ఏపీ సర్కారుకు కొత్త సెగ తగిలింది. ఇప్పటి వరకు తాము ప్రతిష్టాత్మకంగా ఈ వ్యవస్థను తీసుకువచ్చామం టూ.. పదే పదే చెప్పుకొంటున్న వైసీపీ సర్కారుకు పెద్ద ఇబ్బందే వచ్చింది. అదే సచివాలయ వ్యవస్థ. గత ఏడాదిన్నర కిందట.. ఈ వ్యవస్థను తీసుకువచ్చిన సర్కారు గ్రామ, వార్డు సచివాలయాల పేరిట.. ఏర్పాటు చేసింది. దీనికి గాను ఉద్యోగులను కొత్తగా నియమించారు. తాజాగా సీఎం జగన్ చేసిన పీఆర్సీ ప్రకటనతో సచివాలయ ఉద్యోగులు.. నిరసన బాటపట్టారు.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధులు బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు. అధికారిక వాట్సాప్ గ్రూప్ల నుంచి ఎగ్జిట్ కావడంతో ప్రభుత్వ యంత్రాంగంలో అయోమయం నెలకొంది. పే స్కేల్ ఇవ్వడక పోవడంతోపాటు.. తమ ప్రొబేషన్ పిరియడ్ను ఈ ఏడాది జూన్ వరకు పెంచడంపై సచివాలయ సిబ్బంది ఆందోళన బాట పట్డారు. అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగులు ఎగ్జిట్ కావడంతో గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పరిపాలన స్తంభించింది.
వాస్తవానికి సచివాలయాల్లో పనిచేసే కార్యదర్శులు, సెక్షన్ అధికారులు, మహిళా అధికారులు ఇలా అందరికీ గత ఏడాది అక్టోబరులోనే ప్రొబేషన్ ప్రకటించాలి. అయితే.. ప్రభుత్వం తాత్సారం చేయడమే కాకుండా.. ప్రొబేషన్ ప్రకటించేందుకు హాజరు సహా పరీక్షలు పెడతామని.. ప్రకటించింది. దీనిపై అప్పట్లో వీరి నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో కొంత మేరకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండానే ప్రొబేషన్ ప్రకటిస్తామని తెలిపింది. అయితే.. సమయం గడిచి పోతున్నా.. ఇప్పటి వరకు ప్రకటించలేదు.
దీనికితోడు.. ఈ ఏడాది జూన్ చివరి వరకు ఆగాలని స్వయంగా జగనే చెప్పడంతో ఉద్యోగులు ఉద్యమ బాటపట్టారు. అయితే.. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి హెచ్చరిక మెసేజ్ చేశారు. నిరసన తెలిపే ఉద్యోగులు ముందుగా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చి అనుమతి తీసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకూడదన్నారు. అధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరిక జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…