ఆంధ్రప్రదేశ్లో ఇంకే సమస్యా లేనట్లు సినిమా టికెట్లు, థియేటర్ల వ్యవహారాన్ని నెత్తికెత్తుకుంది అక్కడి యంత్రాంగం. ఉన్నతాధికారులు థియేటర్ల మీద దాడులు చేస్తుంటే.. మంత్రులు టికెట్ల ధరల అంశం మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎవరు కాస్త నోరు విప్పినా.. వారిని గట్టిగా కౌంటర్ చేస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రుల టార్గెట్గా మారాడు నేచురల్ స్టార్ నాని. టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబడుతూ అతను చేసిన వ్యాఖ్యలపై మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని ఒకరి తర్వాత ఒకరు కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే.
వీరిలో పేర్ని నాని టికెట్ల ధరల దగ్గర ఆగకుండా హీరోల రెమ్యూనరేషన్లు, సినిమాల బడ్జెట్ల మీద పరిధిని దాటే వ్యాఖ్యలు చేశారు. హీరోల పారితోషకాలు తగ్గించాలంటూ పరోక్షంగా తమ రాజకీయ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ను ఆయన లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించింది.
ఇదిలా ఉంటే సినిమాలకు సంబంధించి విషయాల్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడాను వివరించే ప్రయత్నం చేశారాయన. తాము అందరినీ ఒకేలా చూస్తామని, తెలుగుదేశం ప్రభుత్వంలా కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణ చెబుతూ.. చంద్రబాబు తన బామ్మర్ది సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిందంటూ పన్ను మినహాయింపు ఇచ్చారని.. కానీ అలాంటి చారిత్రక కథతోనే రూపొందిన చిరంజీవి సినిమా ‘సైరా’కు మాత్రం ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వలేదని.. తమ ప్రభుత్వంలో అలాంటి తేడాలు ఉండవని, అందరినీ ఒకేలా చూస్తామని అన్నారాయన. ఈ మాట విని విస్తుబోవడం జనాల వంతైంది.
‘సైరా’ సినిమా రిలీజైంది 2019లో. అప్పుడు అధికారంలో ఉన్నది జగన్ సర్కారే. అసలు దీనికి పన్ను మినహాయింపివ్వాలని ‘సైరా’ టీం కోరిందో లేదో తెలియదు. ఒక వేళ అడిగి లేదనిపించుకున్నా.. ఆ నింద ప్రస్తుత ప్రభుత్వంపై పడుతుంది కానీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే విడ్డూరం. నిజానికి ఈ పన్ను మినహాయింపు విషయంలో రచ్చ జరిగింది ‘రుద్రమదేవి’ మూవీకి. ‘శాతకర్ణి’కి మినహాయింపు ఇచ్చి తమ సినిమాకు ఇవ్వలేదని గుణశేఖర్ నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే అప్పట్లో తెలంగాణ విభజన నేపథ్యంలో సెంటిమెంట్ బాగా ఉన్న ఆరోజుల్లో ఓరుగల్లును ఏలిన రుద్రమదేవి కథ కావడం తెలంగాణ ప్రాంత చారిత్రక నేపథ్య సినిమా కావడం వల్ల తెలంగాణ సర్కారు దానికి మినహాయింపు ఇచ్చింది.
This post was last modified on December 29, 2021 11:16 am
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…