Political News

కాపుల కోరిక తీర్చిన జగన్

కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసుల్లో చాలా వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.  తాజాగా 161 కేసులను ఉపసంహరించుకున్న ప్రభుత్వం ఇదే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు వివరించాలని డీజీపీకి హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. 2016-19 మధ్య జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 329 కేసులు నమోదుచేసింది.

తమపై నమోదైన కేసులను ఎత్తేయాలని కాపు నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నేతల  విజ్ఞప్తి ప్రకారం 68 కేసులను ఉపసంహరించారు. మరో 85 కేసులు కింద స్ధాయిలోనే పరిష్కారమై పోయాయి. 176 కేసులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. వీటిల్లో రైల్వే ఆస్తులు ధ్వంసం కు సంబంధించి నమోదైన కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది.

సో పెండింగ్ లో ఉన్న 175 కేసుల్లో 161 కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో 14 కేసుల దర్యాప్తు వివిధ దశల్లో ఉన్నాయి. కాపులకు బీసీల రిజర్వేషన్ వర్తింపచేయాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆందోళనతో మొదలైన ఉద్యమం తర్వాత పీక్స్ కు చేరుకుంది. ఆ సమయంలో తునిలో జరిగిన ఆందోళనలోనే రత్నాచల్ రైలుకు ఆందోళనకారులు నిప్పుపెట్టడం దేశంలో సంచలనమైంది. వివిధ ఘటనల్లో కొన్ని వందల మంది కాపు యువతపై కేసులు నమోదయ్యాయి.

ఆ తర్వాత కూడా ఉద్యమంలో భాగంగానే ఆందోళనకారులపై ప్రభుత్వం అనేక కేసులను పెట్టింది. రైలుదహనం ఘటనలో పోలీసులు చాలామందిపై కేసులు నమోదు చేసి విచారించారు. అయితే ఎవరు నిప్పుపెట్టారనే విషయం తేలలేదు. ఈ కేసును రైల్వే పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా దోషులెవరో తేలలేదంటే ఇక ముందు కూడా తేలే అవకాశం లేదు. ఇదే సమయంలో తమపై నమోదైన కేసులను ఎత్తేయాలంటు కాపు సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. దాంతో అవకాశమున్న కేసులను ప్రభుత్వం తాజాగా ఎత్తేసింది. 

This post was last modified on February 4, 2022 11:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు చ‌ల‌వ‌: మాజీ ఐపీఎస్ ఏబీవీకి కీల‌క ప‌ద‌వి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వైసీపీ హ‌యాంలో వేధింపుల‌కు గురై.. దాదాపు ఐదేళ్ల‌పాటు స‌స్పెన్ష‌న్ లో ఉన్న…

7 hours ago

గ‌రీబ్‌-యువ‌-నారీ-కిసాన్‌.. బ‌డ్జెట్లో నాలుగు యాంగిల్స్‌!

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ప్ర‌ధానంగా నాలుగు యాంగిల్స్ క‌నిపించాయి. ఈ విష‌యాన్ని బ‌డ్జెట్ ప్ర‌సంగంలో కేంద్ర…

9 hours ago

వింటేజ్ ‘నెగిటివ్ రీల్స్’ వాడబోతున్న RC 16

ఇప్పుడంతా డిజిటల్ మయం. ప్రతిదీ హార్డ్ డిస్కుల్లోకి వెళ్ళిపోతుంది. చిన్న డేటాతో మొదలుపెట్టి వందల జిబి డిమాండ్ చేసే సినిమా…

9 hours ago

మళ్లీ పెళ్లికొడుకు కాబోతున్న ఆమిర్?

సినిమాల పరంగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరుంది. కానీ వ్యక్తిగా తాను పర్ఫెక్ట్…

9 hours ago

తెలంగాణలో ‘తిరుగుబాటు’ కలకలం

తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్.. బాబు హ్యాపీ!

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌పై ఏపీ సీఎం, కేంద్రంలోని ఎన్డీయే స‌ర్కారు భాగ‌స్వామి చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం…

10 hours ago