Political News

గాంధీలో పేషెంట్ డెడ్‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌

హైద‌రాబాద్‌లో క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స అందించ‌డంలో కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న గాంధీ ఆసుప‌త్రిలో మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక్క‌డ గ‌తంలో క‌రోనా పేషెంట్ తాలూకు బంధువులు ఓ వైద్యుడిపై దాడి చేయ‌డం.. వైద్యులంతా నిర‌స‌న‌కు దిగ‌డం.. ఉద్రిక్త‌త నెల‌కొన‌డం తెలిసిందే. ఆ నేప‌థ్యంలోనే వారికి క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు. అలాగే వైద్యుల‌పై దాడి చేసే వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లుపెట్టారు. అయినా స‌రే.. తాజాగా ఓ పేషెంట్ తాలూకు వ్య‌క్తి మ‌ళ్లీ ఓ వైద్యుడిపై దాడి చేశాడు. 55 ఏళ్ల క‌రోనా పేషెంట్ సోమ‌వారం గాంధీలో ప్రాణాలు కోల్పోగా.. అత‌డి అటెండెంట్ ఆగ్ర‌హం ప‌ట్ట‌లేక ఓ జూనియ‌ర్ డాక్ట‌ర్ మీద దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది.

సద‌రు పేషెంట్‌కు ఇప్ప‌టికే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లుండ‌గా.. క‌రోనా ఎటాక్ అయి ప‌రిస్థితి విష‌మించింది. అత‌నున్న ప‌రిస్థితుల్లో బెడ్ దిగి టాయిలెట్‌కు వెళ్లొద్ద‌ని వైద్యులు సూచించార‌ట‌. కానీ అత‌ను వైద్యులు లేని స‌మ‌యంలో టాయిలెట్‌కు వెళ్లి అక్క‌డే కుప్ప‌కూలి చ‌నిపోయిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. ఐతే పేషెంట్ మృతి గురించి తెలిసిన అటెండెంట్.. ఆవేశంగా వెళ్లి ప్లాస్టిక్ స్టూల్ తీసి వైద్యుడిపై విసిరాడ‌ట‌. అంత‌టితో ఆగ‌కుండా ఐరెన్ స్టూల్ తీసి చేతిపై కొట్టాడ‌ట‌. దీంతో వైద్యుడికి గాయాల‌య్యాయి. విష‌యం తెలిసిన గాంధీ వైద్యులంద‌రూ విధుల్ని బ‌హిష్క‌రించి ఆసుప‌త్రి ప్రాంగణంలో నిర‌స‌న‌కు దిగారు. డ్యూటీలో లేని డాక్ట‌ర్లు కూడా విష‌యం తెలిసి అక్క‌డికొచ్చి ఆందోళ‌న‌లో నెల‌కొన్నారు. దీంతో గాంధీ ఆసుప‌త్రిలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

This post was last modified on June 9, 2020 11:11 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

2 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

3 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

4 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

4 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

4 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

4 hours ago