రాష్ట్ర బీజేపీలో చుక్కానిగా కనిపిస్తున్న పార్టీ నేతలకు అంతో ఇంతో.. భరోసాగా ఉన్న మాజీ మంత్రి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు.. కన్నా లక్ష్మీనారాయణ అభాసుపాలయ్యారు. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్కు ఎలాంటి ఢోకాలేకుండా ముందుకు సాగారు. రాజకీయంగానే ఆయనపై విమర్వలు ఉన్నాయి.. తప్ప.. వ్యక్తిగతంగా ఇప్పటి వరకు ఆయనను ఎవరూ వేలెత్తి చూపించే పరిస్థితి లేదు. అంతేకాదు.. ప్రతిపక్ష పార్టీగా.. ఆ పార్టీ నేతగా.. తరచుగా ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.
దీంతో రాబోయే రోజుల్లో ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుందని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి ఆయన నెంబర్ 2 నాయకుడిగా పార్టీలోనూ ఆయన స్థానం సంపాయిస్తారని భావించారు. అయితే.. ఇది ఎలా ఉన్నప్పటికీ. ఇప్పుడు కన్నా.. తీవ్ర ఇక్కట్లలో మునిగిపోయారు. కుటుంబ సంబంధమైన చిక్కులు ఆయనను చుట్టుముట్టాయి. తన ఇంటి కోడలి విషయంలో గృహ హింస చట్టం కింద ఆయన కుటుంబాన్ని కోర్టు దోషిగా తేల్చింది. కోటి రూపాయల జరిమానా విధించింది. అంతేకాదు.. కోడలికి రూ.50 వేల చొప్పున నెల నెలా.. ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
గతంలో యూపీలోనూ ఇలాంటి కేసు వెలుగు చూసింది. అక్కడ ఎమ్మెల్యే కుటుంబంలో కోడలికి గృహ హింస చట్టం కింద ఇబ్బంది పెడుతున్నారంటూ.. ఎమ్మెల్యే కుటుంబానికి రూ.50 లక్షల ఫైన్ విదించిన కోర్టు కోడలికి రూ.25 వేల చొప్పున.. రుసుము ఇవ్వాలని.. ఆదేశించింది. ఈ పరిణామం.. అక్కడి బీజేపీని ఇరకాటంలో పడేసింది. సొంత ఇంట్లో మహిళలను ఆదరించడం చేతకాని వాళ్లు.. ప్రజలను ఏం ఆదరిస్తారంటూ.. ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. దీంతో సదరు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తర్వాత.. కొన్నాళ్లకు ఆయనను పార్టీలోకి తీసుకున్నారు.
అయితే.. సదరు ఎమ్మెల్యేకు వాయిస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంత పరిణామం జరగపోయినా.. కన్నా… మీడియా ముందుకు వచ్చి.. మహిళల గురించి మాట్లాడే అవకాశం కోల్పోయారని అంటున్నారు పరిశీలకులు. ఆయన ఏం మాట్లాడినా.. ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు రావడం ఖాయమని చెబుతున్నారు. అంటే.. ఒక రకంగా. ఫైర్ బ్రాండ్ గా ఉన్న కన్నా.. వాయిస్ కట్ అయిపోయిందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on January 20, 2022 12:20 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…