కొడాలి నాని.. తన మాటలతో, విమర్శలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే నాయకుడు. ఏపీ సీఎం జగన్పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే నాని రంగంలోకి దిగిపోయి ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చేస్తుంటారు. ఇక ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నాని అంటే ఓ కొరుకుడు పడని నేత. విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా నాని టార్గెట్ అంతా చంద్రబాబే అనడంలో సందేహం లేదు. తన మాటల దాడితో ఆయన బాబుపై చెలరేగుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో తమకు కొరకరాని కొయ్యగా మారిన నానికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు క్యాసినో రూపంలో మంచి అవకాశం వచ్చిందని టీడీపీ భావిస్తోందని సమాచారం.
సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని తన కె కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో ఏర్పాటు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే నాని రూ.500 కోట్లు సంపాదించారని చెబుతోంది. దీనిపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైంది. క్యాసినో పెట్టారా? లేదో? తెలుసుకోవడానికి టీడీపీ నేతలు కలిసి నిజ నిర్దారణ కమిటీ పేరుతో గుడివాడ వెళ్లడం.. ఉద్రిక్తతల నేపథ్యంలో వాళ్లను పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే.
మరోవైపు తాను క్యాసినో ఏర్పాటు చేశానని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని మరీ నిప్పు అంటించుకుంటానని నాని సవాల్ విసిరారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత ధూలిపాళ్ల నరేంద్ర క్యాసినో జరిగినట్లు నిరూపించే సాక్ష్యాల వీడియోలను ప్రదర్శించారు. అవి నాని నిర్వహించిన క్యాసినోవేనని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు నాని తన పదవికి రాజీనామా చేసి పెట్రోల్ పోసుకుంటారా? అని ప్రశ్నించారు.
గుడివాడ నియోజకవర్గంలో నానికి గొప్ప పట్టుంది. తన కమ్మ సామాజిక వర్గం అండగా ఉంది. దీంతో నాని తనకు తలనొప్పిగా మారారన్నది చంద్రబాబు భావన. అందుకే గుడివాడలో నానిని పడగొడితే జిల్లాలో పైచేయి సాధించవచ్చని బాబు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిక నానిని టార్గెట్ చేసేందుకు క్యాసినో వ్యవహారం బాబుకు ఆయుధంగా దొరికింది. అందుకే వెంటనే పార్టీ నాయకులను రంగంలోకి దింపారు. నిజ నిర్ధారణ బృందం అంటూ హడావుడి చేశారు. ఇప్పడు ఇదిగో సాక్ష్యాలు అంటూ వీడియోలు బయటపెట్టారు. మొత్తానికి నానికి చెక్ పెట్టేందుకు దొరికిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బాబు వేగంగా పావులు కదుపుతున్నారన్నది స్పష్టమవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…