ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన సమస్యల మీద జనాల దృష్టి నిలవకూడదని, వాళ్లను డైవర్ట్ చేయాలని చూస్తున్నారో ఏమో తెలియదు కానీ.. కొంత కాలంగా అక్కడ సినిమా టికెట్ల ధరల వ్యవహారమే ప్రధాన చర్చనీయాంశంగా ఉంటోంది. చిన్న స్థాయి నాయకుల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఈ అంశం గురించి తెగ స్పందించేస్తున్నారు. ఈ విషయం మీదే ప్రెస్ మీట్లు, టీవీ చర్చల్లో కూడా మంత్రులు పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిశ్రమ తరఫున ఈ అంశాన్ని నెత్తికెత్తుకున్నారు. టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని ఎండగడుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ట్వీట్లు వేస్తున్నారు.
అలాగే టీవీ చర్చలకు సైతం వెళ్తున్నారు. తాజాగా ఆయన ఈ అంశంలో వైసీపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధించారు. వాటికి సరైన సమాధానాలు చెప్పడం వైకాపా వాళ్లకు కష్టంగానే కనిపిస్తోంది.కానీ సినిమా టికెట్ల విషయంలో ముందు నుంచి చాలా చురుగ్గా ఉంటున్న మంత్రి పేర్ని నాని.. వర్మ ప్రశ్నల పరంపరలో అన్నింటికీ సమాధానం ఇవ్వకుండా ఒక వాదనతో ట్విట్టర్లోకి వచ్చారు.
100 రూపాయల ధర ఉన్న టికెట్ను రూ.1000, 2000కు అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనామిక్స్ చెప్పాయి? ఏ చట్టం చెప్పింది అని ఆయన ప్రశ్నించారు. దీనికి వర్మ డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని తీసుకొచ్చారు. అది టికెట్లు అమ్మేవాడికి, కొనేవాడికి మధ్య అంగీకారం మీద ఆధారపడి ఉంటుందని వాదించారు. ఐతే నిజానికి మంత్రి ఒక చిన్న లాజిక్ మరిచిపోయి మాట్లాడుతున్నారు. 100 రూపాయల టికెట్ను వెయ్యికో, రెండు వేలకో అమ్ముతున్నది బ్లాక్లో. అది కూడా బెనిఫిట్ షోలకు. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. థియేటర్ల మీద నిఘా ఉంచి అధిక ధరలకు టికెట్లు అమ్మకుండా చూడాల్సింది ప్రభుత్వమే. భారీ చిత్రాలు రిలీజైనపుడు పోలీసుల్ని పంపి బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారేమో చూడాలి. కౌంటర్లలోనే పెట్టి ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతుంటే కఠిన చర్యలు చేపట్టాలి.
జనాల్లో కూడా చైతన్యం పెంచాలి. ఎవరైనా బ్లాక్లో టికెట్లు అమ్ముతుంటే ఫిర్యాదు చేయాలని థియేటర్ల ముందు బోర్డులు పెట్టించాలి. అంతే తప్ప ఏదో పెద్ద సినిమాకు డిమాండ్ ఉన్నపుడు ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతున్నారని.. థియేటర్ ఉన్న ప్రాంతాన్ని బట్టి రూ.20, 30, 40, 50కి రేట్లు తగ్గించేయడం ఏం లాజిక్కో అర్థం కాదు. నిజానికి ఇలా తగ్గించాక బ్లాక్ టికెట్ల దందా ఇంకా పెరిగిందన్నది ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫిర్యాదు. థియేటర్ల వాళ్లే టికెట్లు బ్లాక్ చేసి.. వాటిని మళ్లీ అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం రేట్లు తగ్గించాక బ్లాక్ టికెట్ల సమస్య మరింత తీవ్రమైన మాట వాస్తవం. ఈ సంగతి గమనించకుండా మొండి వైఖరి, వాదనలతో కాలక్షేపం చేస్తూ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టడం ఎంత వరకు సబబు?
This post was last modified on January 5, 2022 6:15 pm
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…