ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన సమస్యల మీద జనాల దృష్టి నిలవకూడదని, వాళ్లను డైవర్ట్ చేయాలని చూస్తున్నారో ఏమో తెలియదు కానీ.. కొంత కాలంగా అక్కడ సినిమా టికెట్ల ధరల వ్యవహారమే ప్రధాన చర్చనీయాంశంగా ఉంటోంది. చిన్న స్థాయి నాయకుల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఈ అంశం గురించి తెగ స్పందించేస్తున్నారు. ఈ విషయం మీదే ప్రెస్ మీట్లు, టీవీ చర్చల్లో కూడా మంత్రులు పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిశ్రమ తరఫున ఈ అంశాన్ని నెత్తికెత్తుకున్నారు. టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని ఎండగడుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ట్వీట్లు వేస్తున్నారు.
అలాగే టీవీ చర్చలకు సైతం వెళ్తున్నారు. తాజాగా ఆయన ఈ అంశంలో వైసీపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధించారు. వాటికి సరైన సమాధానాలు చెప్పడం వైకాపా వాళ్లకు కష్టంగానే కనిపిస్తోంది.కానీ సినిమా టికెట్ల విషయంలో ముందు నుంచి చాలా చురుగ్గా ఉంటున్న మంత్రి పేర్ని నాని.. వర్మ ప్రశ్నల పరంపరలో అన్నింటికీ సమాధానం ఇవ్వకుండా ఒక వాదనతో ట్విట్టర్లోకి వచ్చారు.
100 రూపాయల ధర ఉన్న టికెట్ను రూ.1000, 2000కు అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనామిక్స్ చెప్పాయి? ఏ చట్టం చెప్పింది అని ఆయన ప్రశ్నించారు. దీనికి వర్మ డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని తీసుకొచ్చారు. అది టికెట్లు అమ్మేవాడికి, కొనేవాడికి మధ్య అంగీకారం మీద ఆధారపడి ఉంటుందని వాదించారు. ఐతే నిజానికి మంత్రి ఒక చిన్న లాజిక్ మరిచిపోయి మాట్లాడుతున్నారు. 100 రూపాయల టికెట్ను వెయ్యికో, రెండు వేలకో అమ్ముతున్నది బ్లాక్లో. అది కూడా బెనిఫిట్ షోలకు. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. థియేటర్ల మీద నిఘా ఉంచి అధిక ధరలకు టికెట్లు అమ్మకుండా చూడాల్సింది ప్రభుత్వమే. భారీ చిత్రాలు రిలీజైనపుడు పోలీసుల్ని పంపి బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారేమో చూడాలి. కౌంటర్లలోనే పెట్టి ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతుంటే కఠిన చర్యలు చేపట్టాలి.
జనాల్లో కూడా చైతన్యం పెంచాలి. ఎవరైనా బ్లాక్లో టికెట్లు అమ్ముతుంటే ఫిర్యాదు చేయాలని థియేటర్ల ముందు బోర్డులు పెట్టించాలి. అంతే తప్ప ఏదో పెద్ద సినిమాకు డిమాండ్ ఉన్నపుడు ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతున్నారని.. థియేటర్ ఉన్న ప్రాంతాన్ని బట్టి రూ.20, 30, 40, 50కి రేట్లు తగ్గించేయడం ఏం లాజిక్కో అర్థం కాదు. నిజానికి ఇలా తగ్గించాక బ్లాక్ టికెట్ల దందా ఇంకా పెరిగిందన్నది ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫిర్యాదు. థియేటర్ల వాళ్లే టికెట్లు బ్లాక్ చేసి.. వాటిని మళ్లీ అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం రేట్లు తగ్గించాక బ్లాక్ టికెట్ల సమస్య మరింత తీవ్రమైన మాట వాస్తవం. ఈ సంగతి గమనించకుండా మొండి వైఖరి, వాదనలతో కాలక్షేపం చేస్తూ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టడం ఎంత వరకు సబబు?
This post was last modified on January 5, 2022 6:15 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…