Political News

రైతులకు పెన్షన్ పథకమా ?

తెలంగాణ రైతులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆలోచన గనుక ఆచరణలోకి వస్తే రైతులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రంగా దేశం మొత్తం మీద తెలంగాణాకి క్రెడిట్ దక్కుతుందేమో. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 47 ఏళ్లు నిండిన ప్రతి చిన్న, సన్నకారు రైతలుకు 2 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కేసీయార్ ఆలోచిస్తున్నారు.

కేసీఆర్ ఆలోచన ప్రకారం ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు పెన్షన్ పథకంపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కారణంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. అయితే ఈ పథకంలో అనర్హులకు కూడా బాగానే లబ్ది జరుగుతోంది. రైతులకు పెట్టుబడులు అందించే పేరుతో ఏడాదికి రెండుసార్లు ఆర్థిక సాయం అందుతోంది.

ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి పంటల కాలంలో రైతుబంధును ప్రభుత్వం అందిస్తోంది. రైతుబంధు పథకం ద్వారా గడచిన నాలుగేళ్ళల్లో 64 లక్షల మందికి రు. 50 వేల కోట్లు అందించారు. రైతులు చనిపోతే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో ఏడాదికి రు. 3205 కోట్ల ప్రీమియం చెల్లిస్తోంది ప్రభుత్వం.

గడచిన ఏడేళ్ళల్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సుమారు రు. 2.71 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రులు చెబుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకునేందుకు రెండుసార్లు వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. ఈ పథకంలో కూడా లక్షలాది మంది రైతులకు లబ్ధి కలిగింది. అలాగే సాగు, తాగునీటి కోసం ప్రాజెక్టులను కూడా నిర్మిస్తోంది. ఇందులో కొన్ని సక్రమం ఉంటే మరికొన్ని అక్రమ నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే అవుతుందనటంలో సందేహం లేదు. కాబట్టి రైతులకు పెన్షన్ పథకాన్నేదో తొందరగా తీసుకొస్తే బాగుంటుంది. లేకపోతే ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకునే పథకాన్ని డిజైన్ చేస్తున్నారేమో చూడాలి.

This post was last modified on January 13, 2022 12:11 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

6 hours ago

మెగా ఎఫెక్ట్‌.. క‌దిలిన ఇండ‌స్ట్రీ..!

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక స‌మ‌రం.. ఓ రేంజ్‌లో హీటు పుట్టిస్తోంది. ప్ర‌ధాన ప‌క్షాలైన‌.. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌లు దూకుడుగా ముందుకు…

7 hours ago

చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు: రేవంత్

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు. బుద్ధి…

7 hours ago

పవన్‌కు బంపర్ మెజారిటీ?

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…

8 hours ago

‘పుష్ప’తో నాకొచ్చిందేమీ లేదు-ఫాహద్

మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్…

8 hours ago

సీనియర్ దర్శకుడిని ఇలా అవమానిస్తారా

సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి…

10 hours ago