Political News

కాపుల కోరిక తీర్చిన జగన్

కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసుల్లో చాలా వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.  తాజాగా 161 కేసులను ఉపసంహరించుకున్న ప్రభుత్వం ఇదే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు వివరించాలని డీజీపీకి హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. 2016-19 మధ్య జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 329 కేసులు నమోదుచేసింది.

తమపై నమోదైన కేసులను ఎత్తేయాలని కాపు నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నేతల  విజ్ఞప్తి ప్రకారం 68 కేసులను ఉపసంహరించారు. మరో 85 కేసులు కింద స్ధాయిలోనే పరిష్కారమై పోయాయి. 176 కేసులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. వీటిల్లో రైల్వే ఆస్తులు ధ్వంసం కు సంబంధించి నమోదైన కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది.

సో పెండింగ్ లో ఉన్న 175 కేసుల్లో 161 కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో 14 కేసుల దర్యాప్తు వివిధ దశల్లో ఉన్నాయి. కాపులకు బీసీల రిజర్వేషన్ వర్తింపచేయాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆందోళనతో మొదలైన ఉద్యమం తర్వాత పీక్స్ కు చేరుకుంది. ఆ సమయంలో తునిలో జరిగిన ఆందోళనలోనే రత్నాచల్ రైలుకు ఆందోళనకారులు నిప్పుపెట్టడం దేశంలో సంచలనమైంది. వివిధ ఘటనల్లో కొన్ని వందల మంది కాపు యువతపై కేసులు నమోదయ్యాయి.

ఆ తర్వాత కూడా ఉద్యమంలో భాగంగానే ఆందోళనకారులపై ప్రభుత్వం అనేక కేసులను పెట్టింది. రైలుదహనం ఘటనలో పోలీసులు చాలామందిపై కేసులు నమోదు చేసి విచారించారు. అయితే ఎవరు నిప్పుపెట్టారనే విషయం తేలలేదు. ఈ కేసును రైల్వే పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా దోషులెవరో తేలలేదంటే ఇక ముందు కూడా తేలే అవకాశం లేదు. ఇదే సమయంలో తమపై నమోదైన కేసులను ఎత్తేయాలంటు కాపు సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. దాంతో అవకాశమున్న కేసులను ప్రభుత్వం తాజాగా ఎత్తేసింది. 

This post was last modified on February 4, 2022 11:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

37 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago