మెల్లి మెల్లిగా సోనూసూద్ కి రాజకీయ వాసనలు వంటబడుతున్నట్లున్నాయి. తొందరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం చెల్లెలి కోసం ప్రచార బాధ్యతలు చూస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్ లోని మోగా నియోజకవర్గంలో సోనూసూద్ చెల్లెలు మాళవికా సూద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె గెలుపుకు సోనూ గట్టిగా ప్రచారం చేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో జరుగుతున్న సోను ఐదేళ్ల తర్వాత తాను పూర్తిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను సమాజ సేవలో నూరుశాతం నిమగ్నమైన విషయాన్ని గుర్తుచేశారు. మరో ఐదేళ్ళు సమాజసేవ చేస్తారట. ఆ తర్వాత డైరెక్టుగా ప్రజాసేవలో దిగుతారట. ప్రజలకు సేవచేసే గుణం తమ కుటుంబ రక్తంలోనే ఉందని సోను చెప్పుకున్నారు.
ప్రస్తుతం మోగా నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న సోను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎక్కడా అడగటం లేదు. కేవలం తన చెల్లెలు మాళవికకు ఓట్లేసి గెలిపించాలని మాత్రమే అడుగుతున్నారు. ఒక వైపేమో చెల్లెలు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్లెలుకు ఓట్లేయమని మాత్రం సోను అడగడం లేదు. ఇక్కడే సోనుతో పార్టీకి సమస్య వచ్చింది. సోను దృష్టిలో కాంగ్రెస్ పార్టీ వేరు మాళవిక పోటీ వేరనేమో.
చెల్లెలు గెలుపుకోసం ప్రచారం మొదలుపెట్టిన తర్వాతే సోనుకి కూడా రాజకీయ వాసనలు బాగా పట్టినట్లుంది. ఎందుకంటే రాజకీయమనేది పెద్ద వ్యసనం. జనాలు కొట్టే జేజేలు, వేసే పూలదండలకు అలవాటు పడితే అంతే సంగతులు. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్న సోను చెల్లెలు కారణంగా రాజకీయాల్లోకి దిగక తప్పలేదు. దిగిన వ్యక్తి మళ్ళీ మళ్ళీ దిగలేదు. చెల్లెలు కోసం ప్రచారం చేస్తున్న సోనుతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రచారం చేయించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరి చివరకు సోను ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on January 25, 2022 11:42 am
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…