Political News

ఇదేం న్యాయం జ‌గ‌న‌న్నా?

సంక్రాంతి ముంగిట‌.. ఏపీ ప్ర‌బుత్వం తీసుకున్న నిర్ణ‌యం.. సానుభూతి ప‌రుల‌ను కూడా విస్మ‌యానికి గురి చేస్తోంది. సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌లోపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో సినిమా టికెట్ల వివాదం కొన‌సాగుతూనేఉంది.  సినిమా నిర్మాణాల‌కు సంబంధం లేకుండా.. అన్ని సినిమాల‌కు ఒకే టికెట్ ధ‌ర ఉండాల‌నే నిర్ణ‌యానికి తోడు.. సినిమా టికెట్ల‌ను 1970ల స్థాయికి దింపేశారంటూ.. నెటిజ‌న్లు ఫైర‌వుతున్నారు. దీనివ‌ల్ల క్వాలిటీ దెబ్బ‌తింటుందని కూడా అంటున్నారు. ఈ విష‌యంపై అటు సినిమా  వ‌ర్గాల‌కు ప్ర‌బుత్వానికి మ‌ధ్య వివాదం కొన‌సాగుతూనే ఉంది.

ఇదిలావుంటే.. ఇప్పుడు పండ‌గ పూట‌.. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న మ‌రో నిర్ణ‌యం మ‌రింత విస్మ‌యానికి గురిచేస్తోంది. ప్ర‌ధానంగా క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ విష‌యంలో.. క‌ట్ట‌డి పేరుతో తీసుకున్న నిర్ణ‌యాలు.. ఒక్కొక్క‌రికి ఒక్కోలా వ‌ర్తింప‌చేయ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇదేంది జ‌గ‌న‌న్నా..! అంటూ.. ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఒమిక్రాన్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూను అమ‌లుచేస్తోంది. అదేస‌మ‌యంలో సినిమా హాళ్ల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సినిమా హాళ్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు(అంటే ఇటీవ‌ల క‌రోనా త‌గ్గిన నేప‌థ్యంలో)  ఫుల్ ఆక్యుపెన్సీ కి అనుమ‌తి ఇచ్చారు.

అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆక్యుపెన్సీపై కొర‌డా ఝ‌ళిపించింది ప్ర‌భుత్వం. కేవ‌లం 50 శాతం మంది ప్రేక్ష‌కుల‌తోనే సినిమాలు న‌డుపుకోవాల‌ని తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అదేస‌మ‌యంలో ఇప్ప‌టికే టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించిన విష‌యం తెలిసిందే. అంటు.. ఇటు సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం ఒక దెబ్బ అయితే.. ఇప్పుడు ఆక్యుపెన్సీని స‌గానికి కోసేయ‌డం.. మ‌రో భారీ దెబ్బ‌గా.. సినీ అభిమానులు పేర్కొంటున్నారు. స‌రే! ఇదే ఒమిక్రాన్ ఆంక్ష‌లు అన్ని విభాగాల‌కూ ఒకే విధంగా ఉన్నాయా? అంటే.. అది లేదు. పండ‌గ పూట ప్ర‌భుత్వ రంగంలోని ఆర్టీసీ ఖ‌జానాను నింపుకునేందుకు జ‌గ‌న్ స‌ర్కారు 2000 కొత్త స‌ర్వీసుల‌ను ప్ర‌వేశ పెట్టింది.

ఈ కొత్త స‌ర్వీసుల‌కు ఫుల్లుగా న‌డుపుకునేందుకు అంటే ఎన్ని సీట్లు ఉంటే.. అంద‌రు ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. అంతేకాదు.. టికెట్ ధ‌ర‌ల‌పై 50 శాతం అద‌న‌పు బాదుడుకూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. పండ‌గ పూట ప్ర‌యాణాలు ఎక్కువ‌గా ఉంటున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌(ప్ర‌భుత్వ దృష్టిలో పేద‌లు అనుకోవ‌చ్చు) జేబులు గుల్ల చేసేందుకు రెడీ అయింది. అంతేకాదు.. ఒమిక్రాన్ వ్యాప్తి విష‌యంలో సినిమా హాళ్ల‌పై విధించిన నిబంధ‌న‌లు.. ఆర్టీసికి మిన‌హాయింపు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అందుకే.. ఇదేంది జ‌గ‌న‌న్నా..? అని ప్ర‌శ్నిస్తున్నారు.  

Satya

Recent Posts

పట్టపగలే కారు చీకట్లోకి బికనీర్!

సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…

3 hours ago

వైసీపీ నేతలకు షాకిచ్చిన లేడీ ఆఫీసర్

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

రెండు బెనిఫిట్ షోలు సేఫా రిస్కా

పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…

4 hours ago

తేడా అంటూనే డబుల్ సెంచరీ కొట్టింది

దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…

5 hours ago

పవన్ అంతే… ఏదైనా పూర్తిగా తెలియాల్సిందే!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…

5 hours ago

దాసరి స్మృతి వనం… కదిలిపోయిన మనోజ్

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…

7 hours ago