రాజకీయాల్లో ఉన్న నాయకులు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ చిన్న తేడా వచ్చినా.. పరిస్థితి చేయి దాటి పోవడం ఖాయం. బీజేపీ రాష్ట్ర చీఫ్.. ఆర్ ఎస్ ఎస్ వాది సోము వీర్రాజు చేసిన ఒకే ఒక్క కామెంట్.. సంప్రదాయ బీజేపీ వాదులను పార్టీకి దూరం చేసే ప్రమాదాన్ని తీసుకువచ్చింది. అంతేకాదు.. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీడియా ఇప్పుడు ఆయనను ఏకేస్తోంది.
దీంతో సోము వ్యాఖ్యలపై జాతీయ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. విజయవాడ వేదికగా.. బీజేపీ నాయకులు తాజాగా ప్రజాగ్రహ సభను నిర్వహించారు. ఈ సభకు ఢిల్లీ నుంచిరాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నాయకులు వచ్చాయి. ఈ క్రమంలో సోము.. ఆవేశానికి గురయ్యారు. ఆవేదనకు కూడా లోనయ్యారు. ఇవ్వకూడని హామీని ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే.. చీప్ లిక్కర్ను రూ.70 కే ఇస్తామని.. అంతేకాదు.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక చీప్ లిక్కర్ను రూ.50కే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఈ ఒక్క వ్యాఖ్యే ఇప్పుడు కోట్ల మంది ప్రజల మధ్య చర్చకు వస్తోంది. బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే.. తమ కుటుంబాలు నాశనం అయిపోవడం ఖాయమని పేదలు అంటుంటే.. అంత పెద్ద బీజేపీ ఎలాంటి అంశాలూ లేవన్నట్టుగా.. చీప్ లిక్కర్ హామీ ఇచ్చి.. చీప్ పాలిటిక్స్ చేస్తోందా? అని జాతీయ మీడియా నిప్పులు చెరిగింది.
పలువురు జాతీయ స్థాయి ప్రముఖులు కూడా సోమును టార్గెట్ చేశారు. వాస్తవానికి బీజేపీ లిక్కర్ వ్యతిరేక పార్టీ. కానీ, సోము మాత్రం ఏ మూడ్లో ఉన్నారో.. అనూహ్యంగా ఆయన నోటి నుంచి ఈ ప్రస్తావన వచ్చింది.
దీంతో ఇప్పటి వరకు బీజేపీపై ఆశలు పెట్టుకున్నవారు కూడా ఇంకేముంది.. బీజేపీ వస్తే.. చీప్ లిక్కర్ ఇస్తారన్న మాట.. హోదా పోయింది.. పోలవరం పోయింది.. రాజధాని పోయింది.. చివరకు మనకు లిక్కరే మిగులుతుందని తేల్చారా? అని పెదవి విరుస్తున్నారు. సోము వ్యాఖ్యలు పార్టీకి మరింత చేటు చేశాయని బీజేపీ నాయకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆయనను మారుస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on December 30, 2021 8:44 am
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…