Political News

పార్లమెంట్ లో మళ్లీ మంటలు తప్పవా ?

పార్లమెంటులో మళ్ళీ మంటలు తప్పేట్లు లేదు. అప్పుడెప్పుడో పార్లమెంటు సమావేశాల ముందు కరెక్టుగా పెగాసస్ స్పై వేర్ మంటలు మండిపోయాయి. దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం పెగాసస్ అనే  స్పైవేర్ ద్వారా ట్యాప్ చేసిందనే ‘ది వైర్’ కథనం పార్లమెంటును ఒక ఊపు ఊపేసింది. మొత్తం ప్రతిపక్షాలన్నీ నరేంద్ర మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏకమయ్యాయి. దాంతో పార్లమెంటు సమావేశాలు రచ్చ రచ్చయిపోయాయి.

పెగాసస్ స్పైవేర్ ఆరోపణల నుంచి బయటపడేందుకు మోడీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కేంద్రం సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి అవలంభించటంతో స్పైవేర్ ఉపయోగించింది వాస్తవమే అని అందరికీ అర్ధమైపోయింది. చివరకు సుప్రీంకోర్టు సూమోటోగా పెగాసస్ వివాదంపై విచారణ మొదలు పెట్టింది. అంతకుముందే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేసిన విచారణ కమిటీని సుప్రీంకోర్టు నిలిపేసింది. కేసు విచారణ సందర్భంగా చివరకు సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం సరైన సమాధానాలు చెప్పలేదు.

సరే కోర్టులో విచారణ జరుగుతోంది కదాని ప్రతిపక్షాలు ఓపిగ్గా ఉన్నాయి. 31వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవబోతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే శనివారం నాడు పెగాసస్ స్పైవేర్ ను భారత్ కొనుగోలు చేసింది వాస్తవమే అనే కథనం దేశంలో మళ్ళీ సంచలనంగా మారింది. తాజా కథనాన్ని ప్రచురించింది ప్రముఖ అంతర్జాతీయ మీడియా న్యూయార్క్ టైమ్స్ కావటం గమనార్హం. పెగాసస్ స్పైవేర్ ను ఇజ్రాయెల్ నుండి భారత్ 2017లోనే కొన్నదట. 

భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన రక్షణ పరికరాల కొనుగోలులో భాగంగానే పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కూడా భారత్ కొన్నట్లు న్యూయార్క్ టైమ్స వివరంగా పెద్ద కథనాన్ని అచ్చేసింది. ఈ స్పైవేర్ ఆధారంగానే  రాహుల్ గాంధీ లాంటి ప్రముఖ రాజకీయ నేతలతో పాటు జడ్జీలు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, శాస్త్రజ్ఞులు, మీడియా ప్రముఖులు, సెలబ్రిటీలు సుమారు 300 మంది మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేస్తోందంటూ అప్పట్లో మంటలు మండాయి. ఇపుడు కూడా బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే ముందు మళ్ళీ అలాంటి కథనమే మరికొంత ఆధారాలతో సహా రావడం మోడీకి తలనొప్పి తెస్తుందనటంలో సందేహం లేదు.  

This post was last modified on January 30, 2022 4:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago