తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ అంటే.. సంక్రాంతినే. ఆ తర్వాత అంత సందడి ఉండేది దసరాకే. ఈ రెండు పండగలనూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కిల్ చేసి పడేసిందంటూ ఇప్పుడు సినీ ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పోయినేడాది దసరాకే ‘ఆర్ఆర్ఆర్’ రావాల్సింది. అక్టోబరు 13కు రిలీజ్ డేట్ ఇచ్చి అప్పటికి సినిమాను సిద్ధం చేయడానికి చూశారు. చాలా ముందుగానే డేట్ ఇవ్వడంతో వివిధ భాషల్లో పేరున్న సినిమాలన్నింటినీ దసరా నుంచి దూరం పెట్టారు.
కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టినా సరే.. దసరాకే తమ చిత్రం రాబోతోందని నొక్కి వక్కాణించింది చిత్ర బృందం. దీంతో దసరాకు అనుకున్న ఆచార్య, అఖండ లాంటి సినిమాలను వాయిదా వేసుకున్నారు. మరే పెద్ద సినిమా కూడా ఆ సీజన్లో రాలేదు. చివరికి చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ దసరా నుంచి వాయిదా పడింది. దీంతో మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి లాంటి మీడియం రేంజ్ సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
దసరా టైంలో పెద్ద సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఐతే దసరా పోయినా సంక్రాంతి ఉందిలే అనుకుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ పుణ్యమా అని అది కూడా కళ తప్పే పరిస్థితి వచ్చింది. సంక్రాంతికి ఎన్నడూ లేనంత డల్లుగా మారేలా కనిపిస్తోంది టాలీవుడ్ బాక్సాఫీస్. ‘బంగార్రాజు’ మినహా క్రేజీ సినిమా ఏదీ ఈ పండక్కి రావట్లేదు. రౌడీ బాయ్స్, హీరో, డీజే టిల్లు, 7 డేస్ 6 నైట్స్ లాంటి చిన్న సినిమాలను సంక్రాంతి రేసులోకి తీసుకొచ్చారు. పండక్కి ఇలాంటి చిన్న సినిమాలు చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరు.
వీటి రిలీజ్ డేట్లు వరుసబెట్టి ప్రకటిస్తుంటే నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ కళ తప్పుతోందని బాధ పడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ కోసమని భీమ్లా నాయక్, సర్కారు వారి పాట లాంటి క్రేజీ చిత్రాలను వాయిదా వేయించారని.. ఇప్పుడా సినిమా కూడా రేసు నుంచి తప్పుకోవడంతో పండుగ సందడి కనిపించేలా లేదని.. వరుసగా దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండుగల సీజన్లను ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బ కొట్టిందని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ తమ చేతుల్లో లేని దానికి ‘ఆర్ఆర్ఆర్’ టీం మాత్రం ఏం చేస్తుంది పాపం.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…