Political News

రాధాకు టికెట్ కన్ఫర్మ్?

వంగవీటి రాధాకృష్ణకు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడే టికెట్ కన్ఫర్మ్ చేశారా ? అవుననే పార్టీలో ప్రచారం జరుగుతోంది. విజయవాడలోని తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో రాధా పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నారు. రాధా దృష్టంతా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మీదే ఉంది. అయితే సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం రావడం లేదు. దాంతో రాధా కూడా సమాధానపడిపోయినట్లు సమాచారం.

అప్పుడెప్పుడో చాలాకాలం క్రితం సెంట్రల్ నుంచి రాధా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి పోటీ చేయటమే కానీ గెలిచింది లేదు. దానికి తోడు రాధా జనాల్లో తిరగటం కూడా తక్కువే. అవసరమైనప్పుడు మాత్రం కనిపించి మళ్ళీ మాయమైపోతారనే ఆపవాదుంది. అందుకనే వంగవీటి రంగా వారసుడనే మంచి ప్లాట్ ఫామ్ ఉన్నా రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టికెట్ దక్కలేదన్న కారణంగానే వైసీపీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు.

పోనీ టీడీపీలో అయినా టికెట్ దక్కిందా అంటే అదీలేదు. సరే చరిత్రలో నుండి భవిష్యత్తులోకి మారితే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయాలని రాధాకు చంద్రబాబు చెప్పారని ప్రచారం మొదలైంది. అంటే రాబోయే ఎన్నికల్లో కూడా సెంట్రల్ నుండి రాధాకు ఛాన్సు లేనట్లే. ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ ఉన్న కారణంగా రాధాకు అవకాశం రావటం లేదు.

ఇక వైసీపీ విషయానికి వస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ పోటీ చేయటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే రాధా వర్సెస్ అవినాష్ పోటీ ఉండచ్చు. అవినాష్ వ్యవహారం రాధాకు పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే అవినాష్ 24 గంటలూ జనాల్లోనే ఉంటారు. వర్షం వచ్చినా, వరదొచ్చినా, కరోనా వైరస్ సమయంలో కూడా అవినాష్ జనాల్లోనే తిరిగారు. పార్టీలోనే కాకుండా జనాల్లో కూడా మంచి పట్టున్న యువనేతగా అవినాష్ కు పేరుంది. కాకపోతే గుంటూరు కృష్ణా జిల్లాల్లో వైకాపాకు ఈసారి రాజధాని దెబ్బ భారీగా పడనుంది. పైగా రాధా కుటుంబం అంత పాపులారిటీ అవినాష్ కు వ్యక్తిగతంగా లేదు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా ఉండే అవకాశముంది.

This post was last modified on December 21, 2021 11:17 am

Share

Recent Posts

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

12 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

1 hour ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

1 hour ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

4 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago