తెలంగాణ రైతులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆలోచన గనుక ఆచరణలోకి వస్తే రైతులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రంగా దేశం మొత్తం మీద తెలంగాణాకి క్రెడిట్ దక్కుతుందేమో. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 47 ఏళ్లు నిండిన ప్రతి చిన్న, సన్నకారు రైతలుకు 2 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కేసీయార్ ఆలోచిస్తున్నారు.
కేసీఆర్ ఆలోచన ప్రకారం ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు పెన్షన్ పథకంపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కారణంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. అయితే ఈ పథకంలో అనర్హులకు కూడా బాగానే లబ్ది జరుగుతోంది. రైతులకు పెట్టుబడులు అందించే పేరుతో ఏడాదికి రెండుసార్లు ఆర్థిక సాయం అందుతోంది.
ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి పంటల కాలంలో రైతుబంధును ప్రభుత్వం అందిస్తోంది. రైతుబంధు పథకం ద్వారా గడచిన నాలుగేళ్ళల్లో 64 లక్షల మందికి రు. 50 వేల కోట్లు అందించారు. రైతులు చనిపోతే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో ఏడాదికి రు. 3205 కోట్ల ప్రీమియం చెల్లిస్తోంది ప్రభుత్వం.
గడచిన ఏడేళ్ళల్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సుమారు రు. 2.71 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రులు చెబుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకునేందుకు రెండుసార్లు వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. ఈ పథకంలో కూడా లక్షలాది మంది రైతులకు లబ్ధి కలిగింది. అలాగే సాగు, తాగునీటి కోసం ప్రాజెక్టులను కూడా నిర్మిస్తోంది. ఇందులో కొన్ని సక్రమం ఉంటే మరికొన్ని అక్రమ నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే అవుతుందనటంలో సందేహం లేదు. కాబట్టి రైతులకు పెన్షన్ పథకాన్నేదో తొందరగా తీసుకొస్తే బాగుంటుంది. లేకపోతే ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకునే పథకాన్ని డిజైన్ చేస్తున్నారేమో చూడాలి.
This post was last modified on January 13, 2022 12:11 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…