Political News

ఎంపీ అభ్య‌ర్థి కోసం వైసీపీ వేట‌

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి కొత్త‌గా ఎంపీ అభ్య‌ర్థి ఒక‌రు అవ‌స‌రం అయ్యేలా ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు ఉన్న ఎంపీల‌ను తీసుకుంటే.. పార్ల‌మెంటు స‌భ్యులుగా 22 మంది ఉన్నా రు. వీరిలో మెజారిటీ అంతా కూడా .. యువ‌కులే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే ఒక‌రిద్ద‌రు మాత్రం వ‌యోభా రంతో ఇబ్బంది ప‌డుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది వారిలోనూ ముఖ్యంగా చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌.. మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని చెబుతున్నారు. దీంతో ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త అభ్య‌ర్థిని వెతుక్కోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని అంటున్నారు.

విష‌యంలోకివెళ్తే.. రాష్ట్రంలోకెల్లా.. చిత్తూరు జిల్లాకు జ‌గ‌న్ స‌ర్కారు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా కావ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి కుప్పం నియోజ‌కవ ర్గంలో టీడీపీ అధినేత ను ఓడించాల‌ని వైసీపీ అధిష్టానం.. కంక‌ణం క‌ట్టుకోవ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డ ఎలాంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. ముందు.. కుప్పం నుంచే ప్రారంభిస్తున్నారు.

అయితే.. ఈ నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు ఎంపీ సీటు ప‌రిధిలోకి వ‌స్తుంది. ఇక్క‌డ ఎంపీగా ఉన్న రెడ్డ‌ప్ప‌.. ఇక్క‌డ యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఎక్కువ సేపు ఆయ‌న ఇంటికే ప‌రిమితం అవుతున్నార‌ని అంటున్నారు. దీంతో కుప్పం స‌హా చిత్తూరు జిల్లాలో ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. ఎంపీ రెడ్డ‌ప్ప డుమ్మా కొడుతున్నారు. ఈ ప‌రిణామాల‌పై ఇప్ప‌టికే జ‌గ‌న్ కొన్ని సూచ‌న‌లు చేశార‌ని.. ఇలా అయితే.. ఎలా? అని కూడా ఆయ‌న‌ను ప్ర‌శ్నించార‌ని.. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటూ.. క‌రోనాకు భ‌య‌ప‌డుతున్నారని.. దీంతో ప‌నులు ముందుకు సాగ‌డం లేద‌ని జ‌గ‌న్‌కు స‌మాచారం అందింది.

ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెడ్డ‌ప్ప‌ను పార్టీకి ప‌రిమితం చేసి..ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కుడికి అవ‌కాశం ఇస్తార‌నేచ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం చిత్తూరు పార్ల‌మెంటు మాత్రమే కాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 10 మంది వైసీపీ సిట్టింగ్ ఎంపీల‌కు టిక్కెట్లు ద‌క్కే ప‌రిస్థితులు అయితే లేవు.

This post was last modified on January 17, 2022 4:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

41 minutes ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

1 hour ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

1 hour ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

3 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

9 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

9 hours ago