కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమర శంఖం పూరించారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయమే చేస్తుందని పదునైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేసి తమ అసంతృప్తిని పార్లమెంట్ సాక్షిగా వ్యక్తపరచాలని.. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలని టీఆర్ఎస్ గట్టిగా నిర్ణయించుకుంది. ఈ మేరకు తమ పార్టీ ఎంపీలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరంచాల్సిన వైఖరిపై మార్గనిర్దేశనం చేశారు. అధినేత ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే విషయాన్ని గ్రహించిన కేసీఆర్.. కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ఏదేతైనేం ఇన్నాళ్లుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా ప్రశ్నించని ఆయన.. ఇప్పుడు గొంతెత్తారని మరో వర్గం చెబుతోంది. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై పెద్ద రాద్దాంతం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటి గురించి, కేంద్రం చిన్న చూపుపై ప్రశ్నించడాన్ని ఉద్ధృతం చేసింది. అందుకు ఈ బడ్జెట్ సమావేశాలను వేదికగా ఎంచుకుంది.
ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీపై పోరాడుతుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ ప్రభుత్వం కిమ్మనడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విభజన చట్టం హామీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీకి ఎన్నో అంశాల్లో కేంద్రం నుంచి మొండిచెయ్యే ఎదురవుతోంది. కానీ 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
లోక్సభలో కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని చెబుతున్నారు. ఏదో చేశామా? లేదా? అన్నట్లు నిరసనలు చేపడుతున్నారే తప్ప.. వాటిల్లో తీవ్రత లేదన్న విషయాన్ని నిపుణులు వెల్లడిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు వైసీపీ మద్దతు తెలుపుతూనే ఉంది. కానీ రాష్ట్రానికి రావాల్సిన వాటిని అడగడంలో మాత్రం వెనకబడుతోందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవల జగన్ ఇక బీజేపీ కలిసి సాగేదే లేదన్నట్లు సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఇకనైనా జగన్.. మోడీపై యుద్ధానికి దిగుతారేమో చూడాలి.
This post was last modified on February 2, 2022 9:42 am
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…