Political News

కేసీఆర్ పై వార్… అమిత్ షా పవర్స్

తెలంగాణ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక మాదిరిగా సాగిన తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌,  ప్ర‌తిప‌క్షం బీజేపీ ల మ‌ధ్య రాజ‌కీయాలు.. మ‌రింత సెగ‌లు పొగ‌లు క‌క్క‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం కేసీఆర్ విష‌యంలో చూచాయ‌గా.. చూస్తూ.. పోతున్న కేంద్రంలోని బీజేపీ నేత‌లు.. ఇప్పుడు ప‌ట్టు బిగించారు. “ఇక‌, మీరూ చెల‌రేగండి.“ అంటూ.. రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది.

నిజానికి ఎవ‌రి గ్రీన్ సిగ్న‌ల్ లేకుండానే.. రెచ్చిపోతున్న బీజేపీ నాయ‌కులు.. ఇప్పుడు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డం ఇక‌, ముందు.. కేసీఆర్ వ‌ర్సెస్ బీజేపీ నేత‌ల మ‌ధ్య చండ్ర‌నిప్పులు చెల‌రేగ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా సీఎం కేసీఆర్‌పై యుద్ధం చేయాలని రాష్ట్ర‌ బీజేపీ నాయకులకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా సూచించారు. తాజాగా ఆయ‌న‌ ఢిల్లీలో బీజేపీ తెలంగాణ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలన్నారు. కేసీఆర్‌ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. హుజురాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలవాలని నాయకులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి.. ప్రభుత్వపరంగా ఏం చేయాలో తమకు వదిలేయాలని ఆయన పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తానని నాయకులకు అమిత్‌షా హామీ ఇచ్చారు.

సో.. దీనిని బ‌ట్టి.. కేంద్రంలో బీజేపీ నాయ‌కులు కేసీఆర్‌పై యుద్ధ‌మే చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు  స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంంలో కేంద్రాన్ని దుయ్య‌బ‌ట్ట‌డం.. కేంద్రంపై విమ‌ర్శ‌లు చేయ‌డం.. కేంద్ర మంత్రిని దూషించ‌డం..చేస్తున్న కేసీఆర్ అండ్ కో పై కేంద్ర ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్‌గానే ఉంది. ఇప్ప‌టికే ఒక‌టికి రెండు సార్లు.. బియ్యం, ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రులు ఇద్ద‌రు ముగ్గురు వివ‌ర‌ణ ఇచ్చారు.అ యిన‌ప్ప‌టికీ.. కేసీఆర్‌.. మాత్రం త‌న ధోర‌ణిలోనే పోతున్నారు.. కేంద్రంలోని బీజేపీ అన్యాయం చేస్తోంద‌ని ఫోక‌స్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంద‌నే విష‌యంపై నివేదిక‌లు తెప్పించుకున్న కేంద్ర బీజేపీ నేత‌లు.. ఇప్పుడు చాలా సీరియ‌స్ అవ్వాల‌నే సందేశాన్ని పంపించారు. దీంతో ఇక నుంచి రోజుకో విమ‌ర్శ పూట‌కో దూష‌ణ‌లు ష‌రా మామూలుగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. కేంద్రం వ్యూహం చూస్తే.. తెలంగాణ‌లో రాజ‌కీయ ర‌ణ‌రంగం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

This post was last modified on December 22, 2021 10:18 am

Share

Recent Posts

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

23 minutes ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

44 minutes ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

50 minutes ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

7 hours ago

వైసీపీకి మ‌రో షాక్ త‌ప్ప‌దా.. !

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చూసింది ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో…

8 hours ago

డీజే దెబ్బకు ఆగిన గుండె.. అసలేంటీ డీజే?

ప్ర‌స్తుతం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన 'డీజే సౌండ్‌' వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన వినాయ‌క నిమ‌జ్జ‌న…

9 hours ago