Political News

చంద్ర‌బాబు చేతికి నిజ‌నిర్ధార‌ణ నివేదిక‌.. ఈడీకి ఫిర్యాదు!

సంక్రాంతి సందర్భంగా గుడివాడలో మూడు రోజులపాటు నిర్వహించిన క్యాసినోలో దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు చేతులు మారినట్లు ప్రచారంలో ఉందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెనువిఘా తమని టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పేర్కొంది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు లేఖరాసి, దర్యాప్తు చేయాల్సిందిగా కోరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సూచించింది. కమిటీ సభ్యులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తంగిరాల సౌమ్యతో పాటు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ చంద్రబాబుకు నివేదిక అందజేశారు.

‘మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్‌ సెంటర్‌లో క్యాసినో నిర్వహించినట్టు, ఇతర రాష్ట్రాల యువతు లతో అశ్లీల నృత్యాలు చేయించినట్టు, తీన్‌పత్తీ, రోలెట్‌ తదితర జూదాలు జరిగినట్టు పట్టణమంతా కోడై కూస్తోంది. మంత్రికి సన్నిహితుడైన వైసీపీ నాయకుడు మండలి హనుమంతరావు.. మేం గుడివాడ వెళ్లడాన్ని నిరసిస్తూ క్యాసినో నడుస్తున్నప్పుడు రాకుండా ఇప్పుడొచ్చి ఏం చేస్తున్నారని బూతులు తిట్టారు. క్యాసినో జరిగిందనడానికి ఇదే నిదర్శనం’ అని నివేదిక పేర్కొంది.

‘క్యాసినోలో పాల్గొన్న వ్యక్తులు ఈ నెల 17న విజయవాడ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకు, అక్కడి నుంచి గోవాకు వెళ్లినట్టు ప్యాసింజర్‌ లిస్టు, వారికి టికెట్లు బుక్‌ చేసిన వ్యక్తి ఫోన్‌ నంబరు ద్వారా తెలిసింది’ అంటూ ఆ పేర్లు నివేదికలో ప్రస్తావించారు.

‘కోట్ల డబ్బు చేతులు మారడంపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)కి లేఖ రాయాలి. కేంద్ర ఆర్థిక మంత్రి లేదా ఆర్థికశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలి. మద్యం సరఫరాపై ఎస్‌ఈబీకి లేఖ రాయాలి. దర్యాప్తునకు రాష్ట్ర పోలీసులు సుముఖంగా లేనందున కేంద్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తేనే నిజాలు బయట పడతాయి. న్యాయస్థానాలనూ ఆశ్రయించాలి’ అని నివేదికలో పేర్కొన్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత టీడీపీ నేతలు మాట్లాడుతూ క్యాసినో ఘటనపై   గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

This post was last modified on January 26, 2022 11:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago