హైదరాబాద్లో కరోనా పేషెంట్లకు చికిత్స అందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న గాంధీ ఆసుపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ గతంలో కరోనా పేషెంట్ తాలూకు బంధువులు ఓ వైద్యుడిపై దాడి చేయడం.. వైద్యులంతా నిరసనకు దిగడం.. ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే వారికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అలాగే వైద్యులపై దాడి చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అయినా సరే.. తాజాగా ఓ పేషెంట్ తాలూకు వ్యక్తి మళ్లీ ఓ వైద్యుడిపై దాడి చేశాడు. 55 ఏళ్ల కరోనా పేషెంట్ సోమవారం గాంధీలో ప్రాణాలు కోల్పోగా.. అతడి అటెండెంట్ ఆగ్రహం పట్టలేక ఓ జూనియర్ డాక్టర్ మీద దాడి చేసినట్లు తెలుస్తోంది.
సదరు పేషెంట్కు ఇప్పటికే తీవ్ర అనారోగ్య సమస్యలుండగా.. కరోనా ఎటాక్ అయి పరిస్థితి విషమించింది. అతనున్న పరిస్థితుల్లో బెడ్ దిగి టాయిలెట్కు వెళ్లొద్దని వైద్యులు సూచించారట. కానీ అతను వైద్యులు లేని సమయంలో టాయిలెట్కు వెళ్లి అక్కడే కుప్పకూలి చనిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఐతే పేషెంట్ మృతి గురించి తెలిసిన అటెండెంట్.. ఆవేశంగా వెళ్లి ప్లాస్టిక్ స్టూల్ తీసి వైద్యుడిపై విసిరాడట. అంతటితో ఆగకుండా ఐరెన్ స్టూల్ తీసి చేతిపై కొట్టాడట. దీంతో వైద్యుడికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన గాంధీ వైద్యులందరూ విధుల్ని బహిష్కరించి ఆసుపత్రి ప్రాంగణంలో నిరసనకు దిగారు. డ్యూటీలో లేని డాక్టర్లు కూడా విషయం తెలిసి అక్కడికొచ్చి ఆందోళనలో నెలకొన్నారు. దీంతో గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…