Political News

YSRCP: ఇలా అయితే.. ఏ `స్వామీ` కాపాడ‌లేరా?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఒక విష‌యం ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌రకు ఏపీ సర్కారుపై ఎటు నుంచి దాడి జ‌రిగినా.. అంతో ఇంతో కొంద‌రు స్వాములు కాపాడుతూ వ‌చ్చారు. కానీ, ఇప్పుడు ఏ స్వామీ కూడా వైసీపీని కాపాడే ప‌రిస్థితి లేకుండా పోయింద‌నే వాద‌న పార్టీ నేత‌ల నుంచి వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. తాజాగా తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో డ‌బ్బున్న వారికోసం కోటి రూపాయ‌ల టికెట్‌తో ఉద‌యాస్త‌మాన ద‌ర్శ‌నం/ సేవ‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ఎవ‌రు ఎలా స్పందించినా.. హిందూ ధార్మిక సంస్థ‌లు, మ‌ఠాధిప‌తులు మాత్రం సీరియ‌స్ అయ్యారు.

ఉదయాస్తమాన సేవలను రూ.కోటికి వేలం వేయడం అనుచితమైన నిర్ణ యంగా వారు పేర్కొంటున్నారు వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పడం హాస్యాస్పదమ‌ని కూడా త‌ప్పుబ‌డుతున్నారు. ఈ మేర‌కు పంపాక్షేత్రం, కిష్కింధ, స్వర్ణహంపి మఠాధిపతి గోవిందానంద సరస్వతి ఏపీ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు.  శ్రీవారి సేవ‌ల‌ను రూ.కోటికి వెలకట్టే అధికారం టీటీడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన పాలకమండలి అవినీతికి కేరాఫ్‌గా మారిందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తిరుమలలో ఐఏఎస్‌ అధికారులు ఆలయ‌ సంప్రదాలను భ్రష్టుపట్టిస్తూ, అర్చకులపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి టీటీడీ నుంచి ఈవో, చైర్మన్‌, ధర్మకర్తల మండలి ప్రతినిధులు గౌరవప్రదంగా బయటకు వెళ్లిపోయి పెద్దజియ్యర్‌, చిన్నజియ్యర్‌లకు బాధ్యతలు అప్పగించాలన్నారు.  అయితే.. ఈయ‌న ఒక్క‌డే ఇలా వ్యాఖ్యానించ‌లేదు. ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కూడా ఏపీ స‌ర్కారుపై ఫైర‌య్యారు. శ్రీవారి దర్శనాన్ని కేవలం డబ్బున్న వారికే పరిమితం చేస్తున్నారా! అన్న సందేహం కలుగుతోందన్నారు.

ఎవరిని అడిగి టికెట్ల ధరలు పెంచుతున్నారు? అని నిల‌దీశారు.  టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని, అనాలోచిత నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే టీటీడీ పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు. మొత్తంగా.. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. వైసీపీ నేత‌లు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీని నుంచి ఏ స్వ‌రూపానంద స‌రస్వ‌తీ కూడా ర‌క్షించ‌లేర‌ని వ్యాఖ్యానిస్తున్నారు మేధావులు. మ‌రి ఇప్ప‌టికైనా జాగ్ర‌త్త ప‌డ‌తారో లేదో చూడాలి. 

This post was last modified on December 22, 2021 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

10 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

49 minutes ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

11 hours ago