రాజకీయాల్లో ఉన్న నాయకులకు హంగు ఆర్భాటమేకాదు.. కేవలం పదవులు.. అనుభవించడాలే కాదు. ఫ్యూచర్ గురించి కూడా జాగ్రత్త పడిపోతున్నారు. అంటే దీపం ఉండగానే చక్కబెట్టుకోవడం అన్న మాట. ఇప్పుడు ఇలాంటి మాటే అనంతపురం జిల్లాకు చెందిన ఒక కీలక నియోజకవర్గం ఎమ్మెల్యే చుట్టూ వినిపిస్తోంది. ఆయన దాదాపు 500 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో భూములు కొన్నారంటూ.. కొన్ని రోజుల కిందట.. టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు ఒకరు ఆరోపించారు.
అప్పట్లో ఈ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నా.. తర్వాత.. దీనిపై మరోసారి ఆధారాలతో సహా నిరూపించారు. ఇదిలావుంటే.. అటు తెలంగాణలోనూ.. వైసీపీకి చెందిన ఒక కీలక నాయకుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. భారీ ఎత్తున స్థలాలు కొన్నారనే ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఈ చర్చ మరింత ఊపందుకుంది. ఇది ఆ నోటా.. ఈ నోటా.. తాడేపల్లిలోని కీలక సలహాదారు చెవిలో పడింది.
దీంతో ఆయన డేగకన్ను సారించారు. సదరు నేత ఆర్థిక పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ఎలా అక్కడ భూములు కొన్నారు? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై దృష్టి పెట్టారు. నిజానికి వైసీపీలో ఏ నేత అయినా.. రూ.100 కోట్ల రూపాయలకు పైబడి చేస్తే.. ఏ పనినైనా..అధిష్టానం దృష్టికి తీసుకువస్తున్నారు. ఎందుకంటే.. తర్వాత ఏదైనా సమస్య వస్తే.. తాము ఇబ్బంది పడకుండా.. ప్రభుత్వం ఆదుకుంటుందనే ఉద్దేశంతో వారు అలా చేస్తున్నారు.
అయితే.. ఈ నేత మాత్రం ఎవరికీ ఏమీ చెప్పకుండానే హైదరాబాద్లో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో రూ.500 కోట్లు పెట్టి బూములు కొనడం.. సంచలనంగా మారింది. ఈయన వెనుక ఎవరైనా ఉన్నారా? లేక.. ఆయనే కొన్నారా? ఒకవేళ కొంటే.. అంత సొమ్ములు ఎక్కడ నుంచి వచ్చాయి.. ఎవరు ఇచ్చారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిందని.. వైసీపీలో చర్చ సాగుతోంది. ఈ విషయంలో ఏదైనా తేడా వస్తే.. ఇబ్బందులు తప్పవని కూడా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 20, 2022 12:17 pm
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…
టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…