ఇప్పటికిప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడించటం సాధ్యమయ్యే పని కాదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తేల్చేశారు. మామూలుగా అయితే బీజేపీని ఓడించటం పెద్ద కష్టమేమీ కాదని కానీ ఆ పని కాంగ్రెస్ నేతృత్వంలో మాత్రం సాధ్యం కాదన్నారు. ఇదే విషయాన్ని గతంలో కూడా ఒకసారి పీకే చెప్పారు. 6 నెలల వ్యూహంతో బీజేపీని ఓడించాలంటే జరిగే పని కాదని పీకే అభిప్రాయపడ్డారు.
బీజేపీని ఓడించాలంటే 5-10 సంవత్సరాల ప్రణాళిక అవసరమన్నారు. ఒకసారేమో 2024లో బీజేపీని ఓడించటం సాధ్యమే అని చెబుతునే మరోవైపు 6 మాసాల ప్రణాళికతో అందులోను కాంగ్రెస్ నేతృత్వంలో సాధ్యం కాదని చెప్పటం పీకేకే చెల్లింది. ఒక దశలో పీకే ఆల్మోస్ట్ కాంగ్రెస్ లో చేరి కీలకపాత్ర పోషిస్తారనే అందరూ అనుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకగాంధీతో కూడీ పీకే భేటీ అయ్యారు. దాంతో ఇక రేమో మాపో పీకే కాంగ్రెస్ లో చేరిపోవటమే మిగిలిందనే అనుకున్నారందరు.
కానీ తెరవెనుక ఏమైందో ఏమో కాంగ్రెస్ లో చేరటం లేదని పీకే ప్రకటించారు. పార్టీ వర్గాల ప్రకారం పీకే అత్యంత కీలకమైన రాజకీయ సలహాదారు పదవి కావాలని పట్టుబట్టారట. అంటే చనిపోయేముందు అహ్మద్ పటేల్ నిర్వహించిన పోస్టది. రాజకీయ సలహాదారంటే సోనియాగాంధీ తర్వాత అంతటి కీలకమైన పోస్టు. అలాంటి పోస్టును పీకేకి ఇవ్వటానికి పార్టీలో ఎవరు అంగీకరించలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. దాని కారణంగానే పీకే కాంగ్రెస్ లో చేరిక నిలిచిపోయినట్లు ప్రచారంలో ఉంది.
అప్పటినుండే కాంగ్రెస్ అంటేనే పీకే మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను లీడ్ చేయటం కాంగ్రెస్ వల్ల కాదని పదే పదే చెబుతున్నారు. ఇపుడు కూడా అదేమాట చెప్పారు. ఇక్కడ విచిత్రమేమిటంటే కాంగ్రెస్ కాకుండా జాతీయ స్ధాయిలో ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం వహించేంత సీన్ మరే పార్టీకి లేదు. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ మినహా మిగిలినవన్నీ ప్రాంతీయపార్టీలు మాత్రమే. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, ఆప్ లాంటివి జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నా వాస్తవానికి వాటికంత సీన్ లేదు. అందుకనే నరేంద్రద మోడీ హ్యాపీగా ఉన్నారు.
This post was last modified on January 25, 2022 11:44 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…