Political News

చంద్రబాబు ముందు జాగ్రత్త?

చూస్తుంటే వ్యవహారం అలాగే ఉంది. ఈ నెలలో మూడు రోజులు కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. 6,7,8 తేదీల్లో కుప్పంలోని నేతలు, కార్యకర్తలతో పాటు జనాలను కూడా కలవబోతున్నారు. కుప్పంలో ఒకరోజు మిగిలిన మండలాల్లో రెండు రోజులు పర్యటించేందుకు ప్లాన్ చేసుకున్నారట. గడచిన మూడు నెలల్లో నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించటం ఇది మూడోసారి.

అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ముందు జాగ్రత్తపడుతున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళలో చంద్రబాబు మహా అయితే ఓ నాలుగుసార్లు నియోజకవర్గంలో  పర్యటించుంటారు. చంద్రబాబు తరపున నియోజకవర్గంలో వ్యవహారాలను చక్కబెట్టేందుకు పీఏ మనోహర్+మరో నలుగురు నేతలున్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏపని అవసరమైనా వీళ్ళని కలవాల్సిందే.

ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా మనోహర్ అండ్ కో దయ మీద ఆధారపడాల్సిందే. ఒకవేళ ఎవరైనా హైదరాబాదో లేకపోతే అమరావతికో వచ్చినా చంద్రబాబును కలవటం అయ్యేపని కాదు. దాంతో  పీఏ అండ్ కో ఓవర్ యాక్షన్ పెరిగిపోయింది. దీని ఫలితమే 2019 ఎన్నికల్లో స్పష్టగా కనబడింది. మొదటిరెండు రౌండ్లు చంద్రబాబు 8 వేల ఓట్ల వెనకబడిపోవటం నేతల ఓవర్ యాక్షన్ ఫలితమే. చివరకు చంద్రబాబు గెలిచినా  పార్టీ  ఓడిపోయింది.

దాంతో చంద్రబాబు నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో కరోనా ఎఫెక్టు కూడా తోడవ్వటంతో బాగా గ్యాప్ వచ్చేసింది. దీని ఫలితం స్ధానిక సంస్ధల ఎన్నికలపైన బాగా పడింది. దాంతో చంద్రబాబు వెంటనే మేల్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలివాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. దాంతో పీఏ అండ్ కో మీద ఆధారపడితే లాభం లేదని అర్ధమైనట్లుంది. అందుకనే అప్పటి నుండి నెలకోసారి కుప్పంలో పర్యటిస్తున్నారు.

కుప్పంలోని పార్టీ క్యాడర్ తో బాగా గ్యాప్ వచ్చేసిన విషయాన్ని చంద్రబాబు బాగా ఆలస్యంగా తెలుసుకున్నారు. ఇలాగే కంటిన్యు అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం కష్టమని అర్ధమైనట్లుంది. అందుకనే అందరినీ అమరావతికి పిలిపించుకుని సమీక్షించారు. ఇపుడు మూడు రోజుల పర్యటన పెట్టుకున్నారు. ఇప్పటికైనా రెగ్యులర్ గా చంద్రబాబు పర్యటిస్తూ అందరితోను టచ్ లో ఉంటే  ఉపయోగం ఉంటుంది. లేకపోతే చంద్రబాబు పొలిటికల్ క్లైమ్యాక్స్ విషాదంగా ముగిసే ప్రమాదముంది.

This post was last modified on January 2, 2022 12:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 minute ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

38 minutes ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

2 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

3 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

4 hours ago