Political News

రాష్ట్రం త‌గల‌బ‌డుతుందంటే సీఎం అయ్యా!

బాబ్రీ మ‌సీదు కూల్చివేత అనంత‌రం దేశ‌వ్యాప్తంగా అల్ల‌ర్లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు ముంబ‌యి కూడా అట్టుడికిపోయింది. అల్ల‌రి మూక‌ల దాడుల్లో తీవ్ర నష్టం జ‌రిగింది. అప్ప‌టి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్య‌క్షుడు శ‌ర‌ద్ ప‌వార్ బాధ్య‌త‌లు తీసుకున్నారు. కానీ అప్పుడు సీఎంగా అయిష్టంగానే కుర్చీ ఎక్కాన‌ని ఆయ‌న తాజాగా వెల్ల‌డించారు. 1993లో ఇష్టం లేకున్నా భావోద్వేగ‌పూరిత వాతావ‌ర‌ణంలో మ‌హారాష్ట్రకు సీఎం అయ్యాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అప్ప‌టి ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా శ‌ర‌ద్ ప‌వార్ ప‌ని చేశారు. కానీ బాబ్రీ మ‌సీదు కూల్చివేత అనంత‌రం ముంబ‌యిలో చెల‌రేగిన అల్ల‌ర్ల‌ను అణ‌చివేసి శాంతిని నెల‌కొల్ప‌డం కోసం రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా తాను బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క త‌ప్ప‌లేద‌ని ప‌వార్ అన్నారు. “1992 డిసెంబ‌ర్‌లో బాబ్రీ మ‌సీదు కూల్చివేత అనంత‌రం మొద‌లైన అల్ల‌ర్లు ముంబ‌యిని కుదిపేశాయి. రెండు వారాల‌కు పైగా జ‌న‌జీవ‌నం స్తంభించింది. అప్పుడు ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ఉన్న న‌న్ను మ‌హారాష్ట్ర వెళ్లి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌ని అప్ప‌టి ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు ఆదేశించారు. కానీ అందుకు నేను మొద‌ట తిర‌స్క‌రించా. ఆ త‌ర్వాత అల్లర్లు మ‌రిన్ని న‌గ‌రాల‌కు విస్త‌రించాయి.

అప్పుడు పీవీతో పాటు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఎన్‌కేపీ సాల్వే త‌దిత‌రులు, నేను స‌మావేశ‌మ‌య్యాం. ఆ త‌ర్వాత పీవీ న‌న్ను కార్యాల‌యానికి పిలిచి మ‌హారాష్ట్రకు సీఎంగా వెళ్ల‌డం త‌ప్ప మ‌రో దారి క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు. ఆరు గంట‌ల పాటు న‌న్ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించారు. నేను పుట్టి పెరిగిన రాష్ట్రం, న‌గ‌రం త‌గ‌ల‌బ‌డిపోతుంది. ఈ ప‌రిస్థితుల్లోనూ నువ్వు అక్క‌డికి వెళ్ల‌క‌పోతే అంత‌కంటే విచారం మ‌రొక‌టి ఉండ‌దు అని పీవీ చెప్పారు. భావోద్వేగానికి గురైన నేను రాష్ట్రానికి తిరిగి వ‌చ్చా” అని ప‌వార్ పేర్కొన్నారు.
రాష్ట్రం త‌గ‌ల‌బ‌డుతోంద‌ని చెప్పిన పీవీ.. ప‌వార్‌లో భావోద్వేగాల‌ను బ‌య‌ట‌కు తీశారు. దీంతో ఆయ‌న మ‌హారాష్ట్ర సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టి ప‌రిస్థితుల‌ను అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో శాంతిని తిరిగి పున‌రుద్ధ‌రించ‌డం సంతృప్తినిచ్చింద‌ని ఆయ‌న చెప్పారు. 

This post was last modified on December 30, 2021 4:35 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

22 minutes ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

2 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

2 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

4 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

7 hours ago