మళ్లీ వార్తల్లోకి వచ్చింది హెరిటేజ్ సంస్థ. చంద్రబాబు కుటుంబానికి చెందిన ఈ సంస్థ పేరు తరచూ ఏదో ఒక వివాదానికి ముడిపెడుతూ వార్తలు వస్తుంటాయి. బాబు ప్రభుత్వ హయాంలో ఈ సంస్థకు చెందిన మజ్జిగ పాకెట్ల డీల్ భారీగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విలువ రూ.40 కోట్ల మేర ఉందన్న మాట హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. తమపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తోంది హెరిటేజ్ సంస్థ. టీడీపీ హయాంలో ప్రభుత్వాలకు.. కొన్ని దేవాలయాలకు సరఫరా చేసిన మొత్తం మజ్జిగ ప్యాకెట్ల విలువ కేవలం రూ.కోటిన్నర మాత్రమేనని స్పష్టం చేసింది.
మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిన హెరిటేజ్ సంస్థ.. తమపై వస్తున్న విమర్శల్లో నిజం లేదని స్పష్టం చేస్తోంది. దేవాలయాలు పిలిచిన టెండర్లలో పాల్గొని.. మొత్తం ఐదేళ్లలో కోటిన్నర విలువైన మజ్జిగ పాకెట్లు మాత్రమే సరఫరా చేశామని.. తమతో పాటు మరికొన్ని సంస్థలు కూడా సరఫరా చేశాయని వెల్లడించింది.
మజ్జిగ విషయంలో క్లారిటీ ఇచ్చిన హెరిటేజ్.. మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల కాలంలో తాము వంద గ్రాముల నెయ్యి పాకెట్లను సరఫరా చేశామని చెప్పింది. ఈ డీల్ విలువ రూ.21 కోట్లుగా పేర్కొనటం గమనార్హం. తమ సంస్థపై చేసే తప్పుడు ప్రచారం కారణంగా.. లక్షలాది మంది రైతాంగం నష్టపోయేలా చేస్తుందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తమపై తప్పుడు ప్రచారం మంచిది కాదని హెరిటేజ్ పేర్కొంది.
This post was last modified on June 12, 2020 3:24 pm
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…
ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…