Political News

గాంధీలో పేషెంట్ డెడ్‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌

హైద‌రాబాద్‌లో క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స అందించ‌డంలో కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న గాంధీ ఆసుప‌త్రిలో మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక్క‌డ గ‌తంలో క‌రోనా పేషెంట్ తాలూకు బంధువులు ఓ వైద్యుడిపై దాడి చేయ‌డం.. వైద్యులంతా నిర‌స‌న‌కు దిగ‌డం.. ఉద్రిక్త‌త నెల‌కొన‌డం తెలిసిందే. ఆ నేప‌థ్యంలోనే వారికి క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు. అలాగే వైద్యుల‌పై దాడి చేసే వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లుపెట్టారు. అయినా స‌రే.. తాజాగా ఓ పేషెంట్ తాలూకు వ్య‌క్తి మ‌ళ్లీ ఓ వైద్యుడిపై దాడి చేశాడు. 55 ఏళ్ల క‌రోనా పేషెంట్ సోమ‌వారం గాంధీలో ప్రాణాలు కోల్పోగా.. అత‌డి అటెండెంట్ ఆగ్ర‌హం ప‌ట్ట‌లేక ఓ జూనియ‌ర్ డాక్ట‌ర్ మీద దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది.

సద‌రు పేషెంట్‌కు ఇప్ప‌టికే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లుండ‌గా.. క‌రోనా ఎటాక్ అయి ప‌రిస్థితి విష‌మించింది. అత‌నున్న ప‌రిస్థితుల్లో బెడ్ దిగి టాయిలెట్‌కు వెళ్లొద్ద‌ని వైద్యులు సూచించార‌ట‌. కానీ అత‌ను వైద్యులు లేని స‌మ‌యంలో టాయిలెట్‌కు వెళ్లి అక్క‌డే కుప్ప‌కూలి చ‌నిపోయిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. ఐతే పేషెంట్ మృతి గురించి తెలిసిన అటెండెంట్.. ఆవేశంగా వెళ్లి ప్లాస్టిక్ స్టూల్ తీసి వైద్యుడిపై విసిరాడ‌ట‌. అంత‌టితో ఆగ‌కుండా ఐరెన్ స్టూల్ తీసి చేతిపై కొట్టాడ‌ట‌. దీంతో వైద్యుడికి గాయాల‌య్యాయి. విష‌యం తెలిసిన గాంధీ వైద్యులంద‌రూ విధుల్ని బ‌హిష్క‌రించి ఆసుప‌త్రి ప్రాంగణంలో నిర‌స‌న‌కు దిగారు. డ్యూటీలో లేని డాక్ట‌ర్లు కూడా విష‌యం తెలిసి అక్క‌డికొచ్చి ఆందోళ‌న‌లో నెల‌కొన్నారు. దీంతో గాంధీ ఆసుప‌త్రిలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

This post was last modified on June 9, 2020 11:11 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

12 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

43 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago