Political News

రాష్ట్రం త‌గల‌బ‌డుతుందంటే సీఎం అయ్యా!

బాబ్రీ మ‌సీదు కూల్చివేత అనంత‌రం దేశ‌వ్యాప్తంగా అల్ల‌ర్లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు ముంబ‌యి కూడా అట్టుడికిపోయింది. అల్ల‌రి మూక‌ల దాడుల్లో తీవ్ర నష్టం జ‌రిగింది. అప్ప‌టి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్య‌క్షుడు శ‌ర‌ద్ ప‌వార్ బాధ్య‌త‌లు తీసుకున్నారు. కానీ అప్పుడు సీఎంగా అయిష్టంగానే కుర్చీ ఎక్కాన‌ని ఆయ‌న తాజాగా వెల్ల‌డించారు. 1993లో ఇష్టం లేకున్నా భావోద్వేగ‌పూరిత వాతావ‌ర‌ణంలో మ‌హారాష్ట్రకు సీఎం అయ్యాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అప్ప‌టి ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా శ‌ర‌ద్ ప‌వార్ ప‌ని చేశారు. కానీ బాబ్రీ మ‌సీదు కూల్చివేత అనంత‌రం ముంబ‌యిలో చెల‌రేగిన అల్ల‌ర్ల‌ను అణ‌చివేసి శాంతిని నెల‌కొల్ప‌డం కోసం రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా తాను బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క త‌ప్ప‌లేద‌ని ప‌వార్ అన్నారు. “1992 డిసెంబ‌ర్‌లో బాబ్రీ మ‌సీదు కూల్చివేత అనంత‌రం మొద‌లైన అల్ల‌ర్లు ముంబ‌యిని కుదిపేశాయి. రెండు వారాల‌కు పైగా జ‌న‌జీవ‌నం స్తంభించింది. అప్పుడు ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ఉన్న న‌న్ను మ‌హారాష్ట్ర వెళ్లి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌ని అప్ప‌టి ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు ఆదేశించారు. కానీ అందుకు నేను మొద‌ట తిర‌స్క‌రించా. ఆ త‌ర్వాత అల్లర్లు మ‌రిన్ని న‌గ‌రాల‌కు విస్త‌రించాయి.

అప్పుడు పీవీతో పాటు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఎన్‌కేపీ సాల్వే త‌దిత‌రులు, నేను స‌మావేశ‌మ‌య్యాం. ఆ త‌ర్వాత పీవీ న‌న్ను కార్యాల‌యానికి పిలిచి మ‌హారాష్ట్రకు సీఎంగా వెళ్ల‌డం త‌ప్ప మ‌రో దారి క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు. ఆరు గంట‌ల పాటు న‌న్ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించారు. నేను పుట్టి పెరిగిన రాష్ట్రం, న‌గ‌రం త‌గ‌ల‌బ‌డిపోతుంది. ఈ ప‌రిస్థితుల్లోనూ నువ్వు అక్క‌డికి వెళ్ల‌క‌పోతే అంత‌కంటే విచారం మ‌రొక‌టి ఉండ‌దు అని పీవీ చెప్పారు. భావోద్వేగానికి గురైన నేను రాష్ట్రానికి తిరిగి వ‌చ్చా” అని ప‌వార్ పేర్కొన్నారు.
రాష్ట్రం త‌గ‌ల‌బ‌డుతోంద‌ని చెప్పిన పీవీ.. ప‌వార్‌లో భావోద్వేగాల‌ను బ‌య‌ట‌కు తీశారు. దీంతో ఆయ‌న మ‌హారాష్ట్ర సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టి ప‌రిస్థితుల‌ను అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో శాంతిని తిరిగి పున‌రుద్ధ‌రించ‌డం సంతృప్తినిచ్చింద‌ని ఆయ‌న చెప్పారు. 

This post was last modified on December 30, 2021 4:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

4 minutes ago

జగన్ మారిపోయినట్టేనా

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…

3 hours ago

ఆ మలయాళ హిట్.. మొత్తం హైదరాబాద్‌లో

కొవిడ్ వల్ల సినీ పరిశ్రమలు ఎలా కుదేలయ్యాయో తెలిసిందే. కానీ ఆ టైంలో మలయాళ ఇండస్ట్రీ సైతం ఇబ్బంది పడింది…

11 hours ago

జనవరిలో మాట.. మార్చిలో అచరణ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మద్య స్నేహబంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో చంద్రబాబు…

11 hours ago

జనసేన వైపు బొత్స మనసు లాగుతోందా..?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…

13 hours ago

నాన్న పోయినా ఏడవని తమన్

సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…

14 hours ago