ఔను.. తెలంగాణ రూపు రేఖలు మరింతగా మారనున్నాయని అంటున్నారు పరిశీలకులు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత వృద్ధి చెందడంతోపాటు.. భూముల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న కొల్లాపూర్ (167కే) జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించి డీపీఆర్ని కేంద్రం ఆమోదించిం ది. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీనికి ఆమోద ముద్రవేసింది.
ఈ రహదారి నిర్మాణంతో హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సోమశిల వంతెన నిర్మాణం కూడా పూర్తి కానుంది. రెండు రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న కొల్లాపూర్ (167కే) జాతీయ రహదారికి దాదాపు 173.73 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బైపాస్, రీ అలైన్మెంట్ల నిర్మాణాలూ ఉంటాయి. కొల్లాపూర్ (167కే) జాతీయ రహదారి నిర్మాణం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపంలోని కొట్రా జంక్షన్ నుంచి ప్రారంభమవుతుంది.
కల్వకుర్తి, తాడూరు, నాగర్కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. సోమశిల సమీ పంలో కృష్ణానదిపై రీ అలైన్మెంట్ బ్రిడ్జి నిర్మిస్తారు. ఫలితంగా ఆయా ప్రాంతాలు మరింత విస్తరించడం తోపాటు.. సమీపంలోని భూములకు మరింత ధరలు పెరగనున్నాయి. అంతేకాదు.. రియల్ ఎస్టేట్ మరింతగా పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. అదేసమయంలో ఏపీ నుంచి పెట్టుబడులు కూడా భారీగా వస్తాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
కొల్లాపూర్ జాతీయ రహదారి నిర్మాణం.. మూడు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు. ఇక, ఇది రాజకీయంగా కూడా వచ్చే ఎన్నికల్లో కీలక రోల్ పోషించనుంది. దీనిని తీసుకువచ్చింది తామేనని కేసీఆర్ సర్కారు చెప్పుకొనే ప్రయత్నం చేయగా.. కేంద్రంలోని మా నాయకులే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. నిధులు కూడా ఇస్తున్నారని.. బీజేపీ నేతలు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా.. కొల్లాపూర్ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే.. తెలంగాణ రూపు రేఖలు మారతాయని అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు.
This post was last modified on January 24, 2022 5:56 pm
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…