నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతి పండగను తన అక్క దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లోనే చేసుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన కారంచేడులోని ఆమె నివాసంలోనే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. అయితే ఈ సమయంలో మరో విషయంపై బాలకృష్ణ, పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య ప్రధానంగా చర్చ జరిగిందనే టాక్ నడుస్తోంది. వెంకటేశ్వరరావు తనయుడు, బాలకృష్ణ మేనళ్లుడు హితేశ్ రాజకీయ రంగప్రవేశం గురించి వీళ్లు ముఖ్యంగా మాట్లాడుకున్నట్లు సమాచారం. హితేశ్ను టీడీపీ నుంచి పోటీ చేయించేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
1980వ దశకంలో ఏపీ రాజకీయాలను దగ్గుబాటి వెంకటేశ్వరరావు శాసించారు. తన మామ స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన తెలుగు దేశం పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు కంటే ముందే పార్టీలో చేరి టీడీపీ యువజన విభాగంలో పని చేశారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా గెలిచి దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో తిరుగులేకుండా సాగారు. అయితే చంద్రబాబు చేసిన వంచనతో వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారనే అభిప్రాయాలున్నాయి. తన భార్య పురందేశ్వరీని కూడా ఆయన కాంగ్రెస్లో చేర్చారు. అప్పుడామె కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం ఉందనే సంగతి గురించి తెలిసిందే. కానీ ఇప్పుడా దూరం మాయమయేలా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల నందమూరి కుటుంబంలో ఓ వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి ఒకరినొకరు పలకరించుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత వాళ్లిద్దరు కలిసి ఫోటో కూడా దిగారు. దీంతో తన తనయుడు హితేశ్ కోసం తిరిగి టీడీపీలో చేరేందుకు దగ్గుబాటి ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు.
అప్పుడే తన కొడుకుని పోటీ చేయించాలని అనుకున్నా.. అమెరికా పౌరసత్వం కారణంగా వీలు కాలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం హితేశ్ను ఎన్నికల్లో దించి ఎమ్మెల్యేను చేయాలనే పట్టుదలతో వెంకటేశ్వరరావు ఉన్నట్లు సమాచారం. అవసరమైతే టీడీపీ నుంచి తనయుడిని బరిలోకి దింపాలని చూస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా తన ఇంటికి వచ్చిన బాలకృష్ణతో వెంకటేశ్వరరావు హితేశ్ భవితవ్యం గురించి చర్చించారని టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు కూడా హితేశ్ ఎంట్రీని కాదనే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…