Political News

టీడీపీ ని ఫాలో అవుతున్న వైసీపీ?

ఏ విషయంలో ఎలాగున్నా ఒక్క విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీని వైసీపీ ఫాలో అవుతోంది. ఇంతకీ ఎందులో అంటే మీడియాను టార్గెట్ చేయటంలో. రెండు ప్రధాన పార్టీలు కలిసి మీడియాను టార్గెట్ చేస్తున్నాయి. ముందు ఈ పని తెలుగుదేశం పార్టీ చేస్తే దాన్ని వైసీపీ ఫాలో అవుతోంది. తాజాగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక, ఈనాడు టీవీ, టీవీ 5ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

వైసీపీ కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు పిలవద్దని, పై మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవద్దని మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలకు కొడాలి చెప్పారు. కొన్ని మీడియా సంస్ధలను బ్యాన్ చేసినంత మాత్రాన వాటికొచ్చే నష్టం ఏమీలేదనే చెప్పాలి. అలాగే వాటిని మీడియా సమావేశాలకు, ఇతర కార్యక్రమాలకు పిలిచినంత మాత్రాన వైసీపీకో లేకపోతే ప్రభుత్వానికో వస్తున్న లాభం కూడా ఏమీ లేదనే చెప్పాలి.

ఎందుకంటే పై మీడియా సంస్ధలు ప్రభుత్వం, వైసీపీ వ్యతిరేక లైన్ తీసుకుని అలాగే వ్యవహరిస్తున్నాయి. పాజిటివ్ వార్తలు కూడా కవర్ చేసినా అవకాశం ఉన్నపుడు ప్రభుత్వాన్ని నూరుశాతం నెగిటివ్ యాంగిల్లో మాత్రమే చూపుతున్నాయని వైసీపీ ఆరోపణ రోజూ చూస్తున్నాం. సరే ఏ యాంగిల్లో చూపాలనేది వాటి యాజమాన్యాలిష్టం. ఇదే సమయంలో ప్రభుత్వం+వైసీపీ కూడా పై సంస్ధలపై బ్యాన్ పెట్టే స్వేచ్చుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే  ఈ టార్గెట్ చేసే  ఈ ధోరణి మొదలైంది. అప్పట్లోనే తర్వాత టెర్ములో టీడీపీ సాక్షి మీడియాను బ్యాన్ చేసింది.

2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సాక్షిపై బ్యాన్ కంటిన్యు అయ్యింది. 2014 తర్వాత ప్రతిపక్షంలో ఉన్నపుడే  ఆంధ్రజ్యోతిని వైసీపీ బ్యాన్ చేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాపై బ్యాన్ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే తాజాగా అధికారికంగానే పై మీడియా సంస్ధలపై బ్యాన్ విధిస్తున్నట్లు మంత్రే ప్రకటించారు. నిజానికి ఈ ధోరణి ఇటు మీడియాకు అటు ప్రభుత్వానికి కూడా మంచిదికాదు.

అయితే మీడియా యాజమాన్యాలు తమ పరిధిని దాటిపోవటంతోనే ఈ సమస్య వచ్చిపడింది. వార్తలకు, వ్యాఖ్యలకు మీడియా యాజమాన్యాలు తేడా లేకుండా చేసేశాయి. అదే సమయంలో రాజకీయపార్టీలకు, మీడియా యాజమాన్యాలకు మధ్య ఉన్న గ్యాప్ కూడా చెరిగిపోయింది. దాంతో మీడియా సంస్ధలే రెచ్చిపోయి ప్రతిపక్ష పాత్రను పోషించటం మొదలుపెట్టాయి. దాంతో రెండింటి మద్య రెగ్యులర్ గా ఘర్షణ జరుగుతునే ఉంది. దాని ఫలితమే తాజా బ్యాన్.

This post was last modified on January 7, 2022 10:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

2 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

5 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

6 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

9 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

10 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

11 hours ago