యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అయితే అది రియల్ లైఫ్ కాదు.. రీల్ లైఫ్ లో అని తెలుస్తోంది. గతంలో పాలిటిక్స్ ప్రచారాల్లో పాల్గొన్న ఎన్టీఆర్.. ఈ మధ్యాకాలంలో చాలా దూరంగా ఉంటున్నారు. ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ గురించి పెద్ద చర్చ నడుస్తున్నా.. ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. మొన్నామధ్య కొడాలి నాని తనపై కామెంట్స్ చేసినా.. ఎన్టీఆర్ పట్టించుకోలేదు.
ఇదంతా చూస్తుంటే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి లేదనే విషయం క్లియర్ గా తెలుస్తుంది. కానీ రీల్ లైఫ్ రాజకీయాలకు మాత్రం ఓకే చెప్పినట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. ఇందులో ఆయన స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
అదేంటంటే.. కథ ప్రకారం ఎన్టీఆర్ బస్తీలో చదువుకునే ఓ కుర్రాడి పాత్ర పోషిస్తున్నారట. అంతేకాదు.. బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడే పవర్ ఫుల్ రోల్ లో ఆయన దర్శనమివ్వబోతున్నారు. రాజకీయాలు, లంచగొండి రాజకీయనాయకులకు ఓ స్టూడెంట్ ఎదురుతిరిగితే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. కొరటాల ఈ లైన్ చెప్పిన వెంటనే ఎన్టీఆర్ ఓకే చెప్పేశారట.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. వచ్చే నెలలో ఈ సినిమాను మొదలుపెడతారని సమాచారం. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నట్లు టాక్. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నారు.
This post was last modified on January 29, 2022 8:15 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…