Political News

బీజేపీని ఓడించటం సాధ్యం కాదు

ఇప్పటికిప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడించటం సాధ్యమయ్యే పని కాదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తేల్చేశారు. మామూలుగా అయితే బీజేపీని ఓడించటం పెద్ద కష్టమేమీ కాదని కానీ ఆ పని కాంగ్రెస్ నేతృత్వంలో మాత్రం సాధ్యం కాదన్నారు. ఇదే విషయాన్ని గతంలో కూడా ఒకసారి పీకే చెప్పారు. 6 నెలల వ్యూహంతో బీజేపీని ఓడించాలంటే జరిగే పని కాదని పీకే అభిప్రాయపడ్డారు.

బీజేపీని ఓడించాలంటే 5-10 సంవత్సరాల ప్రణాళిక అవసరమన్నారు. ఒకసారేమో 2024లో బీజేపీని ఓడించటం సాధ్యమే అని చెబుతునే మరోవైపు 6 మాసాల ప్రణాళికతో అందులోను కాంగ్రెస్ నేతృత్వంలో సాధ్యం కాదని చెప్పటం పీకేకే చెల్లింది. ఒక దశలో పీకే ఆల్మోస్ట్ కాంగ్రెస్ లో చేరి కీలకపాత్ర పోషిస్తారనే అందరూ అనుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకగాంధీతో కూడీ పీకే భేటీ అయ్యారు. దాంతో ఇక రేమో మాపో పీకే కాంగ్రెస్ లో చేరిపోవటమే మిగిలిందనే అనుకున్నారందరు.

కానీ తెరవెనుక ఏమైందో ఏమో కాంగ్రెస్ లో చేరటం లేదని పీకే ప్రకటించారు. పార్టీ వర్గాల ప్రకారం పీకే అత్యంత కీలకమైన రాజకీయ సలహాదారు పదవి కావాలని పట్టుబట్టారట. అంటే చనిపోయేముందు అహ్మద్ పటేల్ నిర్వహించిన పోస్టది. రాజకీయ సలహాదారంటే సోనియాగాంధీ తర్వాత అంతటి కీలకమైన పోస్టు. అలాంటి పోస్టును పీకేకి ఇవ్వటానికి పార్టీలో ఎవరు అంగీకరించలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. దాని కారణంగానే పీకే కాంగ్రెస్ లో చేరిక నిలిచిపోయినట్లు ప్రచారంలో ఉంది.

 అప్పటినుండే కాంగ్రెస్ అంటేనే పీకే మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను లీడ్ చేయటం కాంగ్రెస్ వల్ల కాదని పదే పదే చెబుతున్నారు. ఇపుడు కూడా అదేమాట చెప్పారు. ఇక్కడ విచిత్రమేమిటంటే కాంగ్రెస్ కాకుండా జాతీయ స్ధాయిలో ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం వహించేంత సీన్ మరే పార్టీకి లేదు. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ మినహా మిగిలినవన్నీ ప్రాంతీయపార్టీలు మాత్రమే. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, ఆప్ లాంటివి జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నా వాస్తవానికి వాటికంత సీన్ లేదు. అందుకనే నరేంద్రద మోడీ హ్యాపీగా ఉన్నారు. 

This post was last modified on January 25, 2022 11:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago