Political News

నేడు అచ్చెన్న.. రేపు ఆయనా?

గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి ముందు నుంచి తాము.. అధికారం చేపడితే తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి, అక్రమాలన్నీ బయటికి తీస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూనే వస్తున్నారు. వచ్చాక కూడా ఆ హెచ్చరికలు కొనసాగాయి.

ఐతే గత ఏడాది కాలంలో అలాంటి సంకేతాలు పెద్దగా కనిపంచకపోవడంతో తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి విషయంలో జగన్ సర్కారు లైట్ తీసుకున్నట్లే కనిపించింది. కానీ ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అభిప్రాయాలు మారుతున్నాయి.

ఏడాది కాలంలో నెమ్మదిగా గత ప్రభుత్వ వ్యవహారాలన్నింటినీ స్టడీ చేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చి తెదేపా అగ్ర నాయకుల్ని టార్గెట్ చేయబోతున్నట్లుగా స్పష్టమవుతోంది.

తాజాగా ఈఎస్ఐలో మందుల కొనుగోలు స్కామ్‌ను బయటికి తెచ్చింది జగన్ సర్కారు. ఇందులో ఇప్పటికే కొందరు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇప్పుడు తెదేపా అగ్ర నేత, గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడిని అరెస్టు చేసే వరకు వచ్చింది వ్యవహారం.

ఈ స్కాంలో ఆయన అడ్డంగా దొరికారని అంటున్నారు. కొన్ని నకిలీ కంపెనీలకు టెండర్ కూడా లేకుండా మందుల కాంట్రాక్టు ఇచ్చే దిశగా ఆయన ఈఎస్ఐకి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. ఆ లేఖ తాలూకు ప్రతి, ఇతర సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అధికారులు అచ్చెన్నను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ స్కాంలో మరికొందరు తెదేపా అగ్ర నేతల ప్రమేయం ఉందంటున్నారు. మరో మాజీ మంత్రిని కూడా సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందట. ఆ మంత్రి.. ప్రత్తిపాటి పుల్లారావు అనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఆయన తనయుడికి ఈ స్కాంలో వాటా ఉందని.. దీంతో ప్రత్తిపాటిని కూడా సీబీఐ టార్గెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మరోవైపు అమరావతి భూముల వ్యవహారంలోనూ రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on June 12, 2020 8:04 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

51 minutes ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

2 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

3 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

4 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

5 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

5 hours ago