వంగవీటి రాధాను చంపేందుకు రెక్కీ నిర్వహించారనే విషయంలో ఆధారాలు లేవు.. ఇది తాజాగా పోలీసులు తేల్చిన విషయం. విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా మీడియాతో మాట్లాడుతూ తనను చంపటానికి రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యలు చేసిన రాధా అందుకు తగ్గ ఆధారాలను తమకు ఇవ్వలేదని చెప్పారు. వారం రోజుల క్రితం తనను అంతం చేయటానికి రెక్కీ నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాధా వ్యాఖ్యలతో విజయవాడలో బాగా రాజకీయ వేడి రాజుకుంది.
రెక్కీ జరిగిందా లేదా అన్నది పక్కన పెట్టేస్తే ఆ వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ప్రభుత్వంపై పదే పదే ఆరోపణలతో రెచ్చిపోయారు. దాంతో మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు ఎదురుదాడికి దిగారు. ఈ విషయాలు ఎలాగున్నా ప్రభుత్వం వెంటనే స్పందించి రాధాకు 2+2 భద్రతను ఏర్పాటు చేసింది. దాన్ని రాధా తిరస్కరించటం మరో వివాదానికి దారితీసింది. ఈ నేపధ్యంలోనే రాధాతో పోలీసు అధికారులు చాలాసార్లు సమావేశమయ్యారు.
రాధా ఇంటి ముందున్న రోడ్డులోని సీసీ ఫుటేజీని చాలాసార్లు పరిశీలించారు. దాదాపు రెండు నెలల సీసీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత రాధాపై రెక్కీ జరిగిందనేందుకు ఆధారాలు లేవని టాటా తేల్చేశారు. ఇదే విషయాన్ని రాధాతో కూడా మాట్లాడినట్లు టాటా చెప్పారు. ఎవరి దగ్గరైనా రెక్కీ జరిగినట్లు ఆధారాలుంటే తమకు అందివ్వాలని అప్పీలు చేయటమే విచిత్రం. పోలీసులకు దొరకని సీసీ ఫుటేజి మామూలు జనాలకు ఎలా దొరుకుతుంది.
నిజంగానే రెక్కీ జరిగుంటే అందుకు ఆధారాలను ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాధాపైనే ఉంటుంది. ఎందుకంటే అనుమానం వచ్చింది రాధాకు, రెక్కీ జరిగిందని తెలుసుకున్నది రాధాయే. కాబట్టి అందుకు ఆధారాలు కూడా రాధాకే తెలిసుండాలి. రాధా ఇంటి ముందున్న 2 నెలల సీసీ ఫుటేజీలో అనుమానాస్పదంగా ఏమీ కనబడలేదని పోలీసులే చెబుతున్నారు. మరి రెక్కీ ఎక్కడ జరిగింది ? ఆ విషయాన్ని రాధాయే చెప్పాలి. మొత్తానికి ఇప్పటికైతే రెక్కీ జరగలేదని పోలీసులు తేల్చేశారు. తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం.
This post was last modified on January 3, 2022 2:40 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…