Political News

బండి సంజ‌య్ తో రేవంత్ భేటీ

తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ది ప్ర‌ధాన పాత్ర అయితే మిగ‌తా కీల‌క పాత్ర‌లో ఉండేది బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు , ఎంపీ బండి సంజ‌య్ , మ‌రొక‌రు తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడైన ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ ఇద్ద‌రు ఎంపీలు కం జాతీయ‌ పార్టీల రాష్ట్ర అధ్య‌క్షులు అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా తెలంగాణ సీఎం పై విరుచుకుప‌డుతుంటారు.

జాతీయ పార్టీ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ప్ప‌టికీ తెలంగాణ స‌మ‌స్య‌ల‌ను త‌మదైన శైలిలో వివ‌రిస్తుంటారు. ఇలాగే తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాల‌ని చేసిన డ‌మాండ్‌పై ఈ ఇద్ద‌రు నేత‌లు విరుచుకుప‌డ్డారు. అయితే, అంత‌లోనే ఇద్ద‌రు స‌మావేశం అవ‌డం, అందులోనూ ఢిల్లీ కేంద్రంగా ఈ స‌మావేశం అవుతుండ‌టం సంచ‌ల‌నంగా మారింది.

కేసీఆర్ వ్యాఖ్య‌లకు నిర‌స‌న‌గా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేడు జై భీమ్ దీక్ష కార్యక్రమాలను నిర్వహించారు. మండల కేంద్రాలలో, అదేవిధంగా జిల్లా కేంద్రాలలో, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో, ఢిల్లీలో ఈ దీక్ష‌లు చేప‌ట్టారు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మ‌రియు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు తదితరులు పాల్గొన్నారు. అనంత‌రం బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తీరును త‌ప్పుప‌ట్టారు. రాజ్యాంగాన్ని మార్చాల‌న్న కేసీఆర్ డిమాండ్ స‌రికాద‌ని అన్నారు. అయితే, చిత్రంగా ఈ నిర‌స‌న త‌ర్వాత రేవంత్ రెడ్డి , బండి సంజ‌య్ స‌మావేశ‌మ‌య్యారు.

ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్లో ఎంపీ బండి సంజ‌య్ దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్ష అనంత‌రం అక్క‌డే ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వారితో స‌మావేశ‌మ‌య్యారు. స‌ర‌దాగా టీ తాగుతూ ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డున్న మీడియా మిత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు స‌ర్ అంటే… ఇంకేం ఉంటుంది?  తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌లు … రాజ‌కీయ ప‌రిస్థితుల గురించే అంటూ ఇద్ద‌రు ఎంపీలు చ‌మ‌త్క‌రించారు. 

Satya

Recent Posts

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

3 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

3 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

3 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

3 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

4 hours ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

4 hours ago