తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ వేగంగా దూసుకెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలుకు వెళ్లి వచ్చిన ఎపిసోడ్తో ఆ పార్టీ మరింత దూకుడుతో సాగాలని నిర్ణయించుకుంది. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు చెక్ పెట్టేది ఒక్క బీజేపీ మాత్రమేననే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ నేతలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్పై అసంతృప్తితో ఉన్న వర్గాలను తమవైపు తిప్పుకునే ప్లాన్ అమలు చేస్తున్నారని టాక్.
ఆ అసంతృప్తి..
వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతందనే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ వర్గాల ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఆ అసంతృప్తి దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బయట పడిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ను టార్గెట్ చేయడంలో స్పీడు పెంచిన బీజేపీ.. ఆ అసంతృప్తితో ఉన్న వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రజలు వ్యతిరేకిస్తున్న అంశాలపై పోరాటాలు ఉద్ధృతం చేసేందుకు కమళనాథులు రెడీ అవుతున్నారని సమాచారం.
ఉద్యోగుల పక్షాన..
ఇటీవల జోనల్ విధానం ఆధారంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల్లో చాలా వరకు అసంతృప్తి వ్యక్తమవుతోంది. అందుకే ఈ విషయంపై పోరాడాలని బీజేపీ నడుం బిగించింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులు కలిగించేలా ఉందని సంజయ్ పోరాటానికి దిగాడు. ఈ జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ తన ఎంపీ కార్యాలయంలో ఆయన జాగరణ దీక్షకు దిగడం.. కరోనా నేపథ్యంలో అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ పోరాటంతో ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో బీజేపీపై పాజిటివ్ వైఖరి ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే నిరుద్యోగుల పక్షాన సంజయ్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు వరి కొనుగోళ్ల విషయంపై రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఇలా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుందనే విషయం స్పష్టమవుతోందని నిపుణులు అంటున్నారు.
This post was last modified on January 7, 2022 2:36 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను కస్టడీలో హింసించారని.. దీంతో తనకు…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…