Political News

గాంధీలో పేషెంట్ డెడ్‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌

హైద‌రాబాద్‌లో క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స అందించ‌డంలో కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న గాంధీ ఆసుప‌త్రిలో మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక్క‌డ గ‌తంలో క‌రోనా పేషెంట్ తాలూకు బంధువులు ఓ వైద్యుడిపై దాడి చేయ‌డం.. వైద్యులంతా నిర‌స‌న‌కు దిగ‌డం.. ఉద్రిక్త‌త నెల‌కొన‌డం తెలిసిందే. ఆ నేప‌థ్యంలోనే వారికి క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు. అలాగే వైద్యుల‌పై దాడి చేసే వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లుపెట్టారు. అయినా స‌రే.. తాజాగా ఓ పేషెంట్ తాలూకు వ్య‌క్తి మ‌ళ్లీ ఓ వైద్యుడిపై దాడి చేశాడు. 55 ఏళ్ల క‌రోనా పేషెంట్ సోమ‌వారం గాంధీలో ప్రాణాలు కోల్పోగా.. అత‌డి అటెండెంట్ ఆగ్ర‌హం ప‌ట్ట‌లేక ఓ జూనియ‌ర్ డాక్ట‌ర్ మీద దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది.

సద‌రు పేషెంట్‌కు ఇప్ప‌టికే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లుండ‌గా.. క‌రోనా ఎటాక్ అయి ప‌రిస్థితి విష‌మించింది. అత‌నున్న ప‌రిస్థితుల్లో బెడ్ దిగి టాయిలెట్‌కు వెళ్లొద్ద‌ని వైద్యులు సూచించార‌ట‌. కానీ అత‌ను వైద్యులు లేని స‌మ‌యంలో టాయిలెట్‌కు వెళ్లి అక్క‌డే కుప్ప‌కూలి చ‌నిపోయిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. ఐతే పేషెంట్ మృతి గురించి తెలిసిన అటెండెంట్.. ఆవేశంగా వెళ్లి ప్లాస్టిక్ స్టూల్ తీసి వైద్యుడిపై విసిరాడ‌ట‌. అంత‌టితో ఆగ‌కుండా ఐరెన్ స్టూల్ తీసి చేతిపై కొట్టాడ‌ట‌. దీంతో వైద్యుడికి గాయాల‌య్యాయి. విష‌యం తెలిసిన గాంధీ వైద్యులంద‌రూ విధుల్ని బ‌హిష్క‌రించి ఆసుప‌త్రి ప్రాంగణంలో నిర‌స‌న‌కు దిగారు. డ్యూటీలో లేని డాక్ట‌ర్లు కూడా విష‌యం తెలిసి అక్క‌డికొచ్చి ఆందోళ‌న‌లో నెల‌కొన్నారు. దీంతో గాంధీ ఆసుప‌త్రిలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

This post was last modified on June 9, 2020 11:11 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

8 mins ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

13 mins ago

మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!

‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…

2 hours ago

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…

3 hours ago

మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ…

8 hours ago

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…

9 hours ago