యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అయితే అది రియల్ లైఫ్ కాదు.. రీల్ లైఫ్ లో అని తెలుస్తోంది. గతంలో పాలిటిక్స్ ప్రచారాల్లో పాల్గొన్న ఎన్టీఆర్.. ఈ మధ్యాకాలంలో చాలా దూరంగా ఉంటున్నారు. ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ గురించి పెద్ద చర్చ నడుస్తున్నా.. ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. మొన్నామధ్య కొడాలి నాని తనపై కామెంట్స్ చేసినా.. ఎన్టీఆర్ పట్టించుకోలేదు.
ఇదంతా చూస్తుంటే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి లేదనే విషయం క్లియర్ గా తెలుస్తుంది. కానీ రీల్ లైఫ్ రాజకీయాలకు మాత్రం ఓకే చెప్పినట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. ఇందులో ఆయన స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
అదేంటంటే.. కథ ప్రకారం ఎన్టీఆర్ బస్తీలో చదువుకునే ఓ కుర్రాడి పాత్ర పోషిస్తున్నారట. అంతేకాదు.. బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడే పవర్ ఫుల్ రోల్ లో ఆయన దర్శనమివ్వబోతున్నారు. రాజకీయాలు, లంచగొండి రాజకీయనాయకులకు ఓ స్టూడెంట్ ఎదురుతిరిగితే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. కొరటాల ఈ లైన్ చెప్పిన వెంటనే ఎన్టీఆర్ ఓకే చెప్పేశారట.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. వచ్చే నెలలో ఈ సినిమాను మొదలుపెడతారని సమాచారం. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నట్లు టాక్. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నారు.
This post was last modified on January 29, 2022 8:15 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…