Political News

జగన్ – షర్మిల మధ్య వాదులాట?

మరే మీడియా సంస్థ ప్రస్తావించని అంశాల్ని తన కాలమ్ లో చెప్పే గుణం ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ వేమూరి రాధాక్రిష్ణకు అలవాటన్న సంగతి తెలిసిందే. ప్రతి వారాంతంలో తాను రాసే పొలిటికల్ కామెంటరీ ‘కొత్త పలుకు’లో ఆయన పలు సంచలన అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. గత వారం ఆయన తన కాలమ్ లో.. క్రిస్మస్ ముందు రోజు రాత్రి కడప జిల్లాలోని వైఎస్ కుటుంబానికి చెందిన ఇడుపులపాయ గెస్టు హౌస్ లో ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి.. ఆయన సోదరి షర్మిల మధ్య గొడవ జరిగినట్లుగా పేర్కొనటం తెలిసిందే. వారి మధ్య వాదులాట జరిగిందని.. ఆస్తికి సంబంధించిన అంశాల మీద ఒకరినొకరు మాటలు అనుకున్నట్లుగా పేర్కొని సంచలంగా మారారు.

అయితే.. ఈ అంశంపై అటు వైసీపీ వర్గీయులు కానీ.. ఇటు షర్మిల వర్గీయులు కానీ ఎవరూ ఏమీ మాట్లాడింది లేదు. ఖండించింది లేదు. ఇలాంటి వేళ.. తాజా కాలమ్ లో ఆర్కే మరిన్ని అంశాల్ని ప్రస్తావించారు. ఇడుపుల పాయ గెస్ట్ హౌస్ లో అన్నాచెల్లెళ్ల మధ్య జరిగిన మాటల్లో తనకు అందిన విశ్వసనీయ సమాచారాన్ని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన రాసుకున్న కాలమ్ లోని అంశాల్ని యథాతధంగా చూస్తే..

• ఆస్తుల వ్యవహారంతో పాటు రాజకీయపరమైన అంశాలపై సోదరుడు జగన్‌రెడ్డితో షర్మిల ఘర్షణ పడిన విషయం విదితమే. తెలంగాణలో తాను రాజకీయంగా బలపడకుండా సోదరుడు అడ్డుపడుతున్నారని షర్మిల ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. తాను ప్రారంభించిన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీలో ముఖ్యనాయకులు చేరకుండా ఆయన తన అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నారని షర్మిల ఆగ్రహంగా ఉన్నారు.

• పార్టీని ప్రారంభించక ముందే ఆమెతో చేతులు కలుపుతానని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఒక మాజీ ఎంపీ హామీ ఇచ్చారు. అయితే జగన్‌రెడ్డి ఆ మాజీ ఎంపీకి ఫోన్‌ చేసి షర్మిల పార్టీలో చేరవద్దని గట్టిగా చెప్పినట్టు తెలిసింది. దీంతో సదరు మాజీ ఎంపీ అప్పటి నుంచి షర్మిలకు మొహం చాటేస్తున్నారు. ఇలాగే మరికొందరి విషయంలో కూడా జరిగింది.


• దీంతో అప్పటికే ఆగ్రహంగా ఉన్న షర్మిల, పదిరోజుల క్రితం ఇడుపులపాయ అతిథి గృహంలో సోదరుడు జగన్‌రెడ్డితో గొడవపడ్డారు. ‘‘నాకు అన్యాయం చేస్తే ఆ దేవుడు నీకు కూడా నష్టం చేస్తాడు.. నీవు పోగేసుకున్న సంపద నీకు దక్కకుండా ఆ దేవుడే చూసుకుంటాడు’’ అని ఆ సందర్భంగా ఆమె సోదరుడికి శాపనార్థాలు పెట్టినట్టు తెలిసింది.


• ‘తెలంగాణలో నేను రాజకీయంగా బలపడకుండా అడ్డుకుంటావా? ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నిన్ను కూడా బలహీనపరుస్తాను’’ అని సోదరుడిని హెచ్చరించినట్టు సమాచారం. జగన్‌రెడ్డి గురించి తెలిసిన రాజశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులెవరూ అతడిని ఎదిరించి మాట్లాడరు. షర్మిల మాత్రం అందుకు విరుద్ధంగా సోదరుడి మొహం మీదే తన మనసులో ఉన్నదంతా వెళ్లగక్కారు.


• ఘర్షణ అనంతరం తల్లి విజయమ్మను వెంటబెట్టుకుని రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో తండ్రి రాజశేఖర్‌రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించిన షర్మిల, అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లిపోయారు

Satya

Recent Posts

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

3 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

1 hour ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

2 hours ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

3 hours ago