కొడాలి నాని.. తన మాటలతో, విమర్శలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే నాయకుడు. ఏపీ సీఎం జగన్పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే నాని రంగంలోకి దిగిపోయి ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చేస్తుంటారు. ఇక ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నాని అంటే ఓ కొరుకుడు పడని నేత. విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా నాని టార్గెట్ అంతా చంద్రబాబే అనడంలో సందేహం లేదు. తన మాటల దాడితో ఆయన బాబుపై చెలరేగుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో తమకు కొరకరాని కొయ్యగా మారిన నానికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు క్యాసినో రూపంలో మంచి అవకాశం వచ్చిందని టీడీపీ భావిస్తోందని సమాచారం.
సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని తన కె కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో ఏర్పాటు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే నాని రూ.500 కోట్లు సంపాదించారని చెబుతోంది. దీనిపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైంది. క్యాసినో పెట్టారా? లేదో? తెలుసుకోవడానికి టీడీపీ నేతలు కలిసి నిజ నిర్దారణ కమిటీ పేరుతో గుడివాడ వెళ్లడం.. ఉద్రిక్తతల నేపథ్యంలో వాళ్లను పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే.
మరోవైపు తాను క్యాసినో ఏర్పాటు చేశానని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని మరీ నిప్పు అంటించుకుంటానని నాని సవాల్ విసిరారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత ధూలిపాళ్ల నరేంద్ర క్యాసినో జరిగినట్లు నిరూపించే సాక్ష్యాల వీడియోలను ప్రదర్శించారు. అవి నాని నిర్వహించిన క్యాసినోవేనని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు నాని తన పదవికి రాజీనామా చేసి పెట్రోల్ పోసుకుంటారా? అని ప్రశ్నించారు.
గుడివాడ నియోజకవర్గంలో నానికి గొప్ప పట్టుంది. తన కమ్మ సామాజిక వర్గం అండగా ఉంది. దీంతో నాని తనకు తలనొప్పిగా మారారన్నది చంద్రబాబు భావన. అందుకే గుడివాడలో నానిని పడగొడితే జిల్లాలో పైచేయి సాధించవచ్చని బాబు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిక నానిని టార్గెట్ చేసేందుకు క్యాసినో వ్యవహారం బాబుకు ఆయుధంగా దొరికింది. అందుకే వెంటనే పార్టీ నాయకులను రంగంలోకి దింపారు. నిజ నిర్ధారణ బృందం అంటూ హడావుడి చేశారు. ఇప్పడు ఇదిగో సాక్ష్యాలు అంటూ వీడియోలు బయటపెట్టారు. మొత్తానికి నానికి చెక్ పెట్టేందుకు దొరికిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బాబు వేగంగా పావులు కదుపుతున్నారన్నది స్పష్టమవుతోంది.
This post was last modified on January 23, 2022 4:56 pm
కొన్ని రాజకీయ చర్చలు ఆసక్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయకులు కూడా.. సుదీర్ఘకాలం చర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజకీయ చర్చల్లో…
ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.…
పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే…
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…