Political News

టీడీపీ ని ఫాలో అవుతున్న వైసీపీ?

ఏ విషయంలో ఎలాగున్నా ఒక్క విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీని వైసీపీ ఫాలో అవుతోంది. ఇంతకీ ఎందులో అంటే మీడియాను టార్గెట్ చేయటంలో. రెండు ప్రధాన పార్టీలు కలిసి మీడియాను టార్గెట్ చేస్తున్నాయి. ముందు ఈ పని తెలుగుదేశం పార్టీ చేస్తే దాన్ని వైసీపీ ఫాలో అవుతోంది. తాజాగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక, ఈనాడు టీవీ, టీవీ 5ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

వైసీపీ కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు పిలవద్దని, పై మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవద్దని మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలకు కొడాలి చెప్పారు. కొన్ని మీడియా సంస్ధలను బ్యాన్ చేసినంత మాత్రాన వాటికొచ్చే నష్టం ఏమీలేదనే చెప్పాలి. అలాగే వాటిని మీడియా సమావేశాలకు, ఇతర కార్యక్రమాలకు పిలిచినంత మాత్రాన వైసీపీకో లేకపోతే ప్రభుత్వానికో వస్తున్న లాభం కూడా ఏమీ లేదనే చెప్పాలి.

ఎందుకంటే పై మీడియా సంస్ధలు ప్రభుత్వం, వైసీపీ వ్యతిరేక లైన్ తీసుకుని అలాగే వ్యవహరిస్తున్నాయి. పాజిటివ్ వార్తలు కూడా కవర్ చేసినా అవకాశం ఉన్నపుడు ప్రభుత్వాన్ని నూరుశాతం నెగిటివ్ యాంగిల్లో మాత్రమే చూపుతున్నాయని వైసీపీ ఆరోపణ రోజూ చూస్తున్నాం. సరే ఏ యాంగిల్లో చూపాలనేది వాటి యాజమాన్యాలిష్టం. ఇదే సమయంలో ప్రభుత్వం+వైసీపీ కూడా పై సంస్ధలపై బ్యాన్ పెట్టే స్వేచ్చుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే  ఈ టార్గెట్ చేసే  ఈ ధోరణి మొదలైంది. అప్పట్లోనే తర్వాత టెర్ములో టీడీపీ సాక్షి మీడియాను బ్యాన్ చేసింది.

2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సాక్షిపై బ్యాన్ కంటిన్యు అయ్యింది. 2014 తర్వాత ప్రతిపక్షంలో ఉన్నపుడే  ఆంధ్రజ్యోతిని వైసీపీ బ్యాన్ చేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాపై బ్యాన్ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే తాజాగా అధికారికంగానే పై మీడియా సంస్ధలపై బ్యాన్ విధిస్తున్నట్లు మంత్రే ప్రకటించారు. నిజానికి ఈ ధోరణి ఇటు మీడియాకు అటు ప్రభుత్వానికి కూడా మంచిదికాదు.

అయితే మీడియా యాజమాన్యాలు తమ పరిధిని దాటిపోవటంతోనే ఈ సమస్య వచ్చిపడింది. వార్తలకు, వ్యాఖ్యలకు మీడియా యాజమాన్యాలు తేడా లేకుండా చేసేశాయి. అదే సమయంలో రాజకీయపార్టీలకు, మీడియా యాజమాన్యాలకు మధ్య ఉన్న గ్యాప్ కూడా చెరిగిపోయింది. దాంతో మీడియా సంస్ధలే రెచ్చిపోయి ప్రతిపక్ష పాత్రను పోషించటం మొదలుపెట్టాయి. దాంతో రెండింటి మద్య రెగ్యులర్ గా ఘర్షణ జరుగుతునే ఉంది. దాని ఫలితమే తాజా బ్యాన్.

This post was last modified on January 7, 2022 10:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

25 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

1 hour ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago