డిన ప‌రిస్థితి అయితే లేద‌న్న‌ది నిజం. కాగా, ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డేందుకు మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. రాజ్యాంగంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్పద‌మైన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌కు చెందిన నేత‌లు దీనిపై త‌మ‌దైన శైలిలో స్పందించారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున కూడా ప‌లువురు నేత‌లు రియాక్ట‌య్యారు. అయితే, అధికార వైసీపీ త‌ర‌ఫున రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ కామెంట్ల విష‌యంలో ఎవ‌రూ స్పందించ‌లేదు. అయితే, తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ మంత్రి ఆదిమూల‌పు సురేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొంత మంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏపీకి చెందిన‌ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. రాజ్యాంగం మార్చాలని కొంత మంది కుహనా మేధావులు  అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయ‌ని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఏ అంశం వాళ్ల‌ను అంతలా కలచివేచేలా చేస్తోందో? అని అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారు? అని ప్ర‌శ్నించారు. ఇలాంటి విష‌యాల్లో రాజ్యాంగాన్ని మార్చాల‌నే వారు ఎందుకు స్పందించ‌రు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ మంత్రి టార్గెట్ చేశారు.

This post was last modified on February 4, 2022 10:01 pm

Share

Recent Posts

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

18 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

4 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago