Political News

నేడు అచ్చెన్న.. రేపు ఆయనా?

గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి ముందు నుంచి తాము.. అధికారం చేపడితే తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి, అక్రమాలన్నీ బయటికి తీస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూనే వస్తున్నారు. వచ్చాక కూడా ఆ హెచ్చరికలు కొనసాగాయి.

ఐతే గత ఏడాది కాలంలో అలాంటి సంకేతాలు పెద్దగా కనిపంచకపోవడంతో తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి విషయంలో జగన్ సర్కారు లైట్ తీసుకున్నట్లే కనిపించింది. కానీ ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అభిప్రాయాలు మారుతున్నాయి.

ఏడాది కాలంలో నెమ్మదిగా గత ప్రభుత్వ వ్యవహారాలన్నింటినీ స్టడీ చేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చి తెదేపా అగ్ర నాయకుల్ని టార్గెట్ చేయబోతున్నట్లుగా స్పష్టమవుతోంది.

తాజాగా ఈఎస్ఐలో మందుల కొనుగోలు స్కామ్‌ను బయటికి తెచ్చింది జగన్ సర్కారు. ఇందులో ఇప్పటికే కొందరు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇప్పుడు తెదేపా అగ్ర నేత, గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడిని అరెస్టు చేసే వరకు వచ్చింది వ్యవహారం.

ఈ స్కాంలో ఆయన అడ్డంగా దొరికారని అంటున్నారు. కొన్ని నకిలీ కంపెనీలకు టెండర్ కూడా లేకుండా మందుల కాంట్రాక్టు ఇచ్చే దిశగా ఆయన ఈఎస్ఐకి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. ఆ లేఖ తాలూకు ప్రతి, ఇతర సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అధికారులు అచ్చెన్నను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ స్కాంలో మరికొందరు తెదేపా అగ్ర నేతల ప్రమేయం ఉందంటున్నారు. మరో మాజీ మంత్రిని కూడా సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందట. ఆ మంత్రి.. ప్రత్తిపాటి పుల్లారావు అనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఆయన తనయుడికి ఈ స్కాంలో వాటా ఉందని.. దీంతో ప్రత్తిపాటిని కూడా సీబీఐ టార్గెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మరోవైపు అమరావతి భూముల వ్యవహారంలోనూ రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

suman

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

6 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

9 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

9 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

9 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

10 hours ago