Political News

బ‌డ్జెట్‌పై వైసీపీ మౌనం: అంగీక‌రించిన‌ట్టేనా?

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2022-23 వార్షిక బ‌డ్జెట్‌లో ప‌స‌లేద‌ని.. ఎవ‌రికీ ఏమీ లాభం లేద‌ని.. మాట‌ల గార‌డీ త‌ప్ప‌.. కేంద్రం చేసింది క‌నిపించ‌లేద‌ని.. ఈ బ‌డ్జెట్ ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దుమ్మెత్తిపోసింది. ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల ఉపాధులు, ఆరోగ్యం దెబ్బ‌తిన్నాయ‌ని.. వీటిని ఏమాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇక‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఈ బ‌డ్జెట్‌ను అధ‌ర్మ బ‌డ్జెట్‌గా, సొల్లు క‌బుర్ల బ‌డ్జెట్‌గా పేర్కొన్నారు. ఇక‌, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీలు కూడా దుయ్య‌బ‌ట్టాయి. మ‌రి ఇంత జ‌రిగినా.. ఏపీ  అధికార పార్టీ వైసీపీ నాయ‌కులు మాత్రం క‌క్క‌లేక .. మింగ‌లేక‌.. కుస్తీలు ప‌డుతున్నారు.

మ‌రి దీనిని బ‌ట్టి.. వైసీపీ నేత‌లు ఈ బ‌డ్జెట్‌ను స్వాగ‌తిస్తున్న‌ట్టు అనుకోవాలా?  వైసీపీ నేత‌లు.. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి వారాల త‌ర‌బ‌డి ఢిల్లీలో కూర్చుని మాకు అది ఇవ్వండి.. ఇది ఇవ్వండి.. ఆ ప్రాజెక్టు కేటాయించండి.. అని చెప్పినా.. తాజా బ‌డ్జెట్‌లో రూపాయి కూడా విద‌ల్చ‌లేదు. ఇది.. ఏపీకి శ‌రాఘాత‌మేన‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్ప‌టికే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి చేయూత ఇచ్చే దిశ‌గా బ‌డ్జెట్‌లో కేటాయింపులు ప్ర‌త్యేకంగా చేసింది లేద‌ని అంటున్నారు. మ‌రి ఇన్ని వైపుల నుంచి ఇంత‌గా విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. వైసీపీ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.  

ఇక‌, తెలంగాణ సీఎం కేవ‌లం గంట‌ల వ్య‌వ‌ధిలోనే బ‌డ్జెట్‌పై స్పందించారు. మ‌రి ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా స్పందిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఎన్ని గంట‌లు గ‌డిచినా.. ఆయ‌న స్పందించ‌లేదు. మౌనం అర్ధాంగీకారం.. అన్న‌ట్టుగా. ఆయ‌న బ‌డ్జెట్‌ను స్వాగ‌తిస్తున్నారా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం ఏం చేసినా.. దాదాపు అంగీక‌రిస్తూనే ఉన్నారు. ఐఏఎస్‌ల బ‌దిలీల‌ల‌కు సంబంధించి రాష్ట్రాల హ‌క్కులకు ఎస‌రు పెడుతున్నా.. బాగానే ఉంద‌ని సీఎం లేఖ రాశారు. ఇక‌, పెగాస‌స్‌పై పార్లమెంటులో చ‌ర్చ త‌ప్ప‌ద‌ని ఒక‌వైపు అన్ని విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నా.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అస‌లు ఈ అవ‌స‌ర‌మే లేద‌ని.. ఎవ‌రైనా స‌భ‌లో దీనిపై గొడ‌వ చేస్తే.. క‌టిన చ‌ర్య‌లు తీసుకోవాలని అన్నారు. సో.. ఇప్పుడు బ‌డ్జెట్ విష‌యంలో మౌనం పాటించారు.

సాయిరెడ్డి కామెంట్ ఇదే..
కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం జరుగుతోందని  ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని విషయాలు పరిశీలిస్తే కేంద్రం కొంత నిరుత్సాహపరిచే బడ్జెట్ను ప్రవేశ పెట్టిందన్నారు. భూమిలేని రైతులకు అండగా నిలిచేందుకు పథకం తేవాలని సూచించారు. కనీస మద్దతు ధరకు న్యాయపరమైన రక్షణ ఉండాలని అన్నారు. రొయ్యల ఉత్పత్తిపై పన్ను తగ్గింపును ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నదుల అనుసంధాన ప్రణాళికను సమర్థిస్తున్నామని.. నదుల అనుసంధానానికి పెట్టిన ఖర్చును రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

This post was last modified on February 2, 2022 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉనికిని చాటడానికి ‘రాకాస’ ప్లాన్లు

చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…

2 hours ago

డీజిల్ లేదు… అంత్యక్రియలు ఆపేస్తారా?

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్‌లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…

3 hours ago

సల్మాన్ సినిమా మునిగినట్లేనా?

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…

6 hours ago

ఆంటీలతో చాట్ చేయండి అంటూ…

సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…

6 hours ago

వామ్మో… కత్తిరింపుల్లోనే ఇంత హింస ఉందంటే

దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…

6 hours ago

ప్రేక్షకులపై ‘ఉస్తాద్’ నిర్మాతల ప్రేమ నిజమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…

8 hours ago