Political News

కాపుల కోరిక తీర్చిన జగన్

కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసుల్లో చాలా వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.  తాజాగా 161 కేసులను ఉపసంహరించుకున్న ప్రభుత్వం ఇదే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు వివరించాలని డీజీపీకి హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. 2016-19 మధ్య జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 329 కేసులు నమోదుచేసింది.

తమపై నమోదైన కేసులను ఎత్తేయాలని కాపు నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నేతల  విజ్ఞప్తి ప్రకారం 68 కేసులను ఉపసంహరించారు. మరో 85 కేసులు కింద స్ధాయిలోనే పరిష్కారమై పోయాయి. 176 కేసులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. వీటిల్లో రైల్వే ఆస్తులు ధ్వంసం కు సంబంధించి నమోదైన కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది.

సో పెండింగ్ లో ఉన్న 175 కేసుల్లో 161 కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో 14 కేసుల దర్యాప్తు వివిధ దశల్లో ఉన్నాయి. కాపులకు బీసీల రిజర్వేషన్ వర్తింపచేయాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆందోళనతో మొదలైన ఉద్యమం తర్వాత పీక్స్ కు చేరుకుంది. ఆ సమయంలో తునిలో జరిగిన ఆందోళనలోనే రత్నాచల్ రైలుకు ఆందోళనకారులు నిప్పుపెట్టడం దేశంలో సంచలనమైంది. వివిధ ఘటనల్లో కొన్ని వందల మంది కాపు యువతపై కేసులు నమోదయ్యాయి.

ఆ తర్వాత కూడా ఉద్యమంలో భాగంగానే ఆందోళనకారులపై ప్రభుత్వం అనేక కేసులను పెట్టింది. రైలుదహనం ఘటనలో పోలీసులు చాలామందిపై కేసులు నమోదు చేసి విచారించారు. అయితే ఎవరు నిప్పుపెట్టారనే విషయం తేలలేదు. ఈ కేసును రైల్వే పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా దోషులెవరో తేలలేదంటే ఇక ముందు కూడా తేలే అవకాశం లేదు. ఇదే సమయంలో తమపై నమోదైన కేసులను ఎత్తేయాలంటు కాపు సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. దాంతో అవకాశమున్న కేసులను ప్రభుత్వం తాజాగా ఎత్తేసింది. 

This post was last modified on February 4, 2022 11:06 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి…

58 mins ago

ఆవేశం తెలుగు ఆశలు ఆవిరయ్యాయా

ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…

1 hour ago

అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…

1 hour ago

తమన్నా రాశిఖన్నా ‘బాక్’ రిపోర్ట్

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్‌మనై 4 మీద కాస్తో కూస్తో…

2 hours ago

వరలక్ష్మి ‘శబరి’ ఎలా ఉంది

తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…

2 hours ago

గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…

2 hours ago