మళ్లీ వార్తల్లోకి వచ్చింది హెరిటేజ్ సంస్థ. చంద్రబాబు కుటుంబానికి చెందిన ఈ సంస్థ పేరు తరచూ ఏదో ఒక వివాదానికి ముడిపెడుతూ వార్తలు వస్తుంటాయి. బాబు ప్రభుత్వ హయాంలో ఈ సంస్థకు చెందిన మజ్జిగ పాకెట్ల డీల్ భారీగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విలువ రూ.40 కోట్ల మేర ఉందన్న మాట హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. తమపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తోంది హెరిటేజ్ సంస్థ. టీడీపీ హయాంలో ప్రభుత్వాలకు.. కొన్ని దేవాలయాలకు సరఫరా చేసిన మొత్తం మజ్జిగ ప్యాకెట్ల విలువ కేవలం రూ.కోటిన్నర మాత్రమేనని స్పష్టం చేసింది.
మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిన హెరిటేజ్ సంస్థ.. తమపై వస్తున్న విమర్శల్లో నిజం లేదని స్పష్టం చేస్తోంది. దేవాలయాలు పిలిచిన టెండర్లలో పాల్గొని.. మొత్తం ఐదేళ్లలో కోటిన్నర విలువైన మజ్జిగ పాకెట్లు మాత్రమే సరఫరా చేశామని.. తమతో పాటు మరికొన్ని సంస్థలు కూడా సరఫరా చేశాయని వెల్లడించింది.
మజ్జిగ విషయంలో క్లారిటీ ఇచ్చిన హెరిటేజ్.. మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల కాలంలో తాము వంద గ్రాముల నెయ్యి పాకెట్లను సరఫరా చేశామని చెప్పింది. ఈ డీల్ విలువ రూ.21 కోట్లుగా పేర్కొనటం గమనార్హం. తమ సంస్థపై చేసే తప్పుడు ప్రచారం కారణంగా.. లక్షలాది మంది రైతాంగం నష్టపోయేలా చేస్తుందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తమపై తప్పుడు ప్రచారం మంచిది కాదని హెరిటేజ్ పేర్కొంది.
This post was last modified on June 12, 2020 3:24 pm
సరిగ్గా వచ్చే వారం ఇదే రోజు ది ప్యారడైజ్ ప్రీమియర్లు పడబోతున్నాయి. సాయంత్రం రాత్రి కలిపి రెండు షోలు ప్లాన్…
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీ విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా బుధవారం…
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్ల తర్వాత.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రాజాం నియోజకవర్గం పరిధి లో…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దేశంలోని కాంగ్రెస్ పార్టీ హామీలను కాపీ కొడుతున్నాడా అంటే ఔననే చెబుతున్నాడు కర్ణాటక…
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ అప్రతిహాత విజయాలతో దూసుకొని వెళుతున్న నేపథ్యంలో ఈ సారి ఆయన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా…
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. తన…