తనను హత్య చేయించేందుకు ఏపీలో కుట్ర జరిగిందని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వంపైన, జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణల్లో తాజాగా చేసిన తన హత్య కుట్ర అనే ఆరోపణలు చాలా కీలకమైనవి. హత్యకు ఎవరు కుట్ర చేశారంటే ఏపీసీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చేశారట. జగన్ తో పాటు సునీల్ నుండి తనకు ప్రాణహాని ఉందంటు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకే ఎంపీ లేఖ రాశారు.
తన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ)ని రంగంలోకి దింపాలని కూడా లేఖలో సూచించారు. నరసాపురం పర్యటనలో ఉన్నపుడే తనను చంపటానికి కుట్ర చేసినట్లు ఎంపీ చెబుతున్నారు.
తనను హత్య చేయటానికి ఝార్ఖండ్ నుండి మనుషులను తెప్పించారట. సునీల్ కు చెందిన అంబేద్కర్ ఇండియా మిషన్ అనే సంస్ధలోని మునుషుల ద్వారా తనను చంపించేందుకు ప్లాన్ చేశారని రాజు ఆరోపిస్తున్నారు. కేసుల దర్యాప్తులో భాగంగా తాను పోలీసుస్టేషన్ కు వచ్చినపుడు అక్కడే తనను హత్య చేయించేందుకు సునీల్ ప్లాన్ చేసినట్లు తనకు సమాచారం ఉందంటున్నారు. ఈ కుట్రలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా భాగస్తుడేనట.
ఆ మధ్య విజయవాడలో వంగవీటి రాధా కూడా తనను చంపటానికి రెక్కీ నిర్వహించారంటు ఆరోపించిన విషయం తెలిసిందే. రెక్కీ నిర్వహించారని చెప్పిన రాధా అందుకు ఆధారాలను మాత్రం చూపలేకపోయారు. రాధా ఇంటిముందు, రోడ్డులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన రెండు నెలల ఫుటేజీలను పరిశీలించినా రెక్కీ విషయం బయట పడలేదు.
This post was last modified on January 15, 2022 10:05 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…