Political News

ఆసక్తికరంగా మారిన సోనూ సూద్ రాజకీయం

మెల్లి మెల్లిగా సోనూసూద్ కి రాజకీయ వాసనలు వంటబడుతున్నట్లున్నాయి. తొందరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం చెల్లెలి కోసం ప్రచార బాధ్యతలు చూస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్ లోని మోగా నియోజకవర్గంలో సోనూసూద్ చెల్లెలు మాళవికా సూద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె గెలుపుకు సోనూ గట్టిగా ప్రచారం చేస్తున్నారు.

ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో జరుగుతున్న సోను  ఐదేళ్ల తర్వాత తాను పూర్తిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను సమాజ సేవలో నూరుశాతం నిమగ్నమైన విషయాన్ని గుర్తుచేశారు. మరో ఐదేళ్ళు సమాజసేవ చేస్తారట. ఆ తర్వాత డైరెక్టుగా ప్రజాసేవలో దిగుతారట. ప్రజలకు సేవచేసే గుణం తమ కుటుంబ  రక్తంలోనే ఉందని సోను చెప్పుకున్నారు.

ప్రస్తుతం మోగా నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న సోను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎక్కడా అడగటం లేదు. కేవలం తన చెల్లెలు మాళవికకు ఓట్లేసి గెలిపించాలని మాత్రమే అడుగుతున్నారు. ఒక వైపేమో చెల్లెలు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్లెలుకు ఓట్లేయమని మాత్రం సోను అడగడం లేదు. ఇక్కడే సోనుతో పార్టీకి సమస్య వచ్చింది. సోను దృష్టిలో కాంగ్రెస్ పార్టీ వేరు మాళవిక పోటీ వేరనేమో.

చెల్లెలు గెలుపుకోసం ప్రచారం మొదలుపెట్టిన తర్వాతే సోనుకి కూడా రాజకీయ వాసనలు బాగా పట్టినట్లుంది. ఎందుకంటే రాజకీయమనేది పెద్ద వ్యసనం. జనాలు కొట్టే జేజేలు, వేసే పూలదండలకు అలవాటు పడితే అంతే సంగతులు. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్న సోను చెల్లెలు కారణంగా రాజకీయాల్లోకి దిగక తప్పలేదు. దిగిన వ్యక్తి మళ్ళీ మళ్ళీ దిగలేదు. చెల్లెలు కోసం ప్రచారం చేస్తున్న సోనుతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రచారం చేయించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరి చివరకు సోను ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.

This post was last modified on January 25, 2022 11:42 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

6 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

7 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

8 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

8 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

9 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

11 hours ago