ఏపీ ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న హత్య కేసుపై బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన కీలక నేత .. ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వంపైనా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో తన పేరు ప్రచారం చేశారని.. కానీ కోర్టుల జోక్యంతో అసలు కథ బయటికి వచ్చిందన్నారు. ఈ కేసులో తర్వలోనే కీలక అరెస్ట్లు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్నవారు ఎక్కడ దాక్కున్నా.. ఎంతవారైనా.. ఎవరు అండగా ఉన్నా.. వారిని అరెస్టు చేయడం ఖాయమని అన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో త్వరలోనే కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని.. ఆదినారాయణరెడ్డి అన్నారు. తానే హత్య చేయించానంటూ అప్పట్లో బురదజల్లిన వైసీపీ నేతలు… ఇప్పుడు కథ అడ్డం తిరిగే సరికి దిక్కుతోచని స్థితిలో చిక్కారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంస పాలన పోవాలంటే బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా సొంత చిన్నాన్న హత్య కేసును సైతం విచారించలేని జగన్ ప్రభుత్వం అవసరమా? అని వ్యాఖ్యానించారు.
“వివేకా హత్య ఘటనలో నా పేరు ప్రచారం చేశారు. వివేకా హత్య కేసులో అరెస్టుల సినిమా ఇంకా ఉంది. త్వరలోనే కీలక అరెస్ట్లు జరిగే అవకాశం ఉంది. అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారు. వాళ్లకు భూములు ఎక్కడ ఉంటే.. అక్కడ రాజధాని ఉండాలనేది వాళ్ల ఆలోచన. పద్మనాభస్వామి ఆదాయం కంటే జగన్ ఆదాయమే ఎక్కువ” అని ఆదినారాయణ రెడ్డి అన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నందునే రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని.. లేకపోతే.. ఈ ప్రభుత్వంపై తిరగబడే వారని ఆది నారాయణరెడ్డి కామెంట్లు చేశారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని దుయ్యబట్టారు. ప్రతి విషయంలోనూ.. ప్రతిపక్షాలను బూచిగా చూపిస్తున్నారని విరుచుకుపడ్డారు. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. చెప్పారు.
This post was last modified on December 29, 2021 11:31 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…