వంగవీటి రాధాను చంపేందుకు రెక్కీ నిర్వహించారనే విషయంలో ఆధారాలు లేవు.. ఇది తాజాగా పోలీసులు తేల్చిన విషయం. విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా మీడియాతో మాట్లాడుతూ తనను చంపటానికి రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యలు చేసిన రాధా అందుకు తగ్గ ఆధారాలను తమకు ఇవ్వలేదని చెప్పారు. వారం రోజుల క్రితం తనను అంతం చేయటానికి రెక్కీ నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాధా వ్యాఖ్యలతో విజయవాడలో బాగా రాజకీయ వేడి రాజుకుంది.
రెక్కీ జరిగిందా లేదా అన్నది పక్కన పెట్టేస్తే ఆ వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ప్రభుత్వంపై పదే పదే ఆరోపణలతో రెచ్చిపోయారు. దాంతో మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు ఎదురుదాడికి దిగారు. ఈ విషయాలు ఎలాగున్నా ప్రభుత్వం వెంటనే స్పందించి రాధాకు 2+2 భద్రతను ఏర్పాటు చేసింది. దాన్ని రాధా తిరస్కరించటం మరో వివాదానికి దారితీసింది. ఈ నేపధ్యంలోనే రాధాతో పోలీసు అధికారులు చాలాసార్లు సమావేశమయ్యారు.
రాధా ఇంటి ముందున్న రోడ్డులోని సీసీ ఫుటేజీని చాలాసార్లు పరిశీలించారు. దాదాపు రెండు నెలల సీసీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత రాధాపై రెక్కీ జరిగిందనేందుకు ఆధారాలు లేవని టాటా తేల్చేశారు. ఇదే విషయాన్ని రాధాతో కూడా మాట్లాడినట్లు టాటా చెప్పారు. ఎవరి దగ్గరైనా రెక్కీ జరిగినట్లు ఆధారాలుంటే తమకు అందివ్వాలని అప్పీలు చేయటమే విచిత్రం. పోలీసులకు దొరకని సీసీ ఫుటేజి మామూలు జనాలకు ఎలా దొరుకుతుంది.
నిజంగానే రెక్కీ జరిగుంటే అందుకు ఆధారాలను ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాధాపైనే ఉంటుంది. ఎందుకంటే అనుమానం వచ్చింది రాధాకు, రెక్కీ జరిగిందని తెలుసుకున్నది రాధాయే. కాబట్టి అందుకు ఆధారాలు కూడా రాధాకే తెలిసుండాలి. రాధా ఇంటి ముందున్న 2 నెలల సీసీ ఫుటేజీలో అనుమానాస్పదంగా ఏమీ కనబడలేదని పోలీసులే చెబుతున్నారు. మరి రెక్కీ ఎక్కడ జరిగింది ? ఆ విషయాన్ని రాధాయే చెప్పాలి. మొత్తానికి ఇప్పటికైతే రెక్కీ జరగలేదని పోలీసులు తేల్చేశారు. తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం.
This post was last modified on January 3, 2022 2:40 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…