Political News

కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్న జ‌గ‌న్ టీం

తెల‌గు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కే చంద్ర‌శేఖ‌ర్ రావు, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ధ్య‌నున్న రాజ‌కీయ దోస్తీ ప్రస్తుత ప‌రిస్థితిపై ఎవ్వ‌రూ ఖ‌చ్చితంగా అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి. ఒక‌ప్పుడు ఐక్యంగా సాగిన ఈ ఇద్ద‌రు సీఎంల మైత్రిలో ఈ మ‌ధ్య వివిధ అంశాల మ‌ధ్య కార‌ణంగా ఒకింత గ్యాప్ ఏర్ప‌డింద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెప్తుంటారు. మ‌రోవైపు అలా ఏం లేదు… ఇద్దరి మ‌ధ్య సఖ్య‌త స‌రిగానే ఉంద‌ని ఇంకొంద‌రు చెప్తుంటారు.

అయితే, చెప్పుకోద‌గ్గ స్థాయిలో విబేధాలు బ‌య‌ట‌ప‌డిన ప‌రిస్థితి అయితే లేద‌న్న‌ది నిజం. కాగా, ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డేందుకు మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. రాజ్యాంగంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్పద‌మైన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌కు చెందిన నేత‌లు దీనిపై త‌మ‌దైన శైలిలో స్పందించారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున కూడా ప‌లువురు నేత‌లు రియాక్ట‌య్యారు. అయితే, అధికార వైసీపీ త‌ర‌ఫున రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ కామెంట్ల విష‌యంలో ఎవ‌రూ స్పందించ‌లేదు. అయితే, తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ మంత్రి ఆదిమూల‌పు సురేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొంత మంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏపీకి చెందిన‌ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. రాజ్యాంగం మార్చాలని కొంత మంది కుహనా మేధావులు  అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయ‌ని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఏ అంశం వాళ్ల‌ను అంతలా కలచివేచేలా చేస్తోందో? అని అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారు? అని ప్ర‌శ్నించారు. ఇలాంటి విష‌యాల్లో రాజ్యాంగాన్ని మార్చాల‌నే వారు ఎందుకు స్పందించ‌రు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ మంత్రి టార్గెట్ చేశారు.

Satya

Recent Posts

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

12 minutes ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

41 minutes ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

43 minutes ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

59 minutes ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

1 hour ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

1 hour ago