రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు వైఎస్ షర్మిల. అందరి అంచనాలకు భిన్నంగా తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆమె.. ఇటీవల కాలంలో తన సోదరుడు కమ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో విభేదాలు పొడ చూపాయని.. క్రిస్మస్ ముందు రోజు రాత్రి ఇడుపులపాయలోని గెస్టు హౌస్ లో తన సోదరుడు జగన్ తో షర్మిల గొడవ పడినట్లుగా వార్తలు రావడం తెలిసిందే.
ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే రాసే.. వీకెండ్ కామెంట్ లో.. ఆయనీ సంచలన అంశాల్ని ప్రస్తావించారు. సాధారణంగా ఇలాంటి రాజకీయ ఆరోపణలు.. సంచలనాలు చోటు చేసుకున్నంతనే.. అందుకు స్పందనగా ఎవరో ఒకరు స్పందించటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా.. గడిచిన వారం వ్యవధిలో సీఎం జగన్.. ఆయన సోదరి షర్మిల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగిందన్న విషయం అబద్ధమని.. అసత్యమని.. అలా జరగలేదంటూ చెప్పినోళ్లే లేరు. ఆ మాటకు వస్తే.. అసలు ఆ విషయం ఒకటి ఉందన్న మాటను ప్రస్తావించటానికి సైతం ఇష్టపడని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా రాసిన కాలమ్ లో మరికొన్ని ఆసక్తికరమైన అంశాల్ని పేర్కొన్నారు. కడప ఎంపీ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే దానిపై దివంగత వైఎస్ వివేకానంద.. తన సోదరుడి కుమార్తె షర్మిలతో పదే పదే ప్రస్తావించేవారా? అంటే అవునన్న మాటను చెబుతున్నారు.
కడప నుంచి అయితే నువ్వు కానీ.. లేదంటే నేను కానీ పోటీ చేయాలే తప్పించి.. ఇంకెవరో ఎందుకు పోటీ చేయాలి? అన్న మాటను షర్మిలతో వైఎస్ వివేకా తరచూ చెప్పే వారంంటూ ఆంధ్రజ్యోతి ఆర్కే తాజాగా తన కాలమ్ లో పేర్కొన్నారు. ఇదే అంశాన్ని షర్మిల.. సీబీఐ అధికారులతో చెబితే.. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో కాలమే సరైన చెప్పాలి.
This post was last modified on January 2, 2022 10:55 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…