Political News

రైతులకు పెన్షన్ పథకమా ?

తెలంగాణ రైతులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆలోచన గనుక ఆచరణలోకి వస్తే రైతులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రంగా దేశం మొత్తం మీద తెలంగాణాకి క్రెడిట్ దక్కుతుందేమో. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 47 ఏళ్లు నిండిన ప్రతి చిన్న, సన్నకారు రైతలుకు 2 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కేసీయార్ ఆలోచిస్తున్నారు.

కేసీఆర్ ఆలోచన ప్రకారం ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు పెన్షన్ పథకంపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కారణంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. అయితే ఈ పథకంలో అనర్హులకు కూడా బాగానే లబ్ది జరుగుతోంది. రైతులకు పెట్టుబడులు అందించే పేరుతో ఏడాదికి రెండుసార్లు ఆర్థిక సాయం అందుతోంది.

ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి పంటల కాలంలో రైతుబంధును ప్రభుత్వం అందిస్తోంది. రైతుబంధు పథకం ద్వారా గడచిన నాలుగేళ్ళల్లో 64 లక్షల మందికి రు. 50 వేల కోట్లు అందించారు. రైతులు చనిపోతే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో ఏడాదికి రు. 3205 కోట్ల ప్రీమియం చెల్లిస్తోంది ప్రభుత్వం.

గడచిన ఏడేళ్ళల్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సుమారు రు. 2.71 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రులు చెబుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకునేందుకు రెండుసార్లు వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. ఈ పథకంలో కూడా లక్షలాది మంది రైతులకు లబ్ధి కలిగింది. అలాగే సాగు, తాగునీటి కోసం ప్రాజెక్టులను కూడా నిర్మిస్తోంది. ఇందులో కొన్ని సక్రమం ఉంటే మరికొన్ని అక్రమ నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే అవుతుందనటంలో సందేహం లేదు. కాబట్టి రైతులకు పెన్షన్ పథకాన్నేదో తొందరగా తీసుకొస్తే బాగుంటుంది. లేకపోతే ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకునే పథకాన్ని డిజైన్ చేస్తున్నారేమో చూడాలి.

This post was last modified on January 13, 2022 12:11 pm

Share

Recent Posts

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

54 minutes ago

టాలీవుడ్ ఆగస్ట్ కిరీటం – ఎవరికో అవకాశం!

కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…

4 hours ago

మా పిల్లలను శిక్షించలేను… క్షమిస్తున్నాను

జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…

6 hours ago

పవన్… కళాకారులకో వరం

నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…

8 hours ago

మహేష్ వెనుకడుగుకు కారణం ఏంటో

గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…

9 hours ago

ట్విట్టర్ టాక్స్… ప్రీమియర్ మాటలు… నిజాలు కావా

గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది  తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…

15 hours ago