తెలగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కే చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్యనున్న రాజకీయ దోస్తీ ప్రస్తుత పరిస్థితిపై ఎవ్వరూ ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ఒకప్పుడు ఐక్యంగా సాగిన ఈ ఇద్దరు సీఎంల మైత్రిలో ఈ మధ్య వివిధ అంశాల మధ్య కారణంగా ఒకింత గ్యాప్ ఏర్పడిందని పలువురు విశ్లేషకులు చెప్తుంటారు. మరోవైపు అలా ఏం లేదు… ఇద్దరి మధ్య సఖ్యత సరిగానే ఉందని ఇంకొందరు చెప్తుంటారు.
అయితే, చెప్పుకోదగ్గ స్థాయిలో విబేధాలు బయటపడిన పరిస్థితి అయితే లేదన్నది నిజం. కాగా, ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య గ్యాప్ ఏర్పడేందుకు మరో అంశం తెరమీదకు వచ్చింది. రాజ్యాంగంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన నేతలు దీనిపై తమదైన శైలిలో స్పందించారు.
ఏపీలో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా పలువురు నేతలు రియాక్టయ్యారు. అయితే, అధికార వైసీపీ తరఫున రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ కామెంట్ల విషయంలో ఎవరూ స్పందించలేదు. అయితే, తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైసీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. రాజ్యాంగం మార్చాలని కొంత మంది కుహనా మేధావులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఏ అంశం వాళ్లను అంతలా కలచివేచేలా చేస్తోందో? అని అనుమానాన్ని వ్యక్తం చేశారు. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారు? అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాల్లో రాజ్యాంగాన్ని మార్చాలనే వారు ఎందుకు స్పందించరు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ మంత్రి టార్గెట్ చేశారు.
This post was last modified on February 4, 2022 10:01 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…