యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అయితే అది రియల్ లైఫ్ కాదు.. రీల్ లైఫ్ లో అని తెలుస్తోంది. గతంలో పాలిటిక్స్ ప్రచారాల్లో పాల్గొన్న ఎన్టీఆర్.. ఈ మధ్యాకాలంలో చాలా దూరంగా ఉంటున్నారు. ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ గురించి పెద్ద చర్చ నడుస్తున్నా.. ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. మొన్నామధ్య కొడాలి నాని తనపై కామెంట్స్ చేసినా.. ఎన్టీఆర్ పట్టించుకోలేదు.
ఇదంతా చూస్తుంటే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి లేదనే విషయం క్లియర్ గా తెలుస్తుంది. కానీ రీల్ లైఫ్ రాజకీయాలకు మాత్రం ఓకే చెప్పినట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. ఇందులో ఆయన స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
అదేంటంటే.. కథ ప్రకారం ఎన్టీఆర్ బస్తీలో చదువుకునే ఓ కుర్రాడి పాత్ర పోషిస్తున్నారట. అంతేకాదు.. బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడే పవర్ ఫుల్ రోల్ లో ఆయన దర్శనమివ్వబోతున్నారు. రాజకీయాలు, లంచగొండి రాజకీయనాయకులకు ఓ స్టూడెంట్ ఎదురుతిరిగితే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. కొరటాల ఈ లైన్ చెప్పిన వెంటనే ఎన్టీఆర్ ఓకే చెప్పేశారట.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. వచ్చే నెలలో ఈ సినిమాను మొదలుపెడతారని సమాచారం. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నట్లు టాక్. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నారు.
This post was last modified on January 29, 2022 8:15 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…