మెల్లి మెల్లిగా సోనూసూద్ కి రాజకీయ వాసనలు వంటబడుతున్నట్లున్నాయి. తొందరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం చెల్లెలి కోసం ప్రచార బాధ్యతలు చూస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్ లోని మోగా నియోజకవర్గంలో సోనూసూద్ చెల్లెలు మాళవికా సూద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె గెలుపుకు సోనూ గట్టిగా ప్రచారం చేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో జరుగుతున్న సోను ఐదేళ్ల తర్వాత తాను పూర్తిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను సమాజ సేవలో నూరుశాతం నిమగ్నమైన విషయాన్ని గుర్తుచేశారు. మరో ఐదేళ్ళు సమాజసేవ చేస్తారట. ఆ తర్వాత డైరెక్టుగా ప్రజాసేవలో దిగుతారట. ప్రజలకు సేవచేసే గుణం తమ కుటుంబ రక్తంలోనే ఉందని సోను చెప్పుకున్నారు.
ప్రస్తుతం మోగా నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న సోను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎక్కడా అడగటం లేదు. కేవలం తన చెల్లెలు మాళవికకు ఓట్లేసి గెలిపించాలని మాత్రమే అడుగుతున్నారు. ఒక వైపేమో చెల్లెలు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్లెలుకు ఓట్లేయమని మాత్రం సోను అడగడం లేదు. ఇక్కడే సోనుతో పార్టీకి సమస్య వచ్చింది. సోను దృష్టిలో కాంగ్రెస్ పార్టీ వేరు మాళవిక పోటీ వేరనేమో.
చెల్లెలు గెలుపుకోసం ప్రచారం మొదలుపెట్టిన తర్వాతే సోనుకి కూడా రాజకీయ వాసనలు బాగా పట్టినట్లుంది. ఎందుకంటే రాజకీయమనేది పెద్ద వ్యసనం. జనాలు కొట్టే జేజేలు, వేసే పూలదండలకు అలవాటు పడితే అంతే సంగతులు. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్న సోను చెల్లెలు కారణంగా రాజకీయాల్లోకి దిగక తప్పలేదు. దిగిన వ్యక్తి మళ్ళీ మళ్ళీ దిగలేదు. చెల్లెలు కోసం ప్రచారం చేస్తున్న సోనుతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రచారం చేయించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరి చివరకు సోను ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…