Political News

ఏపీ స‌ర్కారుకు మ‌రో సెగ‌

ఏపీ స‌ర్కారుకు కొత్త సెగ తగిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు తాము ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చామం టూ.. ప‌దే ప‌దే చెప్పుకొంటున్న వైసీపీ స‌ర్కారుకు పెద్ద ఇబ్బందే వ‌చ్చింది. అదే స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌. గ‌త ఏడాదిన్న‌ర కింద‌ట‌.. ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన స‌ర్కారు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల పేరిట‌.. ఏర్పాటు చేసింది. దీనికి గాను ఉద్యోగుల‌ను కొత్త‌గా నియ‌మించారు. తాజాగా సీఎం జ‌గ‌న్ చేసిన పీఆర్సీ ప్రకటనతో స‌చివాల‌య ఉద్యోగులు.. నిర‌స‌న బాట‌ప‌ట్టారు.

 గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధులు బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు. అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి ఎగ్జిట్ కావడంతో ప్రభుత్వ యంత్రాంగంలో అయోమయం నెలకొంది. పే స్కేల్ ఇవ్వడక పోవడంతోపాటు.. త‌మ ప్రొబేష‌న్ పిరియ‌డ్‌ను ఈ ఏడాది జూన్ వ‌ర‌కు పెంచ‌డంపై సచివాలయ సిబ్బంది ఆందోళన బాట పట్డారు. అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగులు ఎగ్జిట్ కావడంతో గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పరిపాలన స్తంభించింది.

వాస్త‌వానికి స‌చివాల‌యాల్లో ప‌నిచేసే కార్య‌ద‌ర్శులు, సెక్ష‌న్ అధికారులు, మ‌హిళా అధికారులు ఇలా అంద‌రికీ గ‌త ఏడాది అక్టోబ‌రులోనే ప్రొబేష‌న్ ప్ర‌క‌టించాలి. అయితే.. ప్ర‌భుత్వం తాత్సారం చేయ‌డ‌మే కాకుండా.. ప్రొబేష‌న్ ప్ర‌క‌టించేందుకు హాజ‌రు స‌హా ప‌రీక్ష‌లు పెడ‌తామ‌ని.. ప్ర‌క‌టించింది. దీనిపై అప్ప‌ట్లో వీరి నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీంతో కొంత మేర‌కు వెన‌క్కి త‌గ్గిన ప్ర‌భుత్వం ఎలాంటి ష‌ర‌తులు లేకుండానే ప్రొబేష‌న్ ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది. అయితే.. స‌మ‌యం గ‌డిచి పోతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు.

దీనికితోడు.. ఈ ఏడాది జూన్ చివ‌రి వ‌ర‌కు ఆగాల‌ని స్వ‌యంగా జ‌గ‌నే చెప్ప‌డంతో ఉద్యోగులు ఉద్య‌మ బాట‌ప‌ట్టారు. అయితే..  వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి హెచ్చరిక మెసేజ్ చేశారు. నిరసన తెలిపే ఉద్యోగులు ముందుగా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చి అనుమతి తీసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకూడదన్నారు. అధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరిక జారీ చేశారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. 

This post was last modified on January 9, 2022 8:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

36 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago