వంగవీటి రాధాకృష్ణకు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడే టికెట్ కన్ఫర్మ్ చేశారా ? అవుననే పార్టీలో ప్రచారం జరుగుతోంది. విజయవాడలోని తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో రాధా పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నారు. రాధా దృష్టంతా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మీదే ఉంది. అయితే సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం రావడం లేదు. దాంతో రాధా కూడా సమాధానపడిపోయినట్లు సమాచారం.
అప్పుడెప్పుడో చాలాకాలం క్రితం సెంట్రల్ నుంచి రాధా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి పోటీ చేయటమే కానీ గెలిచింది లేదు. దానికి తోడు రాధా జనాల్లో తిరగటం కూడా తక్కువే. అవసరమైనప్పుడు మాత్రం కనిపించి మళ్ళీ మాయమైపోతారనే ఆపవాదుంది. అందుకనే వంగవీటి రంగా వారసుడనే మంచి ప్లాట్ ఫామ్ ఉన్నా రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టికెట్ దక్కలేదన్న కారణంగానే వైసీపీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు.
పోనీ టీడీపీలో అయినా టికెట్ దక్కిందా అంటే అదీలేదు. సరే చరిత్రలో నుండి భవిష్యత్తులోకి మారితే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయాలని రాధాకు చంద్రబాబు చెప్పారని ప్రచారం మొదలైంది. అంటే రాబోయే ఎన్నికల్లో కూడా సెంట్రల్ నుండి రాధాకు ఛాన్సు లేనట్లే. ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ ఉన్న కారణంగా రాధాకు అవకాశం రావటం లేదు.
ఇక వైసీపీ విషయానికి వస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ పోటీ చేయటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే రాధా వర్సెస్ అవినాష్ పోటీ ఉండచ్చు. అవినాష్ వ్యవహారం రాధాకు పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే అవినాష్ 24 గంటలూ జనాల్లోనే ఉంటారు. వర్షం వచ్చినా, వరదొచ్చినా, కరోనా వైరస్ సమయంలో కూడా అవినాష్ జనాల్లోనే తిరిగారు. పార్టీలోనే కాకుండా జనాల్లో కూడా మంచి పట్టున్న యువనేతగా అవినాష్ కు పేరుంది. కాకపోతే గుంటూరు కృష్ణా జిల్లాల్లో వైకాపాకు ఈసారి రాజధాని దెబ్బ భారీగా పడనుంది. పైగా రాధా కుటుంబం అంత పాపులారిటీ అవినాష్ కు వ్యక్తిగతంగా లేదు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా ఉండే అవకాశముంది.
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…