నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతి పండగను తన అక్క దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లోనే చేసుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన కారంచేడులోని ఆమె నివాసంలోనే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. అయితే ఈ సమయంలో మరో విషయంపై బాలకృష్ణ, పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య ప్రధానంగా చర్చ జరిగిందనే టాక్ నడుస్తోంది. వెంకటేశ్వరరావు తనయుడు, బాలకృష్ణ మేనళ్లుడు హితేశ్ రాజకీయ రంగప్రవేశం గురించి వీళ్లు ముఖ్యంగా మాట్లాడుకున్నట్లు సమాచారం. హితేశ్ను టీడీపీ నుంచి పోటీ చేయించేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
1980వ దశకంలో ఏపీ రాజకీయాలను దగ్గుబాటి వెంకటేశ్వరరావు శాసించారు. తన మామ స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన తెలుగు దేశం పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు కంటే ముందే పార్టీలో చేరి టీడీపీ యువజన విభాగంలో పని చేశారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా గెలిచి దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో తిరుగులేకుండా సాగారు. అయితే చంద్రబాబు చేసిన వంచనతో వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారనే అభిప్రాయాలున్నాయి. తన భార్య పురందేశ్వరీని కూడా ఆయన కాంగ్రెస్లో చేర్చారు. అప్పుడామె కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం ఉందనే సంగతి గురించి తెలిసిందే. కానీ ఇప్పుడా దూరం మాయమయేలా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల నందమూరి కుటుంబంలో ఓ వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి ఒకరినొకరు పలకరించుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత వాళ్లిద్దరు కలిసి ఫోటో కూడా దిగారు. దీంతో తన తనయుడు హితేశ్ కోసం తిరిగి టీడీపీలో చేరేందుకు దగ్గుబాటి ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు.
అప్పుడే తన కొడుకుని పోటీ చేయించాలని అనుకున్నా.. అమెరికా పౌరసత్వం కారణంగా వీలు కాలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం హితేశ్ను ఎన్నికల్లో దించి ఎమ్మెల్యేను చేయాలనే పట్టుదలతో వెంకటేశ్వరరావు ఉన్నట్లు సమాచారం. అవసరమైతే టీడీపీ నుంచి తనయుడిని బరిలోకి దింపాలని చూస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా తన ఇంటికి వచ్చిన బాలకృష్ణతో వెంకటేశ్వరరావు హితేశ్ భవితవ్యం గురించి చర్చించారని టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు కూడా హితేశ్ ఎంట్రీని కాదనే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 19, 2022 6:17 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…