బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అప్పుడు ముంబయి కూడా అట్టుడికిపోయింది. అల్లరి మూకల దాడుల్లో తీవ్ర నష్టం జరిగింది. అప్పటి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ బాధ్యతలు తీసుకున్నారు. కానీ అప్పుడు సీఎంగా అయిష్టంగానే కుర్చీ ఎక్కానని ఆయన తాజాగా వెల్లడించారు. 1993లో ఇష్టం లేకున్నా భావోద్వేగపూరిత వాతావరణంలో మహారాష్ట్రకు సీఎం అయ్యానని ఆయన పేర్కొన్నారు.
అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా శరద్ పవార్ పని చేశారు. కానీ బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ముంబయిలో చెలరేగిన అల్లర్లను అణచివేసి శాంతిని నెలకొల్పడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టక తప్పలేదని పవార్ అన్నారు. “1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం మొదలైన అల్లర్లు ముంబయిని కుదిపేశాయి. రెండు వారాలకు పైగా జనజీవనం స్తంభించింది. అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్న నన్ను మహారాష్ట్ర వెళ్లి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆదేశించారు. కానీ అందుకు నేను మొదట తిరస్కరించా. ఆ తర్వాత అల్లర్లు మరిన్ని నగరాలకు విస్తరించాయి.
అప్పుడు పీవీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎన్కేపీ సాల్వే తదితరులు, నేను సమావేశమయ్యాం. ఆ తర్వాత పీవీ నన్ను కార్యాలయానికి పిలిచి మహారాష్ట్రకు సీఎంగా వెళ్లడం తప్ప మరో దారి కనిపించడం లేదని చెప్పారు. ఆరు గంటల పాటు నన్ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. నేను పుట్టి పెరిగిన రాష్ట్రం, నగరం తగలబడిపోతుంది. ఈ పరిస్థితుల్లోనూ నువ్వు అక్కడికి వెళ్లకపోతే అంతకంటే విచారం మరొకటి ఉండదు అని పీవీ చెప్పారు. భావోద్వేగానికి గురైన నేను రాష్ట్రానికి తిరిగి వచ్చా” అని పవార్ పేర్కొన్నారు.
రాష్ట్రం తగలబడుతోందని చెప్పిన పీవీ.. పవార్లో భావోద్వేగాలను బయటకు తీశారు. దీంతో ఆయన మహారాష్ట్ర సీఎంగా పదవి చేపట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో శాంతిని తిరిగి పునరుద్ధరించడం సంతృప్తినిచ్చిందని ఆయన చెప్పారు.
This post was last modified on December 30, 2021 4:35 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…