Political News

నియామకం తర్వాత చట్ట సవరణా ?

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఇందుకు తాజాగా హైకోర్టులో చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే బోర్డులో 29 మంది సభ్యులున్నారు. వీరు కాకుండా మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులివ్వటమే కాకుండా నియామకాలు కూడా చేసింది. దాన్ని కోర్టులో సవాలు చేశారు.

దేవాదాయ చట్టంలో అసలు ప్రత్యేక ఆహ్వానితుల ప్రస్తావనే లేదని పిటిషనర్ చెప్పారు. కాబట్టి ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని వాదించారు. బోర్డు సభ్యుల నియామకం తప్ప ప్రత్యేక ఆహ్వానితులను నియమించేందుకు లేదని పిటీషనర్ తరపు లాయర్ వాదించారు. ఇదే విషయమై ప్రభుత్వం తరపు లాయర్ మాట్లాడుతూ ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో ప్రభుత్వం చట్ట సవరణ చేయబోతోందని చెప్పారు.

ఇక్కడే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో ప్రభుత్వ నిర్ణయం తప్పని అర్ధమైపోతోంది. ప్రత్యేక ఆహ్వానితులను నియమించాలని అనుకుంటే ముందుగా చట్ట సవరణ చేయాలి. ఆ తర్వాతే ప్రభుత్వం నియామకాలు చేయాలి. అంతేకానీ ముందు నియామకాలు చేసేసి తర్వాత ఎప్పుడో చట్ట సవరణ చేస్తామని చెప్పటమే విడ్డూరం. ఇపుడు కూడా కోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి, విచారణ జరుగుతోంది కాబట్టే చట్ట సవరణ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరు పట్టించుకోకపోతే చట్ట సవరణ ఉద్దేశ్యమే ప్రభుత్వానికి ఉండేదికాదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుంది ప్రభుత్వం తీరు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులు కేసులు పడేట్లుగా ప్రభుత్వమే కొన్నిసార్లు అవకాశం ఇస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఏ నిర్ణయమైనా న్యాయసమీక్షకు నిలబడేట్లుగా ఉండాలన్న కనీస ఇంగితం లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటవుతుందంటే కుదరదు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేముందే జాగ్రత్త పడితే అందరికీ మంచిది.

This post was last modified on January 22, 2022 11:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

45 minutes ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

3 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

5 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

5 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

7 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

7 hours ago