Political News

YSRCP: ఇలా అయితే.. ఏ `స్వామీ` కాపాడ‌లేరా?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఒక విష‌యం ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌రకు ఏపీ సర్కారుపై ఎటు నుంచి దాడి జ‌రిగినా.. అంతో ఇంతో కొంద‌రు స్వాములు కాపాడుతూ వ‌చ్చారు. కానీ, ఇప్పుడు ఏ స్వామీ కూడా వైసీపీని కాపాడే ప‌రిస్థితి లేకుండా పోయింద‌నే వాద‌న పార్టీ నేత‌ల నుంచి వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. తాజాగా తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో డ‌బ్బున్న వారికోసం కోటి రూపాయ‌ల టికెట్‌తో ఉద‌యాస్త‌మాన ద‌ర్శ‌నం/ సేవ‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ఎవ‌రు ఎలా స్పందించినా.. హిందూ ధార్మిక సంస్థ‌లు, మ‌ఠాధిప‌తులు మాత్రం సీరియ‌స్ అయ్యారు.

ఉదయాస్తమాన సేవలను రూ.కోటికి వేలం వేయడం అనుచితమైన నిర్ణ యంగా వారు పేర్కొంటున్నారు వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పడం హాస్యాస్పదమ‌ని కూడా త‌ప్పుబ‌డుతున్నారు. ఈ మేర‌కు పంపాక్షేత్రం, కిష్కింధ, స్వర్ణహంపి మఠాధిపతి గోవిందానంద సరస్వతి ఏపీ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు.  శ్రీవారి సేవ‌ల‌ను రూ.కోటికి వెలకట్టే అధికారం టీటీడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన పాలకమండలి అవినీతికి కేరాఫ్‌గా మారిందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తిరుమలలో ఐఏఎస్‌ అధికారులు ఆలయ‌ సంప్రదాలను భ్రష్టుపట్టిస్తూ, అర్చకులపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి టీటీడీ నుంచి ఈవో, చైర్మన్‌, ధర్మకర్తల మండలి ప్రతినిధులు గౌరవప్రదంగా బయటకు వెళ్లిపోయి పెద్దజియ్యర్‌, చిన్నజియ్యర్‌లకు బాధ్యతలు అప్పగించాలన్నారు.  అయితే.. ఈయ‌న ఒక్క‌డే ఇలా వ్యాఖ్యానించ‌లేదు. ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కూడా ఏపీ స‌ర్కారుపై ఫైర‌య్యారు. శ్రీవారి దర్శనాన్ని కేవలం డబ్బున్న వారికే పరిమితం చేస్తున్నారా! అన్న సందేహం కలుగుతోందన్నారు.

ఎవరిని అడిగి టికెట్ల ధరలు పెంచుతున్నారు? అని నిల‌దీశారు.  టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని, అనాలోచిత నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే టీటీడీ పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు. మొత్తంగా.. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. వైసీపీ నేత‌లు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీని నుంచి ఏ స్వ‌రూపానంద స‌రస్వ‌తీ కూడా ర‌క్షించ‌లేర‌ని వ్యాఖ్యానిస్తున్నారు మేధావులు. మ‌రి ఇప్ప‌టికైనా జాగ్ర‌త్త ప‌డ‌తారో లేదో చూడాలి. 

This post was last modified on December 22, 2021 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago