Political News

ఆ ఎమ్మెల్యే కొత్త ఎత్తు..

చేతికి ఉన్న వేళ్ల‌న్నీ ఒకేలా ఉండ‌నట్టుగా.. వైసీపీలోనూ ఎమ్మెల్యేలు అంద‌రూ ఒకేలా క‌నిపించ‌డం లేదు. కొంద‌రు ప్ర‌భుత్వం ఏం చెబితే దానిని గుడ్డిగా అనుస‌రిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం త‌మ అజెండాను అమ‌లు చేస్తున్నారు. ఇంకొంద‌రు.. అస‌లు ఇవ‌న్నీ ఎందుకులే.. అని వ్యాపారాలు.. వ్య‌వ‌హారాల్లో మునిగిపోయి.. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఒక‌రంటే ఒక‌రికి ఎమ్మెల్యేలు.. గిట్ట‌డం లేదు. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఒక‌రిపై ఒక‌రుపైచేయి సాధిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగుఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు..?  త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ ఏం చేస్తున్నాడు? త‌న‌కు తెలిసే ప‌నులు చేస్తున్నాడా?  లేదా.. త‌న‌పై పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడా? అనే ఆలోచ‌న ఎమ్మెల్యేల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది.

ఈ క్ర‌మంలో ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. ఎంపీలు స‌హా పొరుగు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేల ఆనుపా నులు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌మ‌కు అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను వారు వినియోగించుకుంటున్నా రు. ఈ క్ర‌మంంలో తూర్పు గోదావ‌రి జిల్లా రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా అద్భుత‌మైన ఐడియా వేశారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకీ రాని ఐడియా ఆయ‌న‌కు వ‌చ్చేసింది. దీంతో వెంట‌నే ఆయ‌న ఆచ‌ర‌ణ‌లో కూడా పెట్టేశారు. అదే.. వ‌లంటీర్ల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం. త‌న నియోజ‌వ‌క‌ర్గంలో ప్ర‌భుత్వం నియ‌మించిన వ‌లంటీర్ల‌ను ఆయ‌న మ‌చ్చిక చేసుకుంటున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డ ఏం జ‌రిగినా.. త‌న‌కు క్ష‌ణాల్లో స‌మాచారం అందేలా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకుంటున్నార‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి వ‌లంటీర్‌కు వాస్త‌వానికి 50 ఇళ్ల‌కు ఒక వ‌లంటీర్ ఉన్నారు. సో.. ఇంత మందికీ .. రాజా.. ప‌ర్స‌న‌ల్ ఇన్సూరెన్స్ చేయించారు. వారికి ఏదైనా అయినా.. కుటుంబానికి ర‌క్ష‌గా ఉంటుంద‌ని.. చెబుతూ.. ప్ర‌తి వ‌లంటీర్‌కు రూ.2 ల‌క్ష‌ల మేర‌కు ఇన్సూరెన్స్ చేయించారు.  అది కూడా ఆయ‌న సొంత నిధులు కేటాయించారు. భారీ ఎత్తునే ఖ‌ర్చు పెట్టార‌ట‌.

అయితే.. నాయ‌కులు ఏం చేసినా.. ఊరికేనే చేయ‌రు క‌దా.. ఇదే విష‌యంపై సొంత పార్టీనేత‌లే కూపీ లాగారు. తీరా చూస్తే.. రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్‌కు, రాజాకు ప‌చ్చ‌గ‌డ్డి వేసిని భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఎంపీ ఎక్క‌డైనా త‌న‌కు తెలియ‌కుండా రాజ‌కీయాలు చేస్తే.. వెంట‌నే ఉప్పందించేలా.. త‌న ప‌క్షాన అనుకూల  ప్ర‌చారం చేసేలా.. ఖ‌ర్చులేని విధంగా వ‌లంటీర్ల‌ను వాడుకునేందుకు రాజా ఇలా ప్లాన్ చేశార‌ని వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. మొత్తానికి ఈ ఐడియా ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on January 24, 2022 3:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇండస్ట్రీలో కొత్త ‘అల్లరోడు’

అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…

2 hours ago

ఏడాది తర్వాత… ఈ రోజు విధ్వంసమే

ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…

4 hours ago

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

5 hours ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

8 hours ago

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

8 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

8 hours ago