ఏపీ ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న హత్య కేసుపై బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన కీలక నేత .. ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వంపైనా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో తన పేరు ప్రచారం చేశారని.. కానీ కోర్టుల జోక్యంతో అసలు కథ బయటికి వచ్చిందన్నారు. ఈ కేసులో తర్వలోనే కీలక అరెస్ట్లు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్నవారు ఎక్కడ దాక్కున్నా.. ఎంతవారైనా.. ఎవరు అండగా ఉన్నా.. వారిని అరెస్టు చేయడం ఖాయమని అన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో త్వరలోనే కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని.. ఆదినారాయణరెడ్డి అన్నారు. తానే హత్య చేయించానంటూ అప్పట్లో బురదజల్లిన వైసీపీ నేతలు… ఇప్పుడు కథ అడ్డం తిరిగే సరికి దిక్కుతోచని స్థితిలో చిక్కారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంస పాలన పోవాలంటే బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా సొంత చిన్నాన్న హత్య కేసును సైతం విచారించలేని జగన్ ప్రభుత్వం అవసరమా? అని వ్యాఖ్యానించారు.
“వివేకా హత్య ఘటనలో నా పేరు ప్రచారం చేశారు. వివేకా హత్య కేసులో అరెస్టుల సినిమా ఇంకా ఉంది. త్వరలోనే కీలక అరెస్ట్లు జరిగే అవకాశం ఉంది. అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారు. వాళ్లకు భూములు ఎక్కడ ఉంటే.. అక్కడ రాజధాని ఉండాలనేది వాళ్ల ఆలోచన. పద్మనాభస్వామి ఆదాయం కంటే జగన్ ఆదాయమే ఎక్కువ” అని ఆదినారాయణ రెడ్డి అన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నందునే రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని.. లేకపోతే.. ఈ ప్రభుత్వంపై తిరగబడే వారని ఆది నారాయణరెడ్డి కామెంట్లు చేశారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని దుయ్యబట్టారు. ప్రతి విషయంలోనూ.. ప్రతిపక్షాలను బూచిగా చూపిస్తున్నారని విరుచుకుపడ్డారు. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. చెప్పారు.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…